నదిలో ఈతకు దిగి.. బాలుడి మృతి | 15 year old boy dies while swimming in Krishna River | Sakshi
Sakshi News home page

నదిలో ఈతకు దిగి.. బాలుడి మృతి

Jul 25 2015 4:37 PM | Updated on Sep 3 2017 6:09 AM

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణా నదిలో ఈతకు దిగిన బాలుడు ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందాడు.

కృష్ణా జిల్లా (చందర్లపాడు) : కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణా నదిలో ఈతకు దిగిన బాలుడు ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. గుడిమెట్ల గ్రామానికి చెందిన ఎనిమిది మంది బాలురు సరదాగా ఆడుకుందామని కృష్ణానది సమీపానికి వెళ్లారు.

ఆడుకున్న తర్వాత నదిలోకి దిగి ఈతకొడదామని అనుకున్నారు. ఆ ప్రాంతంలో ఇసుక కోసం తవ్విన గుంతలు ఉన్న విషయం తెలియక షేక్ నాగులమీరా(15) అనే బాలుడు నదిలోకి దిగి మునిగి చనిపోయాడు. బాలుడి మృతదేహాన్ని స్థానికులు వెలికి తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement