విరిగిన రైలు పట్టా.. నిలిచిపోయిన పలు రైళ్లు | few trains stoped due to track repairing | Sakshi
Sakshi News home page

విరిగిన రైలు పట్టా.. నిలిచిపోయిన పలు రైళ్లు

Oct 6 2013 11:55 PM | Updated on Sep 1 2017 11:24 PM

వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌-గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టా విరగడంతో పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

మహబూబాబాద్‌, న్యూస్‌లైన్‌: వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌-గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టా విరగడంతో పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పట్టా విరిగిన విషయాన్ని పెట్రోల్‌ మెన్‌ చూడడంతో పెనుప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది కథనం ప్రకారం మహబూబాబాద్‌ మండలం అనంతారం గ్రామ శివారు రైల్వే గేటు-1,2 మధ్య 442/5-3 మైలు రాయి వద్ద అప్‌లైన్‌లో రైలు పట్టా విరిగింది. రాత్రి పూట విధులు నిర్వర్తించే పెట్రోల్‌ మెన్‌ విషయాన్ని గమనించి, సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు.

 

ఆ సమయంలో అప్‌లైన్‌లో వస్తున్న చార్మినార్‌ ఎక్‌‌సప్రెస్‌ డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో రైలును నిలిపివేశారు. ఈ క్రమంలో పలు స్టేషన్లల్లో జీటీ, గరీబ్థ్‌,్ర స్పెషల్‌ ట్రైన్‌, కాకతీయ ఫాస్‌‌ట ప్యాసింజర్‌ ఎక్కడికక్కడే నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం రైళ్లను పునరుద్ధరించారు. దాదాపు గంటకు పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement