ఈడీ విచారణకు ఢిల్లీ వెళ్లడానికి అనుమతించండి: విజయసాయిరెడ్డి | Auditor Vijaysai Reddy Seeks Court Permission | Sakshi
Sakshi News home page

ఈడీ విచారణకు ఢిల్లీ వెళ్లడానికి అనుమతించండి: విజయసాయిరెడ్డి

Oct 18 2013 2:34 AM | Updated on Aug 9 2018 2:49 PM

ఈడీ విచారణకు ఢిల్లీ వెళ్లడానికి అనుమతించండి: విజయసాయిరెడ్డి - Sakshi

ఈడీ విచారణకు ఢిల్లీ వెళ్లడానికి అనుమతించండి: విజయసాయిరెడ్డి

జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లడానికి అనుమతించాలని ఆడిటర్ విజయసాయిరెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు.

సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజయసాయిరెడ్డి వినతి
 సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లడానికి అనుమతించాలని ఆడిటర్ విజయసాయిరెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. ఈ మేరకు ఆయన గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ, అడ్జుడికేటింగ్ అథారిటీ, అప్పీలేట్ అథారిటీల ముందు విచారణలకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లాలని.. ఇందుకోసం మార్చి 31 వరకు హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరారు. దీనిపై విచారణను ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు శుక్రవారానికి వాయిదా వేశారు. మరోవైపు, ఆడిటర్‌గా క్లయింట్లకు సేవలు అందించేందుకు కర్ణాటక, తమిళనాడు వెళ్లేందుకు అనుమతించాలంటూ సాయిరెడ్డి దాఖలు చేసుకున్న మరో పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement