సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘దేశంలో మరెక్కడాలేని విధంగా శ్రీకాకుళం జిల్లాలో 193 కి.మీ. తీర ప్రాంతం ఉంది. ఇక్కడ పోర్టు ఏర్పాటైతే ఉద్యోగాలొస్తాయి. ఉపాధి దొరుకుతుంది. పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ప్రపంచమంతా ఈ జిల్లావైపే చూస్తుంది. భావనపాడు పోర్టుకు సహకరించండి. రాజధాని ఏర్పాటుకు పిలుపునిస్తే రైతులు 33 వేల ఎకరాల భూమినిచ్చారు. ఎవరికీ అన్యాయం జరగదు. విలువైన భూమి ఇస్తే 25 నుంచి 30 శాతం ఇల్లు, వ్యాపారాభివృద్ధికి కేటాయిస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరులో నిర్వహించిన జనచైతన్యయాత్రలో సీఎం మాట్లాడారు. భావనపాడు, కళింగపట్నంలలో పోర్టులు ఏర్పాటైతే సమీపంలోని జాతీయ ర హదారి ద్వారా ఎగుమతుల్ని పెంచడంతోపాటు ఉపాధి దొరుకుతుందన్నారు. భూములిచ్చే రైతులకు, మత్స్యకారులకు అన్యాయం జరగదని, తనను నమ్మాలంటూ చెప్పుకొచ్చారు. పాత ఇల్లుంటే దాన్ని కొట్టేసి కొత్తగా కట్టిస్తామని హామీ ఇచ్చారు.
ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దు
భావనపాడు పోర్టు విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, వాటి ట్రాప్లో పడొద్దని చంద్రబాబు అన్నారు. జిల్లాకో పోర్టు ఏర్పాటైతే వలసలు తగ్గుతాయని, ప్రపంచమంతా మన దగ్గరకే వస్తుందన్నారు. జనం ఆలోచన విధానం మారాలని హితవు పలికారు. పత్రికలూ సహకరించాలని, నాయకులు అడ్డం పడితే వాటినే నెగిటివ్గా వార్తలు రాయొద్దన్నారు. మత్స్యకార పిల్లలకు ఉపయోగపడే విధంగా యూనివర్సిటీ, హార్టికల్చర్ కళాశాల, ఓపెన్ యూనివర్సిటీ, ఎచ్చెర్ల ప్రాంతంలో రైస్ రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులకూ పెన్షన్లు ఇప్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్నాయుడు, మంత్రులు పరిటాల సునీత, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ ప్రతిభా భారతి, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
జనవరిలో 4,500 కోట్ల రైతు రుణాలు మాఫీ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘వచ్చే జన్మభూమి కార్యక్రమంలో రేషన్కార్డులు, ఇళ్ల పట్టాలు, ఇతరత్రా సమస్యలు పరిష్కరిస్తాం. రైతుల పేరుతో అప్పు తెచ్చి వడ్డీతో సహా వారి రుణాల్ని చెల్తిస్తా. వచ్చే జనవరిలో రూ.4,500 కోట్లు రైతు రుణాలు మాఫీ చేస్తా. రైతు కోసం ఎంత కష్టమైనా భరిస్తా.’ అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో సోమవారం నిర్వహించిన జన చైతన్య యాత్రలో పాల్గొన్న ఆయన 300 అడుగుల దూరం పాదయాత్ర చేసి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతంలో రూ.3 లక్షలతో, పట్టణాల్లో రూ.5.5 లక్షలతో పక్కా ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు.
ఉపాధి హామీ పథకం, 13, 14వ ఆర్థిక సంఘం నిధులతో వచ్చే మూడేళ్లలో అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తామన్నారు. గిరిజనుల ఆమోదంతో బాక్సైట్ను ఉపయోగించుకునేలా ఆలోచన చేస్తున్నట్టు సీఎం తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టు రాకతో విజయనగరం స్మార్ట్ సిటీగా తయారై పరిశ్రమలొస్తాయని, దాని దృష్ట్యా భోగాపురం రైతులు ముందుకొచ్చి భూములివ్వాలని కోరారు. ఇదిలా ఉండగా సీఎంకు సమస్యలు వివరించేందుకు యత్నించిన సీపీఎం నేతల్ని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
‘భావనపాడు’కు సహకరించండి
Published Tue, Dec 8 2015 3:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement