కరెంటు కాటుకు రైతన్న బలి | farmer died with short circuit | Sakshi
Sakshi News home page

కరెంటు కాటుకు రైతన్న బలి

Feb 10 2014 12:06 AM | Updated on Oct 1 2018 4:01 PM

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కొండకల్‌లో చోటు చేసుకుంది.

శంకర్‌పల్లి, న్యూస్‌లైన్: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కొండకల్‌లో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ సేవ్యానాయక్  తెలిపిన వివరాల ప్రకారం.. కొండకల్ గ్రామానికి చెందిన ఒగ్గు కృష్ణ (26) వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం పొలంలో బోర్ పనిచేయలేదు. దీంతో స్టార్టర్ వద్ద మరమ్మతులు చేయడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కృష్ణ విద్యుదాఘాతానికి గురయ్యాడు.

దీంతో తీవ్రంగా గాయపడ్డ అతణ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కృష్ణ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య అలివేలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement