ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 302 కేసు నమోదు చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 302 కేసు నమోదు చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. సోమవారం నారాయణ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిశారు.
కాకినాడ జేఎన్టీయూ అక్రమాలపై విచారణ జరిపించాలని నారాయణ గవర్నర్ను కోరారు. అనంతరం నారాయణ మీడియాతో్ మాట్లాడారు. శేషాచలం ఎన్కౌంటర్ ఘటనను తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించకపోతే మంత్రివర్గంతో సహా చంద్రబాబు రాజీనామా చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.