రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల మృతి | brother and sister died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల మృతి

Apr 9 2015 5:01 PM | Updated on Nov 6 2018 4:10 PM

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపై ఆటో కోసం వేచి చూస్తున్న అన్నాచెల్లెల్ని ఢీ కొట్టింది.

నక్కపల్లి(విశాఖ) : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపై ఆటో కోసం వేచి చూస్తున్న అన్నాచెల్లెల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన గురువారం విశాఖ జిల్లా నక్కపల్లిలో జాతీయరహదారి-16పై జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా తణుకు సమీపంలోని వేల్చూరుకు చెందిన నక్క మోహన్‌రావు, రమణమ్మ దంపతులకు నక్క రాజేష్(18), నక్క మహిమారత్నం(10) సంతానం. వీరు బతుకుదెరువు కోసం వైజాగ్‌లో ఎలుకల బోన్లు తయారు చేసి అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఎలుకల బోన్లు అమ్మి తిరిగి ఇంటికి వెళ్లేందుకు తల్లితో కలిసి పిల్లలిద్దరూ ఆటో కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అటువైపు వేగంగా వచ్చిన కారు పిల్లలిద్దరినీ ఢీ కొట్టి, రోడ్డుపై ఉన్న ఆటోను సైతం ఢీకొంది. ఈ ప్రమాదంలో అన్నా, చెల్లెలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement