గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని పొప్పూడి గ్రామం కొత్తదాబా వద్ద ఓ మహిళను దుండగులు దారుణంగా చంపారు.
గుంటూరు: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని పొప్పూడి గ్రామం కొత్తదాబా వద్ద ఓ మహిళను దుండగులు దారుణంగా చంపారు. తలపై బలంగా బండరాయితో మోదారు. దాంతో మహిళ ముఖం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. పక్కనే మందు సీసాలు, సిగరెట్లు, నిరోధ్ పాకెట్లు ఉన్నాయి. దుండగులు ఆమెను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కుళ్లి పోయి దుర్వాసన వస్తుండటంతో హత్య జరిగి కనీసం 10 రోజులై ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
(చిలకలూరిపేట)