యాచారం, న్యూస్లైన్:
చెట్లు, ఇసుక, మట్టి, రాళ్లు... దోచుకున్న వాడికి దండిగా కాసులు కురిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఫిర్యాదులు అందినా పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా తమ దందాను కొనసాగిస్తున్నారు. మండలంలో పలు గ్రామాల్లోని ప్రభుత్వ భూములపై కన్నేసిన వీరు, మట్టి, రాళ్లు, చెట్లు వేటినీ వదలడం లేదు. అధికారులను ప్రసన్నం చేసుకొని కొల్లగొడుతున్న వనరులను తరలించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ వ్యాపారం కొన్నేళ్లుగా సాగుతున్నా, నిరోధించడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మళ్లీ ఇటుక బట్టీల వ్యాపారం షురూ కావడంతో అక్రమార్కుల కన్ను చెరువులు, కుంటలపై పడింది. చింతుల్ల, ధర్మన్నగూడెంలలోని కుంటల నుంచి వందలాది ట్రాక్టర్ల మట్టిని తరలిస్తున్నారు.
యాచారం, నందివనపర్తి, చౌదర్పల్లి తదితర గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టి తవ్వుకుంటున్నారు. యాచారం, తక్కళ్లపల్లి, మొండిగౌరెల్లి, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, నక్కర్తమేడిపల్లి, మాల్ తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లోని గుట్టల్లో రాళ్లను పగులగొట్టి గ్రానైట్గా మార్చి అమ్ముకుంటూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. వాగుల్లోంచి ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గునుగల్, గడ్డమల్లయ్యగూడ, నల్లవెల్లి, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల అటవీ ప్రాంతాల్లోని భూముల్లో మట్టి తవ్వకాలు, చెట్లు నరికి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమార్కుల అగడాలకు కళ్లెం వేయాలని కోరుతున్నారు.
దోచుకున్నోడికి దోచుకున్నంత !
Published Fri, Oct 18 2013 12:05 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement