గత ఎన్నికల తో పోల్చితే.. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన పట్టును కోల్పోయింది.
పడిన టీ-కాంగ్రెస్ గ్రాఫ్
May 13 2014 2:28 AM | Updated on Mar 18 2019 7:55 PM
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల తో పోల్చితే.. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన పట్టును కోల్పోయింది. 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి ఆధిక్యాన్ని కనబరిచిన ఆ పార్టీ ఈసారి డీలా పడింది. గతంలో తెలంగాణ జిల్లాలోని 32 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే.. వాటిలో ఏకంగా 27 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
అలాగే వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలోనూ గెలిచి సత్తా చాటింది. అయితే ఈసారి తన ప్రభావాన్ని కోల్పోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. గతంలో వరంగల్లో ఎన్నిక జరిగిన ఒకే ఒక్క మున్సిపాలిటీతో పాటు కరీంనగర్లో ఎన్నికలు జరిగిన నాలుగు మున్సిపాలిటీలు, ఖమ్మంలో 3, ఆదిలాబాద్లో 5, రంగారెడ్డిలోని 2, నల్లగొండలో 4, మెదక్లో 2, మహబూబ్నగర్లోని 4, నిజామాబాద్లోని 2 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ నెగ్గింది. టీడీపీకి మొత్తంగా 2, టీఆర్ఎస్కు 2, సీపీఎంకు 1 మున్సిపాలిటీనే దక్కడం విశేషం.
Advertisement
Advertisement