కృష్ణానదిలో 9 మంది విద్యార్థులు గల్లంతు | Sakshi
Sakshi News home page

కృష్ణానదిలో 9 మంది విద్యార్థులు గల్లంతు

Published Sat, Feb 28 2015 6:15 PM

five missing in krishna river

గుంటూరు(కొల్లూరు): గుంటూరు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కొల్లూరు మండలంలోని చిలుమూరు గ్రామం వద్ద కృష్ణానదిలో ఈతకు దిగిన తొమ్మిది మంది  విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 
 

గల్లంతయిన వారిలో  మహేశ్, ఊట్ల ఈశ్వర్, గణేశ్, సాయి వంశీ, రూపేశ్‌ తదితరులు ఉన్నారు. విద్యార్థులు తెనాలిలోని ఓ  పాఠ శాల విద్యార్థులు.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement