కాకినాడలో ఘోర అగ్నిప్రమాదం | fire accident in kakinada | Sakshi
Sakshi News home page

కాకినాడలో ఘోర అగ్నిప్రమాదం

Apr 30 2016 2:34 AM | Updated on Sep 5 2018 9:45 PM

కాకినాడలో ఘోర అగ్నిప్రమాదం - Sakshi

కాకినాడలో ఘోర అగ్నిప్రమాదం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పర్లోపేటలో శుక్రవారం సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో వందకు పైగా పూరిళ్లు దగ్ధమయ్యాయి.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పర్లోపేటలో శుక్రవారం సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో వందకు పైగా పూరిళ్లు దగ్ధమయ్యాయి. 100 కుటుంబాలవారు నిరాశ్రయులయ్యారు. సంఘటనలో పి.సీతారామలక్ష్మి అనే మహిళ తీవ్రంగా గాయపడగా కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్తినష్టం రూ.20 లక్షలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

  వైఎస్ జగన్ ఆరా
అగ్నిప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ద్వారా  సమాచారం తెలుసుకున్న ఆయన వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదం గురించి ఆరా తీశారు. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పార్టీ తరఫున బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement