తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లాల్సిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను రిలీవ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లాల్సిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను రిలీవ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫైలుమీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం పెట్టారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఐదుగురు అధికారులను తమవద్దే అట్టిపెట్టుకుంటామని, వారిని రిలీవ్ చేసేది లేదని చెబుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై నెలకొన్న గందరగోళం ఇంకా తేలాల్సి ఉంది.