'మీరు చెప్పినట్టు చేయడానికి ఇక్కడ లేం'

'మీరు చెప్పినట్టు చేయడానికి ఇక్కడ లేం' - Sakshi


హైదరాబాద్: ఏపీ రాజధానిపై చర్చకు శాసనసభలో పట్టుబట్టిన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎదురుదాడికి దిగారు. అంతకుముందు వరకు మంత్రులు ఎదురుదాడి చేయగా స్వయంగా సీఎం కూడా అదే పని చేశారు. సంప్రదాయానికి భిన్నంగా పోవడమే కాకుండా అదేమని ప్రశ్నించిన విపక్షంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.



'మీరు చెప్పినట్టు చేయడానికి ఇక్కడ లేము' అంటూ మండిపడ్డారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై లోతుగా చర్చించిన తర్వాతే ప్రకటన చేయాలన్న వైఎస్ఆర్ సీపీ సభ్యులను డిమాండ్ ను పెడచెవిన పెట్టారు. తన పంతమే నెగ్గాలన్న పట్టుదలతో ముందుగా ప్రకటన చేసేశారు చంద్రబాబు. చర్చించిన తర్వాతే ప్రకటన చేస్తే తప్పేంటన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top