ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడంతో జూలై మాసాంతానికే కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని జలాశయాలన్నీ పూర్తిగా నిండాయి. ఆగస్టు మొదటివారంలో నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకోవడంతో ఈ నెల 2వ తేదీ నుంచి కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీ నాటికి సాగర్ జలాశయం 585 అడుగుల నీటిమట్టాన్ని దాటడంతో ఎన్ఎస్పీ అధికారులు క్ర స్ట్గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ నెల 7,8 తేదీల్లో క్రస్ట్గేట్ల ద్వారా 20.84 టీంఎంసీలు, 17 నుంచి 21వ తేదీ వరకు మరో 68.98 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.
నత్తనడకన లోలెవల్ కెనాల్ నిర్మాణం
నాగార్జునసాగర్ జలాశయంలో 575 అడుగులకు పైగా నీటిమట్టం ఉన్న సమయంలో గ్రావిటీ ద్వారా, మిగిలిన సమయంలో మోటార్ల ద్వారా జిల్లాలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో వరద కాల్వ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1997లో 175 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించారు. అగ్రిమెంట్ ప్రకారం ఐదేళ్లలో కాల్వ నిర్మాణ పనులు పూర్తి చేయాలి. గడువు ముగిసి పదేళ్లు కావస్తున్నా నేటికి కాల్వ నిర్మాణం పూర్తి కాలేదు. 17 ఏళ్లుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో టేలాండ్ భూములకు సాగునీరు కలగానే మిగిలింది.
పంపుహౌస్ నిర్మాణంలోనూ జాప్యమే
సాగర్ జలాశయంలో 575 అడుగుల కంటే నీరు తక్కువగా ఉన్నప్పుడు వరద కాల్వలోకి నీటిని పంపింగ్ చేయడానికి రూ. 112 కోట్ల వ్యయంతో పంపుహౌస్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఇవి కూడా మందకొడిగానే సాగుతున్నాయి. వాస్తవానికి పంపుహౌస్ నిర్మాణ పనులు 2009 డిసెంబర్ నాటికి పూర్తి కావాలి. అదీ జరిగింది లేదు. దీంతో అధికారులు ఏటేటా పంపుహౌస్ నిర్మాణ కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. రెండేళ్ల క్రితం పంపుహౌస్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సైతం పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. కానీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి మోటర్లను బిగిస్తామని ఎన్ఎస్పీ అధికారులు చెబుతున్నా..పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పనులు ఇలాగే మందకొడిగా సాగితే పంపుహౌస్ నిర్మాణం పూర్తయ్యే సరికే మరో ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టే అవకాశముంది.
పూర్తికాని డిస్ట్రిబ్యూటరీల తవ్వకం
వరద కాల్వ డిస్ట్రిబ్యూటరీల తవ్వకం కూడా నత్తకు నడకలు నేర్వే విధంగా ఉంది. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోవడంతో తమ భూముల్లో కాల్వలు తవ్వవద్దంటూ రైతులు అక్కడక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో డిస్ట్రిబ్యూటరీల తవ్వకానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వరద కాల్వ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీల తవ్వకం 2009 మార్చి నాటికి పూర్తి కావాలి. కాని పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గత శాసనసభ ఎన్నికలకు ముందు నాటి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హడావిడిగా డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు వదిలిపెట్టారు. దీంతో కాల్వల్లో నీరు చేరి పనులు మరింత ఆలస్యానికి కారణమయ్యాయి. నేటికి ఆ పనులు పూర్తికాలేదు.
‘వరద’ పారేది!
Published Sat, Aug 24 2013 3:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement