విభజనకు మూలకారకుడు చంద్రబాబే: కిరణ్ | Former CM Kiran Kumar Reddy fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

విభజనకు మూలకారకుడు చంద్రబాబే: కిరణ్

Apr 10 2014 3:05 PM | Updated on Jul 29 2019 5:31 PM

విభజనకు మూలకారకుడు చంద్రబాబే: కిరణ్ - Sakshi

విభజనకు మూలకారకుడు చంద్రబాబే: కిరణ్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురంలో మాజీ సీఎం కిరణ్ రోడ్ షో నిర్వహించారు. రాష్ట్ర విభజనకు మూలకారకుడు చంద్రబాబే అని ఆరోపించారు. చంద్రబాబువి వెన్నుపోటు రాజకీయాలని ఆయన విమర్శించారు.
 
రాష్ట్ర విభజన విడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు లేఖ ఇవ్వడమే అని కిరణ్ అన్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన పార్టీలకు ఓటు వేయవద్దని ఆయన ప్రజలకు సూచించారు. అనంతపురంలో నిర్వహించిన రోడ్ షోకు పెద్దగా ప్రజల నుంచి స్పందన కనిపించకపోవడంతో కిరణ్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement