breaking news
-
‘నియంత పాలనకు..చంద్రబాబు సర్కారుకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయ్’
సాక్షి,తాడేపల్లి : సాక్షి,తాడేపల్లి : నియంతలు,నీరోల పాలనకు చంద్రబాబు పాలనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కును మన రాజ్యాంగం కల్పించిందిపాలకులు రాచరికపు పోకడలు పోవటానికి వీల్లేదుకానీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారా?ప్రజల ప్రాథమిక హక్కులన్నిటినీ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారుఅలాంటి చంద్రబాబుకు రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపకునే హక్కు లేదురెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే చంద్రబాబుకు పాలనకు అనర్హుడుచెప్పినట్టు కేసులు పెట్టించకపోతే మంత్రి పదవిలో నుండి దిగిపోవాలని మంత్రి అనితని పవన్ కళ్యాణ్ అన్నారుఇదేనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే తీరు?నియంతలు, నీరోల పాలనకు చంద్రబాబు సర్కారుకు దగ్గరి పోలికలు ఉన్నాయిదళిత నేత నందిగం సురేష్ ను అన్యాయంగా జైలుపాల్జేశారుదళిత నాయకత్వాన్ని చంపేసే కుట్ర చంద్రబాబు చేస్తున్నారువైఎస్ జగన్ దళితులకు అందించిన సంక్షేమాన్ని నిలిపేసిన చంద్రబాబుకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదుచిన్నారులపై అత్యాచారాలు చేసి చంపేస్తుంటే చంద్రబాబు దోషులను ఎందుకు అరెస్టు చేయనీయటం లేదు?జగన్పై నిత్యం విషం చిమ్మటానికే చంద్రబాబు పని చేస్తున్నారుచంద్రబాబు గెలుపులో ఏదో తేడా ఉందని అందరికీ అర్థం అవుతోందిఈవిఎంలలో తేడా వలనే గెలిచారని ప్రజలు అంటున్నారుభారీ సీట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వానికి సోషల్ మీడియా కార్యకర్తలను చూస్తే భయమెందుకు?ఇలాంటి నాయకులను రీకాల్ చేసే పరిస్థితులు రావాలిఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, ఇతర అనేక కార్యక్రమాలను ఆపేసిన చంద్రబాబుకు రాజ్యాంగాన్ని అమలు చేసే హక్కు లేదుఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబుకు రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు లేదుఅభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయిఇక్కడ ఈవీఎంలతో ఎందుకు జరుపుతున్నారు?రాజ్యాంగ పరిరక్షణకు అందరం నడుము బిగించాల్సిన సమయం వచ్చింది కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోము’ అని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. -
నల్ల చట్టాలు తేవడంలో కూటమి సర్కార్ ముందుంది: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: ఏపీలో సోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవడం దారుణమన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉందంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలోని సింగ్ నగర్లో పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘రాజ్యాంగం ప్రతీ పౌరుడికి భద్రత, హక్కులు, స్వేచ్ఛ కల్పించింది. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బయటకు వచ్చినప్పుడు భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటోంది.కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తోంది. సోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవటం దారుణం. నల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందుంది. ఆంధ్ర రాష్ట్రంలో వినూత్నమైన పరిపాలన జరుగుతోంది. ప్రజల హక్కులు హరించబడుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది. రాజ్యాంగం అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారులు ఎందుకు నివాళులర్పించలేదు?. ప్రభుత్వం, అధికారులు వివక్షత చూపిస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: AP: సోషల్ మీడియా కార్యకర్తలపై పెరిగిన వేధింపులు -
ఆ ప్రశ్న అడగాల్సింది చంద్రబాబును: పవన్ కల్యాణ్
న్యూఢిల్లీ: కూటమి ప్రభుత్వంపై, రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనకు రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పవన్కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.దానికి ఆయన స్పందిస్తూ..నేనేం లా అండ్ ఆర్డర్, హోం శాఖ చూడడం లేదు. నా శాఖ గురించి ఏదైనా అడిగితే చెప్పగలను. అయినా మీరు ఈ ప్రశ్న అడగాల్సింది.. సీఎం చంద్రబాబును, హోం మంత్రి అనితను. అయినప్పటికీ మీరు చెప్పినవన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తా అని అన్నారు.అలాగే.. దర్శకుడు రాం గోపాల్ వర్మ తప్పించుకుని తిరుగుతున్నారని, చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు.. ఇప్పుడు ఎందుకు తటపటాయిస్తున్నారు? అని పవన్ వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో ఏం జరిగినా.. కూటమి ప్రభుత్వం తరఫున సమిష్టిగా బాధ్యత వహిస్తాం అని చెప్పారు.గతంలో పవన్ కల్యాణ్.. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో హోం మంత్రి అనితను నిందిస్తూ.. తాను హోం మంత్రి పదవి చేపడితే పరిస్థితి మరోలా ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు.ఇదీ చదవండి: వర్చువల్ విచారణకు వర్మ సిద్దపడ్డారు కదా! -
‘వైఎస్సార్సీపీ ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని విమర్శించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. లోకేష్ రాసిన రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని మండిపడ్డారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రైల్వే భవనాల నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 52 ఎకరాలను కేటాయించిందన్నారు.‘కేకే లైన్తో కూడిన రైల్వే జోన్ ఇవ్వాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదానీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సేకీతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆదానీ సంస్థతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. ప్రధాని మోదీ ప్రారంభిస్తారనే గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఒప్పందం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ప్లాంట్కు సంబంధించిన భూ కేటాయింపులు మా ప్రభుత్వ హయాంలోనే జరిగాయి’ అని తెలిపారు. -
‘ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు’
కర్నూలు జిల్లా: ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచారని మండిపడ్డారు కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి,.కేవలం చంద్రబాబు తన రెడ్బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిందని, ఇంటి వద్దకే సంక్షేమ పాలనతో పాటు సంక్షేమ పథకాలు అందించిన సంగతిని ఎస్వీ మోహన్రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ రోజు సంక్షేమ పథకాలు లేవు, రాజ్యాంగానికి విరుద్ధంగా పాలనను చంద్రబాబు సాగిస్తున్నారంటూ విమర్శించారు.‘సోషల్ మీడియా పోస్టులకు లైక్ కొట్టిన వారిపై నాన్ బెయిల్బెల్ కేసులు’ఏపీలో నిరంకుశ, దుర్మార్గ పాలన సాగుతోందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా తునిలో ఘనంగా 75వ భారత జ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో గత ఆరు నెలలుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా పాలన జరుగుతోంది. ప్రత్యర్థులను అణిచివేసే ధోరణి చాలా నిరంకుశంగా జరుగుతోంది. తునిలో 17 మందిపై అక్రమ కేసులు పెట్టారు. సోషల మీడియాలో పోస్ట్ను లైక్ చేసిన వారిపై నాన్ బెయిల్బెల్ కేసులు పెట్టారు. పసుపు చొక్కా లేసుకుని ఉద్యోగాలు చేయొద్దని పోలీసులను కోరుతున్నాను. గత పదేండ్ల కాలంలో వైఎస్సార్సీపీ ఒక పర్సంటేజ్సోషల్ మీడియా పోస్టులు పెడితే, టీడీపీ, జనసేన 99 శాతం అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారు. తునిలో మామ-అల్లుళ్ల పాలన కొనసాగుతోంది. అల్లుడు గల్లా పెట్టె దగ్గర కూర్చుంటే.. మామ యనమల అమాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. -
AP: సోషల్ మీడియా కార్యకర్తలపై పెరిగిన వేధింపులు
సాక్షి,తాడేపల్లి:ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల వేధింపులు ఆగడం లేదు. సోషల్మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిని టార్గెట్ చేసి మరీ భారీగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరిపై పది నుంచి ఇరవైకి పైగా అక్రమ కేసులు నమోదు చేశారు. సజ్జల భార్గవ్పై11, అర్జున్ రెడ్డి మీద 11,వర్రా రవీంద్రరెడ్డిపై 21, ఇంటూరి రవికిరణ్ మీద16,పెద్దిరెడ్డి సుధారాణిపై 10,వెంకటరమణారెడ్డిపై 10 కేసులు పెట్టారు. ఇవి కాకుండా చంద్రబాబు సర్కారు రహస్యంగా మరికొన్ని కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.కేసులు నమోదైనవారిలో ఎవరైనా హైకోర్టులో హెబియస్ కార్పస్,క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్లు వేస్తే వారిని పోలీసులు మరింతగా టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ,వాక్ స్వాతంత్రం అసలే కనిపించడం లేదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
కొత్త దుష్ట సంస్కృతికి తెరలేపిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి!
ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరందని చెప్పకతప్పదు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏకపక్షంగా పోలీసులను ప్రయోగిస్తున్న తీరు దారుణం. ప్రతిపక్షంలో ఉండగా సోషల్ మీడియా స్వేచ్చ గురించి నీతులు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వచ్చిన పోలీసులు హైదరాబాద్లో ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హడావుడి చేయడం చూస్తే ఏపీ పోలీసుల ప్రాధాన్యత క్రమం మారిపోయినట్లు అనిపిస్తుంది. ఒక సినిమా విడుదల సందర్భంగా వర్మ ఎప్పుడో ఏవో ఫోటోలు పెట్టారట. దానిపై ఇప్పుడు ఎవరో ఫిర్యాదు చేశారట. పోలీసులు వాయు వేగంతో వర్మకు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల ముందు హాజరయ్యేందుకు వర్మ కారణాలు చూపుతూ సమయం కోరారు. పైగా అంతేకాక కొత్త చట్టం ప్రకారం వర్చువల్ విచారణకు సిద్దపడ్డారు. వర్మ ప్రత్యక్ష విచారణకు హాజరు కాబోరని కనిపెట్టిన పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలివచ్చారు.వర్మ కొన్నేళ్ల క్రితం తప్పు చేసి ఉంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? కేవలం టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు కనుక ఆయనను ఇబ్బంది పెట్టే లక్ష్యంతో కక్షకట్టి పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అర్థం చేసుకోవడం కష్టం కాదు. రాజకీయాలతో సంబంధం లేని ఒక సినీ ప్రముఖుడిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం తప్పుడు సంకేతం పంపినట్లవుతుంది. వర్మ తప్పు చేసి ఉంటే చర్య తీసుకోరాదని ఎవరూ చెప్పరు. కానీ కావాలని దురుద్దేశంతో వ్యవహరిస్తున్న తీరే విమర్శలకు ఆస్కారం ఇస్తోంది. ఇది సినీ పరిశ్రమపై దాడిగా కనిపిస్తుంది. వర్మ ఒకవేళ ఒంగోలుకు వెళ్లి కేసు విచారణకు హాజరై ఉంటే ,అక్కడ నుంచి ఎన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పేవారో ఊహించుకోవడం కష్టం కాదు. వర్మపై వచ్చిన అభియోగం ఏమిటో చెప్పకుండా పోలీసులు విచారణకు పిలవడం, హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్ద సీన్ క్రియేట్ చేయడం శోచనీయం.అలాగే మరో నటుడు పోసాని కృష్ణ మురళీ మీద అనేక పోలీస్ స్టేషన్లలో టీడీపీ, జనసేన వారు ఫిర్యాదులు చేశారు. దాంతో ఆయన ఈ రకమైన వేధింపులకు తట్టుకోలేమని భావించి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయినా వదలిపెట్టబోమని టీడీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి హెచ్చరిస్తున్నారు.ఏపీలో ఇవన్ని కొత్త ట్రెండ్ లో భాగంగానే కనిపిస్తాయి. నిజంగానే ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయడం ఒక పద్దతి. అలా కాకుండా టీడీపీ నుంచి ఎవరుపడితే వారు ఫిర్యాదులు చేస్తే, వెంటనే టేకప్ చేసి ఆరోపణలకు గురైనవారిని అదుపులోకి తీసుకుని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిప్పుతూ, కొన్ని చోట్ల రిమాండ్కు పంపుతూ, మరికొన్ని చోట్ల విచారణ చేసి, మళ్లీ వేరే స్టేషన్కు తరలించడం, తద్వారా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్న తీరు కచ్చితంగా ప్రజాస్వామ్య విరుద్దం. ఇంటూరి రవికిరణ్ వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయనపై ద్వేషంతో ఇప్పటికి పదిహేను కేసులు పెట్టారట. అటు ఉత్తరాంద్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ఈ కేసులు పెట్టడంలోనే దురుద్దేశం ఉంది. ఇంటూరి భార్య ఆవేదనతో ఈ విషయాలు చెబుతూ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను సీఎం. ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాపై కేసులు పెడతామని చెప్పిన వెంటనే టీడీపీ, జనసేనకు చెందిన కొంతమంది రంగంలోకి దిగి ఫిర్యాదుల పరంపర సాగిస్తున్న తీరు చూస్తే ఇదంతా కుట్ర అని, ఆర్గనైజ్డ్గా చేస్తున్నారని అర్థమవుతుంది.మాజీ మంత్రి కొడాలి నాని పై మరీ చిత్రంగా ఒక లా విద్యార్ది ఫిర్యాదు చేస్తే రాత్రి 11 గంటల సమయంలో కేసు నమోదు చేశారట. అంత ఆకస్మికంగా కేసు కట్టవలసిన అవసరం ఏమిటో తెలియదు. నాని మీడియా సమావేశాలలో, అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ తదితరులపై చేసిన వ్యాఖ్యల వల్ల ఆ విద్యార్ది మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేయడం విచిత్రంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి మనో భావాలు అయినా దెబ్బతింటే ఆయన వ్యాఖ్యలు చేసిన వెంటనే ఫిర్యాదులు చేయాలి. అలా కాకుండా ఎప్పుడో చేసిన విమర్శలు వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలకు ఫిర్యాదు చేయడం ఏమిటో తెలియదు. పవన్ కళ్యాణ్ ఏపీలో 31 వేల మంది మహిళలు మిస్ అయిపోయారని, మహిళల అక్రమ రవాణా జరిగిందని ఆరోపిస్తే మహిళల మనోభావాలు దెబ్బ తినలేదా? లోకేష్ రెడ్బుక్ అంటూ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను బెదిరిస్తే వారి మనోభావాలు దెబ్బ తినలేదా? జగన్ను సైకో అని ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు మాట్లాడితే వైఎస్సార్సీపీ వారి మనోభావాలు దెబ్బ తినలేదా? అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు ఎంత దారుణంగా మాట్లాడినా, వారిపై ఎవరూ కేసులు పెట్టలేదు.రాజకీయంగానే చూశారు.కానీ ఇప్పుడు వీరు పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నట్లు వ్యవహరిస్తున్నారు. కొడాలి నాని ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో, అంతకన్నా ఘాటుగా టీడీపీ నేతలు పలువురు మాట్లాడారు. మరి వారిపై ఎందుకు కేసులు రావడం లేదు?శాసనసభలో జరిగే ప్రసంగాలు, చర్చలు, వాదోపవాదాలపై కోర్టులే జోక్యం చేసుకోవు. అలాంటిది ఏకంగా పోలీసులు ఎలా చర్య తీసుకుంటారంటే, అది ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ స్పెషాలిటీ అని భావించాలి. వైఎస్సార్సీపీ నేతలు పలువురు టీడీపీ సోషల్ మీడియా చేసిన దారుణమైన పోస్టింగ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదు? మాజీ మంత్రి రోజా మీడియాలో ఈ విషయమై కన్నీరు పెట్టుకున్నారు.అయినా కూటమి ప్రభుత్వం ఆమె చేసిన ఫిర్యాదును స్వీకరించడం లేదు. అలాగే మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కుటుంబంపై పెట్టిన అసభ్య పోస్టింగ్లకు సంబంధించి ఫిర్యాదు చేస్తూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై పెట్టిన నీచమైన పోస్టింగ్ల మాటేమిటని అడిగినా స్పందించే నాథుడు లేకుండా పోయారు. ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేష్ లపై ఫిర్యాదు చేస్తే చర్య తీసుకోరా? వైఎస్సార్సీపీ వారిపై మాత్రం ఏదో ఒక కేసు పెడతారా? ఏమిటి ఏపీని ఇలా మార్చుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీని పోలీసు రాజ్యంగా చేయడం ద్వారా శాశ్వతంగా ఏలవచ్చని పాలకులు భ్రమ పడుతున్నట్లుగా ఉంది. కానీ చరిత్రలో అది ఎల్లవేళలా సాధ్యపడదని అనేకమార్లు రుజువైంది. టీడీపీ ప్రభుత్వం తన వైఫల్యాలను ప్రజల దృష్టి నుంచి మళ్లించడం కోసం ఇలాంటి టెక్నిక్స్ ను వాడవచ్చు. తమ పాతకక్షలను తీర్చుకోవడానికి పోలీసులను టూల్స్ గా వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇంటూరి రవికిరణ్, వర్రా రవీంద్ర రెడ్డి మొదలైన వారితో బలవంతంగా స్టేట్ మెంట్స్ పై సంతకాలు పెట్టించుకుంటున్నారట. సోషల్ మీడియా కేసులు పెట్టడం కుదరకపోతే ఏదో ఒక క్రిమినల్ కేసులో ఇరికించడానికి యత్నిస్తున్నారు. అర్ధరాత్రి వేళ పోలీసులు కొంతమంది నాయకుల ఇళ్లలోకి చొరబడి ఆడవాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నేత గౌతం రెడ్డి ఇంటిపై దాడి చేసి పోలీసులు సృష్టించిన గలభానే ఇందుకు నిదర్శనం. ఇలాంటివి వైఎస్సార్సీపీ హయాంలో ఎప్పుడైనా ఒకటి,అరా జరిగితే టీడీపీ కానీ, ఎల్లో మీడియా కానీ నానా రచ్చ చేసేవి. కానీ ఇప్పుడు టీడీపీతోపాటు అదే ఎల్లో మీడియా పోలీసుల అరాచకాలకు మద్దతు ఇస్తున్నాయి. ఈ తరహాలో పోలీసులను ఉపయోగిస్తే, వచ్చే కాలంలో ప్రభుత్వాలు మారితే, ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. అప్పుడు టీడీపీ, జనసేనలకు చెందిన ముఖ్యనేతలపై కూడా ఇలాగే ఎక్కడపడితే అక్కడ కేసులు పెట్టే ప్రమాదం ఉంటుంది. గత టరమ్లో టీడీపీ ముఖ్యనేతలకు సంబంధించి కేసులు వచ్చినా ఇంత అరాచకంగా వారి పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులు ప్రవర్తించలేదు. నిబంధనల ప్రకారం చర్య తీసుకోవడానికి యత్నించారు.అయినా ఆ రోజుల్లో మీడియా అండతో టీడీపీ నేతలు గందరగోళం సృష్టించే వారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని కావాలని కోర్టులో ప్రవేశపెట్టడంలో జాప్యం చేసిన వైనం కూడా అభ్యంతరకరమే. గతంలో చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న సందర్భంలో నందిగామ వద్ద ఏదో గొడవ జరిగింది.ఇప్పుడు దానిని హత్యయత్నం కుట్ర కేసుగా మార్చి అక్కడి వైఎస్సార్సీపీ ముఖ్యనేతలపై కేసులు పెడుతున్నారట.మాజీ ఎంపీనందిగం సురేష్ ను ఎలా వేధిస్తున్నది అంతా గమనిస్తున్నారు. ఎవరు తప్పు చేశారన్న ఫిర్యాదులు వచ్చినా పోలీసులు చర్య తీసుకోవచ్చు. కానీ చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని మాత్రమే ఎవరైనా చెబుతారు. అలా కాకుండా ఇష్టారీతిన పోలీసులతో చట్టవిరుద్దమైన పనులు చేయిస్తున్నారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో ఈ పరిస్థితి అంత తీవ్రంగా లేదు. అయినా బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పై ఇప్పటికి ఆయా పోలీస్ స్టేషన్ లలో ఆరు కేసులు నమోదు చేశారట.వాటిని గమనిస్తే ఏదో కావాలని కేసులు పెట్టారన్న భావన కలుగుతుంది. చిన్న, చిన్న ఉదంతాలను కూడా కేసులుగా మార్చి ప్రత్యర్ధి రాజకీయ పార్టీలను వేధించాలన్న దోరణి మంచిది కాదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాంగ్రెస్ అధ్యక్షుడు గా ఉన్న రేవంత్ రెడ్డి ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు పరుష భాషతో చేసింది తెలిసిందే. అలాగే కేసీఆర్ కూడా చేసి ఉండవచ్చు. అయినా ఎక్కడా ఈ కేసుల గొడవ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా ఈ ట్రెండ్ కు వెళితే కాంగ్రెస్ పార్టీకి నష్టం. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను గురుశిష్యులుగా అంతా చెప్పుకుంటారు.తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తే అది ఆయనకే అప్రతిష్ట.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రజల దృష్టి మళ్లించాలనే జగన్పై దుష్ప్రచారం
నెల్లూరు (బారకాసు): ప్రజల ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయానికి 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో చేసుకున్న ఒప్పందం కేంద్ర ప్రభుత్వం సహా అందరి ప్రశంసలందుకుందని, ఇది చూసి ఓర్వలేకే కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన గొప్ప ప్రాజెక్టు ఇది అని చెప్పారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అత్యంత చౌకగా సోలార్ విద్యుత్ సెకీ స్వయంగా ముందుకొచ్చి రాష్ట్రానికి లేఖ రాసిందన్నారు.ఈ వాస్తవాన్ని దాచిపెట్టి అదానీతో వైఎస్ జగన్ రహస్య ఒప్పందం అంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సెకీకి, అదానికి మధ్య జరిగిన వ్యవహారాన్ని జగన్పై నెట్టేస్తున్నారని అన్నారు. అప్పట్లో కాంగ్రెస్తో కుమ్మక్కై జగన్ను జైల్లో పెట్టించారని, మళ్లీ ఇప్పుడు అవే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 2014–19 మధ్య యూనిట్ రూ.6.90 చంద్రబాబు కొన్నారని, కానీ వైఎస్ జగన్ రూ.2.49కే సెకీతో ఒప్పందం చేసుకున్నారని వివరించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను నాశనం చేసింది చంద్రబాబేనని చెప్పారు. బాబు హయాంలో రూ.8,848 కోట్లు బకాయిలు పెట్టి విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారన్నారు. ఈనాడు వార్తలన్నీ టీడీపీ ఆఫీసు నుంచే వస్తున్నట్టున్నాయని చెప్పారు. వైఎస్ జగన్ వల్లే మంత్రి అయిన బాలినేని నేడు చంద్రబాబు, పవన్ మెప్పు కోసం అబద్ధాలాడుతున్నారని చెప్పారు. -
బడి లేదు.. భవిష్యత్తూ లేదు.. కూటమి ప్రభుత్వంపై జూపూడి ఫైర్
సాక్షి, తాడేపల్లి : బడి లేదు.. భవిష్యత్తూ లేదు. ఆరు నెలల కూటమి పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు. కూటమి ప్రభుత్వ వైఫల్య పాలనపై వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాయలంలో జూపూడి ప్రభాకర్రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జూపూడి ప్రభాకర్రావు మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్ ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కేసింది. 2004కి ముందు ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో పాదయాత్రలో చూసిన పరిస్థితులతో చలించిపోయి మొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టారు.మరోవైపు ఫీజులు చెల్లించలేక పిల్లలు చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా విద్యా విప్లవం తీసుకొచ్చారు. ఆ పథకం ఎందరో విద్యార్థుల జీవితం మార్చింది. ఎందరో సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మళ్లీ 2004కి ముందు పరిస్థితులను తీసుకొచ్చారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో..:2019లో జగన్ సీఎం అయ్యాక, రాష్ట్రంలో మళ్లీ విద్యావిప్లవం మొదలైంది. ప్రభుత్వ స్కూళ్లు సమూలంగా మార్చేశారు. వాటిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి కొత్త ఒరవడికి నాంది పలికారు. మంచి పౌష్టికాహారం, రోజుకో మెనూతో మధ్యాహ్న భోజన పథకం గోరుముద్దను అమలు చేశారు. అంగన్వాడీల్లో సంపూర్ణ పోషణ అమలు చేశారు. పిల్లలకు పూర్తి ఫీజు చెల్లిస్తూ విద్యాదీవెన అమలు చేశారు. బిడ్డ చదువుల కోసం తల్లి ఫీజులు కట్టే విధంగా మహిళా సాధికారతకు అర్థం తెచ్చేలా, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆ మొత్తం నేరుగా జమ చేశారు.మళ్లీ అంతా అస్తవ్యస్తం:కూటమి ప్రభుత్వం రాగానే విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసేశారు. గోరుముద్ద పథకాన్ని మూలన పడేశారు. ఇంగ్లిష్ మీడియం ఆగిపోయింది. అమ్మ ఒడి లేదు. విద్యావ్యవస్థను పూర్తిగా తొక్కేశారు. ఆరు నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైంది.ఉదా: ప్రకాశం జిల్లా జె.పంగులూరులో ఫీజు కట్టలేదని ఓ విద్యార్థిని కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపేసింది.పిల్లలు ఫీజు బకాయిలు కట్టలేదంటూ చాలాచోట్ల వారికి టీసీ ఇవ్వడం లేదు. ఇంకా చాలా మంది పిల్లలు ఫీజులు కట్టలేక, విద్యార్థులు కూలీ పనులకు పోతున్నారు.జగన్పై కక్ష పిల్లలపై చూపొద్దు:జగన్ మార్క్ విధానాలు ఎక్కడా కనిపించకూడదనే అక్కసుతోనే కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును పథకం ప్రకారం కాలరాస్తోంది. తల్లిదండ్రుల ఆశలు చిదిమేస్తోంది. మీకేదైనా కక్ష ఉంటే మా మీద తీర్చుకోండి. అమాయక, పేద ప్రజల భవిష్యత్తును నాశనం చేయొద్దు. విద్యను నమ్ముకుని జీవితాలను బాగు చేసుకోవాలని కలలు కంటున్న వారి నమ్మకాన్ని కాలరాయొద్దు. నిజానికి 2019లో చంద్రబాబు దిగిపోతూ పెట్టిన రూ.2,800 కోట్ల ఫీజు బకాయిలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. ఆరు నెలల కూటమి పాలనలో విద్య, వైద్య రంగాలు మూలన పడ్డాయి. పేకాట క్లబ్లు, మద్యం షాపులు విచ్చలవిడిగా వెలిశాయి.2019–24. విద్యారంగం వ్యయం:అయిదేళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ వ్యయం రూ.12,609 కోట్లు.మనబడి నాడు–నేడు మొదటి దశలో రూ. 3,669 కోట్లతో 15,715 బడుల్లో సమూల మార్పులు. రెండో విడతలో రూ.8వేల కోట్ల వ్యయంతో 22,344 స్కూళ్ల సమగ్ర అభివృద్ధి.అమ్మ ఒడి పథకంలో 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో రూ.26,067 కోట్లు జమ.విద్యాదీవెనలో 29,65,930 మంది మంది పిల్లలకు మేలు చేస్తూ, రూ.12,609 కోట్ల ఫీజు చెల్లింపు.వసతి దీవెన కింద 25,17,245 మందికి రూ.4,275 కోట్లు.జగనన్న విదేశీ విద్యాదీవెనలో దాదాపు 408 మందికి రూ.107 కోట్లువిద్యాకానుక కిట్లు. 47,40,421 మంది పిల్లలకు లబ్ధి. వ్యయం రూ.3,366 కోట్లు.8వ తరగతి పిల్లలకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు.గోరుమద్దు పథకంలో 43,26782 మంది పిల్లలకు మేలు చేస్తూ రూ.6,568 కోట్లు ఖర్చు.అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలకు, చిన్నారుల పౌష్టికాహారం కోసం సంపూర్ణ పోషణ కింద రూ.9,894 కోట్లు ఖర్చు.శానిటరీ న్యాప్కిన్స్ కోసం రూ.32 కోట్లు.6వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ.2024–25లో టీచర్ల టీచింగ్ సామర్థ్యం పెంచేందుకు ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పిల్లలకు ఐబీలో విద్యాబోధన మొదలు. అలా 2035 నాటికి పదో తరగతి పిల్లలకు సర్టిఫికెట్.అలా గత ఐదేళ్లలో కేవలం విద్యారంగంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం రూ.73 వేల కోట్లు. జగన్ ఒక్కరే అంత ఖర్చు చేస్తే, మీ మూడు పార్టీలు కలిసి చేసే ఖర్చెంతో చూపించాలని జూపూడి ప్రభాకర్రావు డిమాండ్ చేశారు.ఫీజు బకాయిలు చెల్లించాలి: రవిచంద్ర, వైస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా విద్యాదీవెన, వసతి దీవెనకి ఒక్క రూపాయి కేటాయించలేదు. పైగా మంత్రి నారా లోకేశ్ గత ప్రభుత్వం రూ.6500 కోట్లు బకాయిలు పెట్టిపోయిందని మాట్లాడుతున్నారు. నిజానికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి రూ.502 కోట్లు మాత్రమే. ఎన్నికల కోడ్ వల్ల ఆ చెల్లింపు కోసం అనుమతి తీసుకున్నా, ఇవ్వకుండా చంద్రబాబే అడ్డుకున్నారు. ఫలితంగా చివరి క్వార్టర్ ఫీజు చెల్లింపు ఆగిపోయింది. కాలేజీల యాజమాన్యాలు లోకేశ్ని కలిసి రీయింబర్స్మెంట్ డబ్బులు గురించి అడిగినా వారిని పట్టించుకోలేదు. ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ విద్యార్థుల నుంచి ఆయా విద్యాసంస్థలు అండర్టేకింగ్ లెటర్లు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో, అవి విద్యార్థులే చెల్లించేలా వారితో ఒప్పందాలు చేసుకుంటున్న దుస్థితి.విద్యా రంగంలో ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించారో కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. కానీ అదే చంద్రబాబు పెట్టిన బకాయిలను వైఎస్ జగన్ సీఎంగా ఉండగా చెల్లించి పెద్ద మనసు చాటుకున్నారు. -
వాసన్నా.. జగన్ ఇచ్చిన స్వేచ్చను ఓసారి గుర్తు తెచ్చుకోండి: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: సెకీతో ఒప్పందంపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రకటనలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాలినేని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదంటూ చెవిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం తిరుపతిలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘.. ఎమ్మెల్సీ పదవి కోసం బాలిరెడ్డి దిగజారిపోయారు. ఆరోపణలు మాని విద్యుత్ ఒప్పందాలపై వాస్తవాలు చెప్పాలి. బాలినేని సంతకంతోనే సెకి ఒప్పందం జరిగింది. కానీ, పార్టీ మెప్పు కోసమే బాలినేని అబద్ధాలు ఆడుతున్నారు. ఎవరినో మెప్పించడం కోసం బాలినేని నాయకుడిపై మాట్లాడుతున్నారు. .. వాసన్న మాటలు చూస్తే జాలి వేస్తుంది. సెకి తో ఒప్పందం పై గొప్పగా చెప్పాల్సింది పోయి.. రెండుసార్లు మంత్రిగా పనిచేశా.. రెండు సార్లు సంతకాలు చేశా.. ఫార్వర్డ్ చేశాను అని చెప్పడం బాధాకరం. పాలసీ గురించి మాట్లాడితే అదే మాట్లాడతాను. వ్యక్తిత్వ హననం చేసేందుకు మీరు ప్రయత్నిస్తే మేము వాస్తవాలు మాట్లాడతాం.. మీ నియోజకవర్గం కొండెపి కదా.. ఒంగోలు నుంచి ఎందుకు పోటీ చేశారు?. మీ నాయకుడు(పవన్ కల్యాణ్) పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకెళ్లారని, చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్లారని బాలినేనిని చెవిరెడ్డి ప్రశ్నించారు. ఒంగోలు ప్రజలతో నాకు అనుబంధం ఉంది. ఒంగోలు లో మీకంటే(బాలినేని) నాకు ఎక్కువ ఓట్లు వేశారు ప్రజలు. ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు లో 52 వేల ఓట్లు అదనంగా వచ్చాయి. ఒంగోలు ప్రజలుతో నాకు అనుబంధం ఏర్పడింది, అండగా నిలుస్తాం. నేను విద్యార్ధి దశ నుంచి వైఎస్ కుటుంబంతో ఉన్నాను. గత 36 సంవత్సరాలగా వైఎస్సార్ కుటుంబంతోనే ఉన్నాను. నేను ఏ పార్టీ మారలేదు. మరోజెండా పట్టుకోలేదు... వాసన్నా.. జగన్ ఇచ్చిన స్వేచ్చను బాలినేని ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీరు స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు ఇతర పార్టీలు నేతలతో రష్యా కు వెళ్లారు. కూటమి నేతలు ఇతర పార్టీ నాయకులతో స్పెషల్ ఫ్లైట్ లో డిల్లి కు వెళ్తే చంద్రబాబు దిగే లోపే పదవి ఊడగొడతారు. అయినా కూడా మీరు జగన్ను ఎన్నోసార్లు ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా జగన్ భరించారు. ఇప్పుడు కూటమితో జతకట్టి జగన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ ఎదుర్కొంటారని గుర్తుంచుకోండి. వాసన్నా.. మీకు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ ఏదో ఒకరోజు మీకు గుర్తుకు వస్తుంది’’ అని చెవిరెడ్డి అన్నారు. -
‘పుష్ప- 2పై కొందరికి జెలసీగా ఉంది’
గుంటూరు, సాక్షి: అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంపై సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రోలింగ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గుంటూరులో సోషల్ మీడియా అరెస్టుల అంశంపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పనిగట్టుకుని కొందరు ఆ చిత్రంపై పోస్టులు చేయడం గురించి ప్రస్తావించారు. ‘అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరూ ఆపలేరు. అతనొక ఇంటర్నేషనల్ స్టార్. పుష్ప-2 అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను కూడా అడ్డుకోవాలనుకున్నారు. ఏమైంది?.. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. పుష్ప-2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. .. నేను కూడా ఆ సినిమా చూడడానికి రెడీగా ఉన్నాను.మొదటి పార్ట్ అద్భుతంగా ఉంది.పుష్ప-2పై కొంతమందికి జెలసీగా ఉంది. అరచేతిని అడ్డుపెట్టుకుని ఒక సినిమా విజయాన్ని ఆపలేరు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ చిత్రాలను అడ్డుకోవాలనుకోవడం అవివేకం’అని అంబటి అన్నారు. -
లోకేష్కు శాపంగా మారనున్న రెడ్బుక్: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు: సోషల్మీడియాలో పోస్టులపై వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నపుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరులో సోమవారం(నవంబర్ 25)అంబటి మీడియాతో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నారు. ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడితే టీడీపీ వాళ్లను కూడా అరెస్ట్ చేస్తామని చంద్రబాబు నీతి వ్యాక్యాలు చెప్పారు.అయితే వైఎస్సార్సీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం లేవు.ఇప్పటికే ఈ నెల 17,18,19 తేదీల్లో వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మా కుటుంబ సభ్యులపైన టీడీపీ నాయకులు పెట్టిన పోస్టులపై వివిధ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశాం.నిన్న అన్ని పీఎస్లకు వెళ్ళి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించాం. స్పష్టమైన సమాధానం మాకు రాలేదు. ఇప్పుడు స్పీకర్గా ఉన్న వ్యక్తి వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.లోకేష్ కూడా వైఎస్ జగన్పై అసభ్యకరమైన పోస్టు పెట్టారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. పోలీసులు స్పందించకుంటే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాం. స్పీకరైనా,మంత్రైనా చట్టం దృష్టిలో ఒకటే. ఇది అంతం కాదు ఆరంభమే. జమిలి ఎన్నికలొస్తాయన్న ప్రచారం జరుగుతోంది.డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైన కూడా కేసులు పెట్టారు. పోసాని మురళీకృష్ణ వైఎస్ జగన్ అభిమాని. ఆయనపై కేసులు పెట్టి భయపెట్టొచ్చేమో కానీ వైఎస్ జగన్పై ఆయనకున్న ప్రేమను మాత్రం తొలగించలేరు. రెడ్బుక్ లోకేష్ రాశాడు. రెడ్బుక్ లోకేష్కు శాపంగా మారుతోంది. రెడ్బుక్ రచయితగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతాడు’అని అంబటి ఎద్దేవా చేశారు. -
‘పవన్ ప్రాపకం కోసమే బాలినేని అబద్ధాలు’
సాక్షి,నెల్లూరు:అదానీ విషయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్జగన్పై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని,అయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రచారంలో ఉన్నవన్నీ అభూతకల్పనలేనని కొట్టి పారేశారు. నెల్లూరులో కాకాణి సోమవారం(నవంబర్ 25) మీడియాతో మాట్లాడారు.‘అప్పట్లో కాంగ్రెస్తో కుమ్మక్కై జైల్లో పెట్టించారు. లక్షల కోట్ల అవినీతి అంటూ అబద్ధాలు చెప్పారు. 2024 తర్వాత కూడా ఆవే కుట్రలు చేస్తున్నారు.సెకీకి,అదానీకి మధ్య జరిగిన దాన్ని వైఎస్ జగన్పై నెట్టేస్తున్నారు. గత ప్రభుత్లో ఒప్పందం కుదుర్చుకుంది సెకీతో మాత్రమే. తాము అదానీతో ఒప్పందం కుదుర్చుకున్న దాఖలాలు లేవు. 2021 సెప్టెంబర్ 15న యూనిట్ 2రూపాయల49పైసలకే విద్యుత్ ఇస్తామని ఏపీ ప్రభుత్వానికి సెకీ లేఖ రాసిందని కాకాణి గుర్తు చేశారు. ఇంకా కాకాణి ఏమన్నారంటే.. జగన్పై కుట్ర:గత కొద్ది రోజులుగా వైఎస్ జగన్ లక్ష్యంగా అదానీపై యూఎస్లో చేసిన ఆరోపణలను పట్టుకుని బురద జల్లాలని చూస్తున్నారు. జగన్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచే కాంగ్రెస్తో కుమ్మక్కైన చంద్రబాబు, ఆయనను అక్రమ కేసులతో, జైలుకు పంపిన విషయం అందరికీ తెలుసు. లక్ష కోట్లు అవినీతి అని దుష్ప్రచారం చేసిన చంద్రబాబు అండ్ కో ఒక్కో సున్నా తగ్గించుకుంటూ పోయి, చివరకు అసలు అవినీతి జరిగిందని కూడా తేల్చలేకపోయారు. ఇప్పుడు కూడా అదానీ కంపెనీ వ్యవహారంలో జగన్గారి పేరు లేదు. అయినా ఒక రిపోర్టు ఆధారంగా బురద జల్లడం కోసం అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. యూఎస్కు సంబంధించిన హిండెన్బర్గ్కు, అదానీకి మధ్య జరిగిన విషయాన్ని తెచ్చి ఏం సంబంధం లేకుండా మా నాయకులకు ముడిపెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆ నిరాధార ఆరోపణలతో ఈనాడు తప్పుడు కథనాలు రాస్తోంది.సెకీతో ప్రభుత్వ ఒప్పందంవైయస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ ఇండియా’ (సెకీ)తో మాత్రమే ఒప్పందం చేసుకుంది. అంతేతప్ప, అదానీ కంపెనీతో కాదు.అలాంటప్పుడు అదానీ కంపెనీలకు, జగన్గారికి ఏం సంబంధం?.అదానీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లావాదేవీలు జరపలేదు. సెప్టెంబర్ 15, 2021న కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. రూ.2.49కి సోలార్ పవర్ ఇస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై క్యాబినెట్లో సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్న తర్వాత, అన్ని అంశాల అధ్యయనం కోసం ఎనర్జీ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు.నెల రోజుల తర్వాత ఆ కమిటీ నివేదికపై మరోసారి చర్చించిన క్యాబినెట్, రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేలా సెకీ నుంచి పవర్ కొనాలని నిర్ణయించారు.ఆ మేరకు 6400 మెగావాట్లకు సంబంధించి సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాన్ని కూడా చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నారు.అలా న్యాయ పరమైన చిక్కులు ఏర్పడుతున్న కారణంగా టెండర్ల సమస్య ఉన్న నేపథ్యంలో, ఆ బాధ్యత తామే తీసుకుంటామన్న సెకీ, 2024 సెప్టెంబరులో 3వేల మెగావాట్లు, 2025లో 3వేల మెగావాట్లు, 2026లో మరో 3వేల మెగావాట్లు.. మొత్తం 9వేల మెగావాట్లు ఇస్తామని హామీ ఇస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది.తక్కువ ధరకు కొంటే తప్పు చేసినట్లా!:ఒకవేళ వైయస్సార్సీపీ ప్రభుత్వం ఆరోజు సెకీతో ఒప్పందం చేసుకోకపోయి ఉంటే, కచ్చితంగా మరో విధంగా విమర్శ చేసేవాళ్లు. రూ.2.49కే యూనిట్ విద్యుత్ ఇస్తామన్నా, ప్రభుత్వం లాలూచీ పడి తీసుకోలేదని రాసే వారు.నరం లేని నాలుకను ఎటైనా తిప్పి మాట్లాడతారు. దాన్ని ఇష్టారీతిన ప్రచారం చేసే మీడియా వారికి ఎలాగూ ఉంది. 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలులో యూనిట్ విద్యుత్కు సగటున రూ.5.10 చెల్లించారు.అదే మా ప్రభుత్వ హయాంలో రూ.2.49కే కొనుగోలు చేస్తే, మంచి చేసినట్లా? లేక తప్పు చేసినట్లా?.చంద్రబాబు హయాంలో అడ్డగోలు ఒప్పందాలు:సోలార్ పవర్కు సంబంధించి 2014 వరకు 11 పీపీఏలు ఉండగా, చంద్రబాబు అయిదేళ్లలో 2400 మెగావాట్లకు సంబంధించి 35 పీపీఏలు చేసుకున్నారు. వాటి విలువ రూ.22,868 కోట్లు .2014లో యూనిట్ సోలార్ విద్యుత్ను దాదాపు రూ.7కు కొనుగోలు చేశారు. 2016లో 1500 మెగావాట్లకు రూ.3.74 నుంచి రూ.4.84 వరకు అగ్రిమెంట్లు జరిగాయి. సెకీ తక్కువకు ఇస్తామని చెప్పినా వినకుండా అంత భారీ రేట్లకు కొనుగోలు చేశారు. దాని వల్ల విద్యుత్ పంపిణీ వ్యవస్థలు (డిస్కమ్లు) నాశనం అవుతున్నా, కేంద్రం చెప్పినా పట్టించుకోలేదు. ఇక 2016లో యూనిట్ విద్యుత్ రూ.4.50 చొప్పున 500 మెగావాట్ల కొనుగోలు చేసేలా, సెకీతో ఒప్పందం చేసుకున్నారు. ఇంతకన్నా దౌర్భగ్యం ఎక్కడైనా ఉందా? మా ప్రభుత్వంలో కన్నా రూ.2 చొప్పున ఎక్కువ చెల్లించి కొనడం ఏమిటో?.2019–20 నాటికి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన టారిఫ్ల ధర రూ.4.63 నుంచి రూ.5.90 వరకు నిర్ధారించింది. చంద్రబాబు బ్రహ్మాండంగా చేయడం అంటే అధిక ధరలకు కొనుగోలు చేయడమా..?విద్యుత్ రంగంలో చంద్రబాబు నిర్వాకం:2014–19 మధ్య విద్యుత్ రంగంలో చంద్రబాబు నిర్వాకం చూస్తే.. ఉచిత విద్యుత్కు సంబంధించి దాదాపు రూ.8845 కోట్ల బకాయిలు పెట్టాడు. విద్యుత్ ఉత్పత్తిదారులకు సంబంధించి దాదాపు రూ.21,541 కోట్లు బకాయిలు పెట్టాడు.చంద్రబాబు రాకమునుపు రూ.29,552 కోట్లు ఉన్న విద్యుత్ రంగం బకాయిలు ఆయన దిగిపోయే నాటికి రూ.86,215 కోట్లకు చేరాయి.ఇదేనా సమర్థవంతమైన పాలన. ఆయన హయాంలో విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పడానికి ఈ లెక్కలే ఉదాహరణ.సెకీతో ఒప్పందానికి ముందు యూనిట్ కరెంట్కి సంబంధించి రూ.2.49 నుంచి రూ.2.58 వరకు 58 బిడ్లు దాఖలయ్యాయి. అయితే అంత తక్కువ రేటుకు ఏపీ ప్రభుత్వానికి రావడం ఇష్టం లేని చంద్రబాబు, వాటన్నింటినీ కోర్టులను ఆశ్రయించి అడ్డుకున్నారు.చివరకు సెకీతో యూనిట్ పవర్ రూ.4.50కి కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు.అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు:రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ వ్యయానికి యూనిట్ విద్యుత్ రూ.2.49కి కొనుగోలు ఒక గొప్ప విషయం. అది కూడా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు మినహాయించి 25 ఏళ్లకు ఒప్పందం చేసుకోవడం జరిగింది.ఇది జగన్గారి ప్రభుత్వ గొప్పతనం. అయితే ఎక్కడ ఆయనకు మంచి పేరొస్తుందనే సాకుతో, ఆ ఒప్పందం మీద అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్లు. ఎవరైనా దాచేస్తే దాగేవి కావు. ఆ చరిత్రాత్మక ఒప్పందం వల్ల 25 ఏళ్ల పాటు ఏటా రూ.4వేల కోట్ల చొప్పున 25 ఏళ్లలో లక్ష కోట్లు ఆదా అవుతుంది.గతి తప్పి ఈనాడు దిగజారుడు రాతలు:ఆ అంశాలన్నింటినీ మరుగున పెడుతున్న ఈనాడు, గుజరాత్లో యూనిట్ విద్యుత్ రూ.1.99కే కొంటున్నారని రాస్తోంది. మరి ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఈనాడు భరిస్తుందేమో చెప్పాలి.ఈనాడు రాతలు చూస్తుంటే, టీడీపీ ఆఫీసులో చంద్రబాబు తయారు చేసి పంపిస్తున్న స్క్రిప్ట్లను వారు అచ్చేస్తున్నారనిపిస్తుంది.గుజరాత్ ఊర్జ్య వికాస్ నిగమ్ లిమిటెడ్ కొన్న ధరలు చూపించి రూ. 1.99లకే కొన్నారని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కోవిడ్ సమయంలో కొనేవారు లేక గుజరాత్లో సోలార్ ప్యానెళ్ల ధరలు తగ్గిపోయాయి. దాన్ని ఈనాడు సాకుగా చూపించి 50 పైసలు అదనంగా కొన్నారని మరో తప్పుడు ప్రచారం చేస్తోంది.పవన్ ప్రాపకం కోసమే బాలినేని అబద్ధాలు:సెకీతో ఒప్పందంపై బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారని దాన్ని పెద్ద భూతంలా ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ దయతో ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయ్యారు. మా జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా పనిచేశారు. ఆయనతో మాకు చాలా చనువుంది. ఇంత దారుణంగా మాట్లాడతారని ఊహించలేదు.పవన్ కళ్యాన్ దగ్గర మెహర్బానీ కోసం ఈ ఆరోపణలు చేసి ఉంటాడనిపిస్తుంది. వైఎస్ జగన్ గురించి, ఆయన ప్రభుత్వం గురించి మాట్లాడటానికి ఆయనకి ఎలా మనసొప్పిందో ఆయన ఆలోచించుకోవాలి. మంత్రివర్గంలో నిర్ణయాలు ఎజెండాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలియకపోవడం విడ్డూరం. టేబుల్ అజెండా కింద మంత్రులు అడిగిన అంశాలను వారి నియోజకవర్గ అంశాలను చేర్చడం మీకు తెలియదా?అర్థరాత్రి ఫైల్ వచ్చిందని బాలినేని పచ్చిఅబద్ధాలు చెబుతున్నారు. ఆ సమయంలో ఈ–ఫైలింగ్ విధానం ఉండగా ఇలా దారుణంగా మాట్లాడటం బాలినేనికి తగదు. ఎవరి దగ్గర నీ స్థాయి పెంచుకోవడానికి మాట్లాడుతున్నావో, ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నావో మాకు అనవసరం.. కానీ వాటి కోసం మా నాయకుడి మీద బురద జల్లడం భావ్యం కాదు. తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం నా నియోజకవర్గంలోకి వచ్చింది. దానిపై కేంద్రంతో ఇబ్బందులొస్తే టేబుల్ అజెండా కింద చేర్చి భూముల కొనుగోలుకు కూడా నిధులు మంజూరు చేయించారు. ఇలాంటివి ప్రతి మంత్రికి ఎదురైన అనుభవాలే. మనం ఏదైనా అడిగితే కాదని లేదన్న సందర్భాలున్నాయా..?ఈనాడుకు ఆ అర్హత ఉందా?:సిగ్గు, బుద్ధి లేని ఈనాడు యాజమాన్యం మార్గదర్శి పేరుతో నిబంధనల విరుద్దంగా డిపాజిట్లు సేకరించి సుప్రీంకోర్టు ముందు దోషిగా నిలబడిన వీరికి వైఎస్ జగన్ మీద ఆయన ప్రభుత్వం మీద విమర్శించే అర్హత ఉందా? ఈనాడు పత్రికకు ఉన్న క్రెడిబులిటీ ఎప్పుడో పోయింది. నాకు కూడా సీబీఐ కేసులో క్లీన్ చిట్ వస్తే.. ఆ సీబీఐనే ఈనాడు విమర్శించింది. వారికి అవసరం ఉన్నప్పుడు మాత్రం సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంటారు. వాస్తవాలతో వీరికి అవసరం లేదు. టీడీపీకి అనుకూలంగా చంద్రబాబు రాజకీయ అజెండాతో వార్తలు రాయడమే వీరి పని. జగన్ ఎంత మంచి పని చేసినా దాన్ని తప్పుగా వెతకాలి. బురద జల్లాలి. చంద్రబాబును హీరోగా చూపించాలి.మొన్నటిదాకా జగన్ ప్రభుత్వంలో పెట్టుబడులే రాలేదని ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం అదానీ చేత రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టించారని రాస్తున్నారు. అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఈనాడులో నిజాలు మారిపోతుంటాయని కాకాణి గోవర్థన్రెడ్డి ఆక్షేపించారు. -
‘పచ్చ’ ముదురు రాతలు!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఉన్న ద్వేషాన్ని ఎల్లో మీడియా ఇంకోసారి భళ్లున కక్కినట్లు కనిపిస్తుంది. కొన్ని రోజులుగా ఎల్లో మీడియా చిమ్ముతున్న విషం చూస్తే వారికి జగన్పై ఉన్న అక్కసో ఏ స్థాయిదో సామాన్యుడికీ తెలిసిపోతుంది. పిచ్చి ముదిరిందంటే.. రోకటికి చుట్టమన్నట్లు.. ఇప్పుడు వారు అమెరికా కోర్టుల తరఫున కూడా తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే భారత్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోర్టులు ఏ రకమైన తీర్పులు ఇవ్వాలో ఈ మీడియా చెబుతూంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు ఇంకో అడుగు ముందుకేసి అమెరికా స్థాయికి ఎదిగారన్నమాట. ప్రజలను మోసం చేసేందుకు వీరు కల్లుతాగిన కోతుల్లా అర్థంపర్థం లేని కథనాలు వండి వార్చారు.అదానీ కంపెనీలకు చెందిన ఏడుగురిపై అమెరికా కోర్టులో ఒక కేసు నమోదైంది. సౌర విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాల్లో ముడుపులు చేతులు మారాయన్నది కేసులో మోపిన అభియోగం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి)తో కొన్ని భారత్లోని కొన్ని రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందాల వెనుక లంచాలు ఉన్నాయని ఆరోపణ. అయితే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదానీతో నేరుగా ఒప్పందం చేసుకోలేదు. సెకీ ద్వారా తక్కువ ధరకే విద్యుత్తు కొనుగోలు చేస్తూంటే అధికారులకు ముడుపులు ఎలా చెల్లిస్తారన్న ప్రశ్న వస్తుంది. దీనికి సరైన సమాధానం ఈ పచ్చమీడియా ఇవ్వదు. పైగా.. అదాని కంపెనీ ఉద్యోగులపై మోపిన అభియోగాలను మాజీ సీఎం జగన్కు అంటకడుతూ ఎల్లోమీడియా చిందులు తొక్కింది. లంచాల ఆరోపణలే నిజమైతే అది ఏ రూపంలో జరిగిందో కూడా ఎల్లోమీడియా కథనాలు చెప్పాలి. అది మాత్రం వాటిల్లో ఉండదు. దీంతో ఈ కథనాల్లో వాస్తవికతపై సందేహాలు వస్తున్నాయి.ఈ తాజా పరిణామాల నేపథ్యంలో భారత దర్యాప్తు సంస్థలపై మాదిరిగానే అమెరికాలోనూ విమర్శలు వస్తూంటాయేమో అన్న ఆలోచన వస్తోంది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే అమెరికాలోని చాలా కోర్టుల్లో ఆయనపై నమోదైన కేసుల్లో శిక్షల తీర్పులను నిరవధికంగా వాయిదా వేసుకోవడం ఇందుకు పెద్ద ఉదాహరణగా కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరూ అదానీపై లేదా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీలను పల్లెత్తు విమర్శ కూడా చేయలేదు. అన్ని ఆరోపణలూ జగన్పైనే మోపుతూండటంలోనే వారి డొల్లతనం స్పష్టమవుతోంది.ఈనాడు వంటి ఎల్లో మీడియా అశ్శరభ శరభ అంటూ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతోంది. ఇదే సంస్థ తన మార్గదర్శి కంపెనీలోకి రూ.800 కోట్ల నల్ల ధనం వచ్చి చేరిందని ఆంధ్రప్రదేశ్ సీఐడీ చెప్పినప్పుడు మాత్రం మాటమాత్రపు సమాధానమైనా ఇవ్వకుండా జారుకునే ప్రయత్నం చేసింది. అలాగే ఈనాడు సోదర సంస్థ మార్గదర్శి చట్టాలతో సంబంధం లేకుండా రూ.2600 కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేయడం తప్పా? కాదా? అని హైకోర్టు స్వయంగా ప్రశ్నించినా నిమ్మకు నీరెత్తినట్లు నీళ్లు నమిలిందే కానీ మాట పెగిల్చే ధైర్యం చేయలేదు. ఇతరుల విషయానికి వచ్చేసరికి మాత్రం పత్తిత్తు కబుర్లన్నీ చెబుతోంది. విలువలతో నిమిత్తం లేకుండా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చందంగా వార్తలు రాసే ఆంధ్రజ్యోతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. స్కిల్ స్కామ్ ఆరోపణలు చేస్తూ, సూట్కేస్ కంపెనీల ద్వారా అవినీతి సొమ్ము నేరుగా టీడీపీ ఆఫీసు ఖాతాలోకే చేరిందని సీఐడీ ఆధార సహితంగా చెప్పినా.. అది అక్రమ కేసంటారు చంద్రబాబు. ఎల్లో మీడియా ఇదే ప్రచారం చేస్తుంది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసినా.. చంద్రబాబు జోలికి వస్తే ఊరుకోబోమని వీరు శివాలూగి పోతూంటారు. అంటే.. ఆంధ్రప్రదేశ్లోని దర్యాప్తు సంస్థలనైతే మేము నమ్మమూ.. అమెరికా పోలీసులు చెబితే అదే వేదం మాకు అన్నట్టుగా ఉంది ఈ పచ్చమూక వ్యవహారం.అదానీ కంపెనీపై మోపిన కేసు విషయానికి వస్తే.. అదానీ కంపెనీ ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్ను రాష్ట్రాలు సెకి ద్వారా తీసుకోని నేపథ్యంలో అదానీ గ్రూపు నేరుగా సంప్రదింపులు జరిపిందన్నది ఆరోపణ. ఇందులో తప్పేమిటి? ఇలా చేయడం వల్ల రాష్ట్రాలకు లాభం కలిగిందా లేదా? అన్నది ముఖ్యం. ఆంధ్రప్రదేశ్తోపాటు చత్తీస్గఢ్, ఒడిశా, జమ్మూ కశ్మీర్లు కూడా సెకితో మాత్రమే ఒప్పందాలు చేసుకున్నాయి అదానీతో కాదు. ఈ రాష్ట్రాలలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఒప్పందాలు కుదిరే సమయానికి కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. ఆంధ్రప్రదేశ్కు సెకీ ఒప్పందం కారణంగా రూ.2.49లకే ఒక యూనిట్ సౌర విద్యుత్తు లభిస్తుంది. ఇంతే మొత్తం విద్యుత్తుకు అప్పటివరకూ ఐదు రూపాయల కంటే ఎక్కువ చెల్లిస్తూండేవారు. రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా అందించే విద్యుత్తు కోసం తక్కువ ధరకే విద్యుత్తు లభిస్తూండటంతో ఆంధ్రప్రదేశ్ సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇంకోలా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందన్నమాట. ఒకవేళ ఈ ఒప్పందాల్లో ఏదైనా మతలబు ఉంటే అందుకు కేంద్రం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది!ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటివారు ప్రధాని మోడీపై విమర్శలు చేయగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మాత్రం అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ను బాధ్యుడిని చేస్తూ, అవినీతి అవినీతి అంటూ పేజీలకు పేజీలు వార్తలిచ్చేశాయి. వీరి కథనాలే నిజమైతే.. ఇతర రాష్ట్రాల విషయంలోనూ కథనాలు ఇవ్వాలి కదా? కానీ వాటి గురించి పిసరంతైనా రాయలేదు.దీన్నిబట్టే తెలిసిపోతుంది వారి కథనాలు అవాస్తవమూ అని. ఇక పార్టీ మారగానే స్వరమూ మార్చసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి గురించి.... ఒకప్పుడు ఈనాడు మీడియా బాలినేని దారుణాతి దారుణంగా కథనాలు ప్రచురించింది. కానీ.. ఇప్పుడు వారికి బాలినేనిలో గొప్ప నిజాయితీ పరుడు కనిపిస్తున్నాడు. బాలినేని అసత్యాలు చెబుతున్న సంగతిని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎండగట్టారు. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడన్న ప్రచారం ఉన్న అదాని నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వంలోని వారైనా ముడుపులు తీసుకునే అవకాశం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అంతర్జాతీయ వ్యవహారలేవీ జరగవన్న విషయం పచ్చమీడియాకు తెలియదా?అమెరికాలో సెక్యూరిటీల ద్వారా నిధులు సమీకరించడానికి అదానీ గ్రూప్ ఈ అవినీతికి పాల్పడిందన్నది ఆరోపణ. అమెరికా అధికారులు సైతం దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా కేవలం రాజకీయ లక్ష్యంతోనే ఈ అభియోగాలు కూడా మోపి ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీతో ఏ ఒప్పందమూ చేసుకోనప్పుడు ముడుపుల అంశం ఎక్కడి నుంచి వస్తుందని వైసీపీ ప్రశ్నిస్తోంది. జగన్పై ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవమున్నా ఆయన ప్రధాన ప్రత్యర్ది చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయనపై విరుచుకుపడి ఉండేవారు. ఏదో మాట మాత్రంగా ఎల్లోమీడియా ప్రచారం కోసం జగన్పై నింద మోపారు. ప్రభుత్వ పరంగా అదానీ, జగన్లపై విచారణ చేస్తామని చంద్రబాబు ఎందుకు ప్రకటించలేదో ఎల్లో మీడియా తెలపాలి!.అదానీ గ్రూపు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే కొన్నిటి పనులు ఆరంభించింది. జమ్మలమడుగు వద్ద పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు కూడా వీటిల్లో ఒకటి. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ సిబ్బందిపై లంచాలకోసం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మనుషులు అప్పట్లో దాడి కూడా చేశారన్న వార్తలు వచ్చాయి. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకూ అదానీ సంస్థ ముందుకు వచ్చింది. 2014-19 టర్మ్లో రూ.70 వేల కోట్లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటే.. జగన్ ప్రభుత్వం దాన్ని రూ.14 వేల కోట్లకు తగ్గించిందని ఇదే ఈనాడు మీడియా విమర్శించింది. అంటే ఒక్క కంపెనీ ఏర్పాటుకు చంద్రబాబు రూ.70 వేల కోట్లకు ఓకే చేస్తే అది విజన్. గొప్ప విషయం. అదే జగన్ టైమ్లో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడితో పది చోట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు, సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటుకు అంగీకరిస్తే అదంతా అదానీకి రాసిచ్చినట్లు!!!అదానీ తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను కలిస్తే అది ముడుపుల చర్చకు.. చంద్రబాబు కలిస్తే మాత్రం రాష్ట్రం కోసమన్నట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతులు ప్రచారం చేస్తూంటాయి. అంతెందుకు... అదానీ గ్రూప్ ఎండీ రాజేశ్ అదానీ తదితరులు ఈ మధ్యే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఓడరేవులు, మైనింగ్, రింగ్ రోడ్డు,ఐటీ, టూరిజమ్, కృత్రిమ మేధ రంగాలతోపాటు అమరావతి నిర్మాణానికి అదానీ గ్రూప్ ఆసక్తి కనబరుస్తోందని చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులన్నిటికి కలిపి ఎన్ని లక్షల కోట్ల వ్యయం అవుతుంది..? తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వీటిని తిరస్కరించే ధైర్యం చేస్తుందా? అక్కడిదాకా కూడా అవసరం లేదు. అవినీతి ఆరోపణలు వచ్చిన సౌర విద్యుత్తు కొనుగోళ్ల అంశం తాలూకూ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఎల్లో మీడియా బాబును ఎందుకు కోరలేకపోయింది?సౌర విద్యుత్తు యూనిట్ రూ.1.99కే దొరుకుతుంటే, జగన్ ప్రభుత్వం సెకీతో రూ.2.49లకు ఒప్పందం చేసుకుందని ఈనాడు మీడియా ఆరోపణ. అందులో ఏ మాత్రం నిజం ఉన్నా, చంద్రబాబు ప్రభుత్వం వాటిని రద్దు చేయడానికి లేదా, ధర తగ్గించడానికి సెకీకి నోటీసు ఇవ్వవచ్చు కదా?గతంలో చంద్రబాబు యూనిట్ విద్యుత్తుకు ఏకంగా రూ.5 ఇచ్చి కొనుగోలు చేస్తే, జగన్ సెకీ ఒప్పందం ద్వారా యూనిట్ ధర 2.49 రూపాయలకు తగ్గిందంటే అది తప్పని ఎల్లో మీడియా ప్రచారం చేసింది.పోనీ అదానీ నుంచి జగన్ ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలో సత్యం ఉందని భావిస్తుంటే, చంద్రబాబు ప్రభుత్వం వీరిపై, అలాగే మోడీ ప్రభుత్వంపై విచారణకు ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు కదా! ఆయన ఎక్కడా అదానీని కానీ, మోడీని కానీ ఒక్క మాట అనకుండా జగన్ వల్ల రాష్ట్రానికి అప్రతిష్ట వచ్చిందని చెబుతుంటే ఎవరైనా నమ్ముతారా? మరి స్కిల్ స్కామ్లో జర్మనీ కంపెనీ సీమెన్స్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన స్కామ్ వల్ల అప్రతిష్ట రాలేదా? చంద్రబాబుకు ముఖ్య స్నేహితుడు ఈశ్వరన్ తో అమరావతిని ప్రమోట్ చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహించారు. తీరా చూస్తే ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కుకుని జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దీనివల్ల ఏపీ పరువుకు నష్టం జరగలేదా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నలకు ఎవరు జవాబివ్వాలి? కేవలం జగన్ పై ద్వేషంతో మాట్లాడితే సరిపోతుందా? జగన్ పై దుష్ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందడానికి ఎల్లో మీడియా ద్వారా టీడీపీ రాజకీయం చేస్తున్నదన్నది అర్ధం కావడం లేదా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను చెల్లించక పోవడంతో విద్యార్థులు చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రకాశం జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్మెంట్ రాక, ఫీజులు కట్టలేక.. పనులకు వెళుతున్న ఓ విద్యార్థి దీనావస్థ నాకు వేదన కలిగించింది.విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతారా?’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. తక్షణమే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్మెంటుతోపాటు వసతి దీవెన డబ్బులు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదని, చదువు పూర్తి చేసిన వారు బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని తెలిపారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..1 చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించక పోవడంతో వారు చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు.2 చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యా రంగాన్ని దారుణంగా దెబ్బ తీశారు. అమ్మ ఒడిని, ఇంగ్లీష్ మీడియంను, 3వ తరగతి నుంచి టోఫెల్, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంట్, నాడు–నేడు.. ఇలా అన్నింటినీ రద్దు చేసి, 1–12 వ తరగతి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దెబ్బ తీశారు. వసతి దీవెన, విద్యా దీవెన నిలిపేసి.. డిగ్రీ, ఇంజినీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న వారినీ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.3 వైఎస్సార్సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాలో నగదు జమ చేసే వాళ్లం. ఇలా గత విద్యా సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకు రూ.12,609 కోట్లు ఒక్క విద్యా దీవెనకే ఖర్చు చేశాం. తల రాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైఎస్సార్సీపీ హయాంలో ఈ రెండు (విద్యా దీవెన, వసతి దీవెన) పథకాలకే రూ.18 వేల కోట్ల వరకు ఖర్చు చేశాం.4 ఎన్నికల కోడ్ కారణంగా జనవరి–మార్చి త్రైమాసికానికి, ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి పారీ్టల వారు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ, ఎన్నికలు అయిన తర్వాత వీళ్లు జూన్లో అయినా ఇచ్చారా అంటే అదీ లేదు. అప్పటి నుంచి ఒక్క పైసా కూడా చెల్లించడం లేదు. ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితి కూడా అంతే. తర్వాత ఏప్రిల్–జూన్, జూలై–సెపె్టంబర్ త్రైమాసికాలకు సంబంధించి ఫీజుల చెల్లింపులో ఎలాంటి అడుగూ ముందుకు పడటం లేదు. ఇప్పుడు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం కూడా సగం గడిచి పోయింది. దీంతో కలుపుకుంటే సుమారు రూ.2,800 కోట్లకుపైగా ఫీజులు రీయింబర్స్ చేయాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్లు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద వసతి దీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్ నాటికి రూ.3,900 కోట్లకు చేరుకుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం తీరు చూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి.. కాళ్లేమో గడప కూడా దాటడం లేదు.5 ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదు. చదువులు పూర్తి చేసిన వారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చేసేదిలేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడమో చేయాల్సి వస్తోంది. ఏదారీ లేని వారు తమ పిల్లలను పనులకు తీసుకెళ్తున్నారు. చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు ఇలా ఉన్నాయి.6 కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాం, లిక్కర్ స్కాం, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులను దోచిపెట్టడాలు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధ లేకుండా పోయింది. వెంటనే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ సహా వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. -
రాజకీయ స్వార్థంతోనే బాలినేని వ్యాఖ్యలు : చెవిరెడ్డి
సాక్షి,ప్రకాశం జిల్లా : విద్యుత్ కొనుగోలుకు ఒప్పందంపై జనసేన నేత బాలినేని శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకితో జరిగిన ఒప్పందంపై చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. బాలినేని భ్రమలో ఉన్నారు. ఎమ్మెల్సీ కోసం రూ.9 కోట్లు కప్పం కట్టాడని ప్రచారం జరుగుతోంది. అబద్ధాలు ఎలా మాట్లాడాలో బాలినేనిని చూసి నేర్చుకోవాలి. సెకి ఒప్పందం రాష్ట్రానికి ప్రయోజనం. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.4.50కు ఒప్పందం జరిగితే.. వైఎస్సార్సీపీ హయాంలో రూ.2.48కే ఒప్పందం జరిగింది. గత టీడీపీ హయాంతో పోల్చుకుంటే 50 శాతం తక్కువే.రాజకీయ స్వార్థంతోనే బాలినేని వ్యాఖ్యలు. ఎనర్జి కమిటీ ఫైల్పై బాలినేని సంతకం పెట్టలేదా?.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బాలినేనికి ఉన్న స్వేచ్ఛ ఎవరికీ లేదు.బాబు అపాయింట్మెంట్ కోసమే బాలినేని ఇలా మాట్లాడుతున్నారేమో? బాలినేని మనస్తత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. -
ప్రభుత్వ విప్ గణబాబుకు అవమానం
సాక్షి,విశాఖపట్నం : ప్రభుత్వ విప్ గణబాబుకు అవమానం జరిగింది. ప్రధాని మోదీ పర్యటన రివ్యూ మీటింగ్లో గణబాబుకు గౌరవం దక్కలేదు. గణబాబుకు బదులుగా మంత్రి నారా లోకేష్ తొడల్లుడు ఎంపీ భరత్కు అందలం ఎక్కించారు. విప్ గణబాబు కుర్చీలో ఎంపీ భరత్కు అవకాశం కల్పించారు. సాధారణ ఎమ్మెల్యేలా గణబాబును అధికారులు ట్రీట్ చేశారు. దీంతో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని గణబాబు అసహనం వ్యక్తం చేశారు. -
చంద్రబాబూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు. ‘‘చంద్రబాబు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్మెంట్ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం నాకు ఆవేదన కలిగించింది.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘చంద్రబాబు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారు. అమ్మ ఒడిని, ఇంగ్లీష్ మీడియాన్ని, 3వ తరగతి నుంచి టోఫెల్, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ, సీబీఎస్ఈ నుంచి ఐబీదాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంట్, నాడు-నేడు ఇలా అన్నింటినీ రద్దుచేసి 1-12వ తరగతి విద్యార్థులను, వారి తల్లులను దెబ్బతీశారు. వసతిదీవెన, విద్యాదీవెన నిలిపేసి, డిగ్రీ, ఇంజినీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్నవారినీ తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారు.’’ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లుల ఖాతాలో జమచేసే వాళ్లం. ఇలా గత విద్యాసంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకూ రూ.12,609 కోట్లు ఒక్క విద్యాదీవెనకే ఖర్చు చేశాం. తలరాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైఎస్సార్సీపీ హయాంలో మొత్తం ఈ రెండు పథకాలకే రూ.18వేల కోట్లు వరకూ ఖర్చు చేశాం.’’ అని వైఎస్ జగన్ వివరించారు.1.@ncbn గారి కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబుగారు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో… pic.twitter.com/6aXEQoRKqv— YS Jagan Mohan Reddy (@ysjagan) November 24, 2024 ‘‘ఎన్నికల కోడ్ కారణంగా జనవరి-మార్చి త్రైమాసికానికి, ఏప్రిల్ లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ ఎన్నికలు అయిన తర్వాత వీళ్లు జూన్లో అయినా ఇచ్చారా అంటే అదీలేదు. అప్పటినుంచి ఒక్కపైసాకూడా చెల్లించడంలేదు. ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితి కూడా అంతే. తర్వాత ఏప్రిల్-జూన్, తర్వాత జులై-సెప్టెంబరు త్రైమాసికాలకు సంబంధించి ఫీజులు చెల్లింపులో ఎలాంటి అడుగూ ముందుకు పడ్డంలేదు. ఇప్పుడు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం కూడా సగం గడిచిపోయింది. దీంతో కలుపుకుంటే సుమారు రూ.2,800 కోట్లకుపైగా ఫీజులు రీయింబర్స్ చేయాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్లు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద వసతిదీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్ నాటికి రూ.3,900 కోట్లకు చేరుకుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం తీరుచూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి. కాళ్లేమో గడపకూడా దాటడం లేదు’’ అని దుయ్యబట్టారు.‘‘ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడంలేదు, చదువులు పూర్తిచేసినవారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లూ ఇవ్వడంలేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చేసేదిలేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడమో చేయాల్సి వస్తోంది. ఏదారీలేనివారు తమ పిల్లలను పనులకు తీసుకెళ్తున్నారు. చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు ఇవి...ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాం, లిక్కర్ స్కాం, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులను దోచిపెట్టే స్కాంలు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధలేకుండా పోయింది. వెంటనే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ సహా వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: అదిగో పులి... ఇదిగో తోక!సమస్యల వలయంలో సం‘క్షామ’ హాస్టళ్లు -
అసెంబ్లీలో ఆ విషయం మర్చిపోయావా అఖిల ప్రియ.. భూమా కిషోర్రెడ్డి ఫైర్
సాక్షి, నంద్యాల జిల్లా: అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆన్లైన్ మోసాల గురించి మాట్లాడటం కంటే ఆళ్లగడ్డలో జరిగే అరాచకాల గురించి మాట్లాడితే బాగుండేదంటూ భూమా అఖిల ప్రియపై వైఎస్సార్సీపీ నేత భూమా కిషోర్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మున్సిపాలిటీలో ఉద్యోగాల కోసం రెండు లక్షల తీసుకోవడం నిజం కాదా? అని ప్రశ్నించారు.‘‘అసెంబ్లీలో ఆళ్లగడ్డ రైతుల ప్రస్తావన రాకపోవడం, మద్దతు ధర గురించి మాట్లకపోవడం దారుణం. గత ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు పెరిగాయని బాదుడే బాదుడు అంటూ తిరిగారు. కూటమి ప్రభుత్వం హయాంలో గతంలో కంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయనే విషయంపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు. 15 మంది ఎమ్మెల్యే పేర్లు చెప్పుకొని అక్రమ వసూళ్లు చేస్తున్నారు. తర్వాత వడ్డీతో సహా చెల్లించేలా చేస్తాం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బెల్టు షాపులు, కల్తీ మద్యం అమ్ముతున్నారు ముందు వాటి గురించి తేల్చడంటూ భూమా కిషోర్రెడ్డి ధ్వజమెత్తారు. -
నారు పోస్తే.. నీరు ‘నారా’వారు పోస్తారా?
సంతానోత్పత్తికి సంబంధించి ఏపీ శాసనసభ చేసిన చట్ట సవరణ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతకాలంగా చేస్తున్న ప్రచారానికి అనుగుణంగా ఉంది. దీని ప్రకారం ఇద్దరు మించి పిల్లలు ఉన్నవారూ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అర్హులవుతారు. దీంతో మూడు దశాబ్దాల క్రితం జనాభా నియంత్రణ కోసం అప్పటి ప్రభుత్వం చేసిన చట్టం కాస్తా లేకుండా పోయింది. అయితే దీనివల్ల ప్రయోజనం ఎంత మేరకన్నది మాత్రం చర్చనీయంశమే. ఇద్దరి కంటే ఎక్కువమంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనువుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టాన్ని ఆమోదించింది కానీ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాత్రం ఇది వర్తించదు. టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అరకొరగా చేసిన ఈ చట్టం వల్ల ప్రయోజనం ఏమిటన్న సందేహమూ ఆయన వ్యక్తం చేశారు. ఇది వాస్తవమే. చంద్రబాబు నాయుడు కొన్నేళ్లుగా ‘‘పిల్లలను కనండి..వారి భవిష్యత్తు నేను చూసుకుంటా‘ అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. అందులో భాగంగా కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఏడాదికి రూ.15 వేల చొప్పు ఇస్తామన్న ‘తల్లికి వందనం’ పథకాన్ని తీసుకొస్తామని ఎన్నికల సందర్భంగా హామీ కూడా ఇచ్చారు. అదే సందర్భంలో ఏపీలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటును పెంచాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం ప్రోత్సహాకాలు ఇవ్వాలని కూడా సూచించారు. చైనా, జపాన్ వంటి దేశాలలో వృద్దుల సంఖ్య పెరుగుతుండడం, అక్కడ యువత ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటుండడం వంటి కారణాల రీత్యా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు చైనా తన చట్టాలను కూడా మార్చుకుంది. ఒకే సంతానం అన్న పరిమితిని ఎత్తేసింది. జపాన్ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. రష్యా తదితర దేశాలు కూడా ఇదే మార్గంలో ఉన్నాయి. అయితే ఈ దేశాలకు, భారత్కు అసలు పోలికే లేదు. భారత్లో నిరక్షరాస్యత ఎఉక్కవ, పేదరికమూ తగ్గలేదు. అధిక జనాభా కారణంగా సంక్షేమ పథకాల అమలు కూడా కష్టమవుతోందన్న ఆలోచనతో అప్పట్లో భారత్లో జనాభా నియంత్రణకు ప్రభుత్వం ప్రోత్సాహమిచ్చింది. 1960లలో కేంద్రం కుటుంబ నియంత్రణను ఒక ఉద్యమంలా అమలు చేసింది. ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారన్న అంశం పెద్ద వివాదమైన సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ అకృత్యాలతోపాటు నిర్భంధ ఆపరేషన్లూ కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కారణమయ్యాయి.1990లలో జనాభా నియంత్రణ లక్ష్యంతో ప్రభుత్వాలు స్థానిక ఎన్నికలలో పోటీ అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ఉమ్మడి ఏపీలో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక ఎన్నికలలో పోటీకి అనర్హులను చేస్తూ చట్టం తెచ్చారు. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాభా తగ్గుదల ఆవశ్యకతపై శాసనసభలో చర్చలు జరిపారు. తీర్మానాలు చేశారు. నిరోధ్ వంటి బొమ్మలను అసెంబ్లీ ఆవరణలో ప్రదర్శించడం పై కొన్ని అభ్యంతరాలు వచ్చినా, ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత కాలంలో ఈ అంశానికి అంత ప్రాధాన్యత రాలేదు. దానికి కారణం ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఒకరిద్దరు పిల్లలను కంటున్నారు. వారికి విద్య, ఆరోగ్యం వంటి వాటిపై శ్రద్ద చూపుతున్నారు. మధ్య తరగతి, ఉన్నతాదాయ వర్గాలు ఎప్పటి నుంచో ఈ విధంగా ఒకరిద్దరు పిల్లలకే పరిమితం అవుతున్నాయి. ఒకప్పుడు అంటే పూర్వకాలంలో జనాభా నియంత్రణ పద్దతులు అంతగా వ్యాప్తిలోకి రాకముందు అధిక సంఖ్యలో సంతానాన్ని కనేవారు. ఉదాహరణకు అందరికి తెలిసిన ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు పదకుండు మంది పిల్లలు ఉన్నారు. ఇలా ఒకరని కాదు..అనేకమంది పరిస్థితి ఇలాగే ఉండేది. కాని కాలం మారుతూ వచ్చింది. ప్రజల ఆచార వ్యవహారాలు, అలవాట్లు, కుటుంబ పద్దతులు అన్నిటిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు పిల్లలు పుట్టిన వెంటనే ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ప్రభుత్వాల ప్రోత్సాహాకాలతో నిమిత్తం లేకుండా ఎవరికి వారు అలా చేస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు చంద్రబాబు అధిక సంతానం కోసం ప్రచారం ఆరంభించే దశ వచ్చింది. దీనిని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి వంటి ఒకరిద్దరు తప్ప పెద్దగా ఎవరూ స్వాగతించలేదు. దానికి కారణం పిల్లలను కంటే ఎవరు పోషిస్తారు? దానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? అన్న మీమాంస ఉండడమే. ఈ రోజుల్లో పిల్లల విద్యకు ప్రైవేటు స్కూళ్లలో వేల రూపాయల చొప్పున ఫీజులు కట్టాల్సి వస్తోంది. జగన్ ప్రభుత్వం పేద పిల్లలకు ఉపయోగపడేలా ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయడంతో పాటు ,అమ్మ ఒడి పేరుతో పిల్లలను స్కూళ్లకు పంపించే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇచ్చింది. ఆ స్కీమ్ సఫలం అవడంతో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక వాగ్దానం చేస్తూ ప్రతి తల్లికి కాదు.. బడికి వెళ్లే ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది దీనిని అమలు చేయలేదు. దాంతో ఏపీలో పేద కుటుంబాలు మోసపోయామని భావిస్తున్నాయి. అలాగే ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని కూడా టీడీపీ, జనసేన కూటమి సూపర్ సిక్స్ లో హామీ ఇచ్చాయి. ఆ విషయాన్ని చంద్రబాబుతో పాటు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక అవన్ని ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి నిజంగానే పిల్లలను ఎక్కువగా కంటే ఎవరు పోషిస్తారని జనం అడుగుతున్నారు. పోనీ ఈ ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు ముందుగా తమ కుటుంబాలలో దానిని అమలు చేసి చూపిస్తున్నారా? అంటే అదేమీ లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు బీజేపీతో మళ్లీ స్నేహం పెట్టుకున్నాక, వారి మెప్పు పొందేందుకు ఇలాంటి కొత్త, కొత్త ప్రచారాలు ఆరంభించారన్న అభిప్రాయం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ కొత్త అవతారం ఎత్తే యత్నం చేస్తున్నారు. ఈ పరిణామాలపై హిందూవాదులు పెద్దగా స్పందించలేదు కాని, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ హర్షం వ్యక్తం చేశారు. నిజానికి ఎవరి కుటుంబం వారిది. వారి ఆర్థిక స్థోమతను బట్టి పిల్లల సంఖ్యను నిర్ణయించుకుంటారు. అంతే తప్ప చంద్రబాబు చెప్పారనో, మరెవరో అన్నారనో, లేక కేవలం ఏదో స్థానిక ఎన్నికల నిమిత్తమో ఇద్దరిని మించి పిల్లలను కంటారని ఎవరూ అనుకోవడం లేదు. టీడీపీ సభ్యుడు అన్నట్లు నిజంగానే అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కంటే ఆయా సంక్షేమ పథకాలు పిల్లలందరికి వర్తిస్తాయని కూడా ప్రభుత్వం తీర్మానించాలి కదా! అలా చేయలేదు సరికదా, ఇస్తామన్న తల్లికి వందనం స్కీమును హుళక్కి చేశారు. ఈ నేపథ్యంలో పిల్లలను బాగా కనండి అని చంద్రబాబు ప్రచారం చేస్తే నమ్మి ఎవరైనా అలా చేస్తారా? :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
హామీలు తప్పించుకునేందుకే ‘కూటమి’ డైవర్ట్ పాలిటిక్స్: రవీంద్రనాథ్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులపై చంద్రబాబు సర్కార్ బురదచల్లడమే పనిగా పెట్టుకుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోబెల్స్ ప్రచారం చేస్తూ ఈ ఏడు నెలల కాలాన్ని గడిపేశారు. పరిపాలనలో అప్పులు తప్ప ఏమీ లేదని దుయ్యబట్టారు.‘‘మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలొ తొక్కారు. వీటన్నిటి నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. నెలకో అభూత కల్పనలు తీసుకొచ్చి అభాండాలు వేస్తున్నారు. తిరుమల లడ్డూ నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల వరకూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్ ఇంట్లో కలహాల గురించి కొన్ని రోజులు తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు అదానీ ఒప్పందాలు అంటూ కొత్త కథలు అల్లుతున్నారు.విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు వైఎస్ జగన్ కృషి చేశారు. చంద్రబాబు 13 వేల కోట్లు ఇస్తే.. జగన్ 40 వేల కోట్లు డిస్కాంలకు ఇచ్చారు. చంద్రబాబు అన్నీ తాత్కాలికమైన పనులు చేస్తే.. జగన్ దూరదృష్టితో పని చేసారు. అన్నీ అమ్మేయడమా? ప్రైవేటీకరణ చేయడమా అనే రీతిలో చంద్రబాబు పని చేస్తాడు. చెప్పింది మర్చిపోవడం తప్ప చంద్రబాబుకు ఏ విజన్ లేదు. సెకీతో ఒప్పందం చేసుకుని తక్కువకే సోలార్ పవర్ తెస్తే అదానీ పేరు చెప్తున్నారు. 2021 జనవరిలో కేంద్రం ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీలు రద్దు చేసింది. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం సెకీ తో ఒప్పందం చేసుకున్నారు.చంద్రబాబు తన హయాంలో సోలార్ పవర్ 5.50 పైసలతో 20 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నాడు. జగన్ ప్రభుత్వంలో 2.30 పైసలతో సెకీతో ఒప్పందం చేసుకున్నాం. ఎవరు ఎక్కువ ఖర్చుతో కొనుగోలు చేసారో ప్రజలు గమనించాలి. వాస్తవాలను దాచి ఆ పత్రికలు చంద్రబాబును మోసే పనిలో పడ్డారు. ప్రజలు చంద్రబాబు డ్రామాలు గమనిస్తూనే ఉన్నారు’’ అని రవీంద్రనాథ్రెడ్డి చెప్పారు. -
చంద్రబాబుకు ఆ ఒప్పందాలను రద్దు చేసే దమ్ముందా?: పేర్ని నాని
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్పై 15 ఏళ్లుగా ఎల్లో మీడియా విషం చిమ్మనిరోజు లేదన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఎన్ని కుట్రలు చేస్తున్నా వాటిని జగన్ పటాపంచలు చేస్తున్నారని పేర్ని నాని అన్నారు.‘‘రెండు పేపర్లు, పది టీవీ ఛానళ్లతో నిత్యం వైఎస్ జగన్పై విషం చిమ్ముతూనే ఉన్నారు. గతంలో కూడా ఇలాగే అమెరికాలో కేసులు అంటూ విషం చిమ్మారు. అయినా సరే జనం జగన్ను సీఎం చేశారు. ఇప్పుడు మళ్లీ విషం చిమ్మటం మొదలయింది. జగన్కు రూ.1750 కోట్ల లంచాలు అంటూ ఈనాడు రాసింది. సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అవినీతా?. పైగా ఇంటర్నేషనల్గా జగన్ పేరు అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ జైలుకు వెళ్లినప్పుడే చంద్రబాబు పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. మార్గదర్శి పాపాలను ఈనాడులో ఏనాడైనా రాశారా?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.‘‘అదానీ చంద్రబాబును కలిస్తే ఆహాఓహో అంటూ ఈనాడు రాసింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయంటూ పేజీల నిండా రాసింది. అదే అదానీ జగన్ను కలిస్తే పోర్టులు, మైనింగ్ అంతా అదానీకే దోచిపెడుతున్నారంటూ తప్పుడు వార్తలు రాసింది. ఇలా రాస్తే జనం నవ్వుతారని కూడా లేకుండా నిస్సిగ్గుగా వార్తలు రాసింది. కేంద్ర రంగ సంస్థ సెకీతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. రూ.2.49లకే 25 సంవత్సరాలపాటు విద్యుత్ ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది. ఇందులో తప్పేముంది?’’ అని పేర్ని నాని చెప్పారు.‘‘రూ.4.50ల చొప్పున చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే తప్పు కాదా?. అదే రూ.2.49లకే జగన్ కొనుగోలు చేస్తే అవినీతా?. అడ్డగోలు ఒప్పందాలతో చంద్రబాబు జనం మీద భారం వేస్తే అది ఈనాడుకు కనపడదా?. రామోజీరావు సంతాప సభ కోసం ప్రజల సొమ్ము రూ.25 కోట్లు ఖర్చు చేశారు. అందుకని చంద్రబాబు రుణం తీర్చుకోవటానికి ఈనాడు పచ్చి అబద్దాలను అచ్చోసింది. చంద్రబాబు దిగేనాటికి కరెంటు కంపెనీలకు రూ.22 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్నది కేంద్ర రంగ సంస్థ కంపెనీ సెకీతోనే.. అదానీతో ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదు’’ పేర్ని నాని స్పష్టం చేశారు.‘‘కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుగోలు చేస్తుందో మాకు అనవసరం. జగన్ కంటే సంవత్సరంన్నర ముందు అదే సెకీతో చంద్రబాబు రకరకాల అధిక ధరలతో కొనుగోలు చేశారు. మిగతా రాష్ట్రాల్లో అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు జరిగితే చంద్రబాబు ఎందుకు అధిక ధరకు కొనుగోలు చేశారు?. జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు తప్పు అయితే దాన్ని రద్దు చేయాలి. గతంలో జగన్ పై పెట్టిన కేసుల్లో నిజం లేదని సుప్రీంకోర్టు తేల్చేసింది. సంతకాలు పెట్టిన అధికారుల తప్పు లేదని తేల్చింది. అలాంటప్పుడు ఇక జగన్ పేరు ఎందుకు ప్రస్తావన ఉంటుంది?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.ఇదీ చదవండి: సెకీతోనే ఒప్పందం.. ప్రభుత్వానికి అదానీతో ఏం సంబంధం? -
పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజు: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా నిలిచిందని.. ప్రతిపక్షానికి రావాల్సిన పీఏసీ పదవిని రాకుండా అడ్డుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం చేసే ఖర్చులపై పీఏసీ నిఘా ఉంటుందనే ఇలాంటి కుట్ర చేశారన్నారు.ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. అందుకే పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇస్తారు. 1985-86లో టీడీపీకి 30 సీట్లే వచ్చినప్పటికీ ఏరాసు అయ్యపరెడ్డికి పీఏసీ ఛైర్మన్ ఇచ్చారు. వంద సంవత్సరాల పీఏసీ చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు ఛైర్మన్గా వ్యవహరించారు. తగిన సంఖ్యా బలం లేకపోయినా పీఏసీ ఛైర్మన్గా ఇచ్చారు. బోఫార్స్ కుంభకోణం కూడా ఇదే పీఏసీ బయట పెట్టింది. స్పెక్ట్రం స్కాంని కూడా పీఏసీ ఛైర్మన్ మురళీ మనోహర్ జోషి బయటకు తీశారు. కోల్గేట్ కుంభకోణం వంటి అనేక అంశాలను పీఏసీనే బయటకు తీసింది’’ అని చంద్రశేఖర్ గుర్తు చేశారు.‘‘అలాంటి వ్యవస్థను ఏపీలో లేకుండా చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అప్పుడు అడ్డూ అదుపు లేకుండా స్కాంలు చేయొచ్చని భావిస్తున్నారు. ప్రతిపక్షానికి పదవి ఇవ్వనప్పుడు నామినేషన్ల వ్యవహారం ఎందుకు తెచ్చారు?. మా పార్టీ తరపున నామినేషన్ వేయటానికి వెళ్తే ఒక్క అధికారి కూడా అక్కడ లేరు. మూడు గంటలసేపు అక్కడ కూర్చోపెట్టి అవమానపరిచారు. మా హయాంలో ప్రతిపక్షానికే పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చాం. హుందాగా మేము వ్యవహరించాం. కానీ అలాంటి హుందాతనం కూటమి ప్రభుత్వంలో లేదుఇదీ చదవండి: ‘లోకేష్ సీఎం కాకూడదనేది ఎవరి ఆలోచనా?’..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూస్తే చంద్రబాబుకు భయం.. అందుకే ఆయనకి పీఏసీ ఛైర్మన్గా రాకుండా అడ్డుకున్నారు. మూడు కమిటీల్లో ఒక్కదానికి కూడా ప్రతిపక్ష సభ్యులను లేకుండా చేశారు. తద్వారా అడ్డగోలుగా దోపిడీ చేయాలని భావించారు. చివరికి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చారు. తాలిబన్లు మాత్రమే ఆ పదవిని వారి దగ్గర పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం కూడా తాళిబన్ల బాటలోనే నడుస్తోంది. రాష్ట్రాన్ని తాలిబన్ల బాటలో నడిపిస్తున్నారు. దళిత నేతలకు రాష్ట్రంలో రక్షణలేదు. నందిగం సురేష్ని మూడు నెలలుగా జైలులో పెట్టి వేధిస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మాదిగలపై ఇలాంటి వివక్ష తగదు’’ అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
ఇలాగే వేధిస్తే సీఎం ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటా: ఇంటూరి రవి భార్య సుజన
సాక్షి, తాడేపల్లి: తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికుమార్ భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రమంతా తిప్పుతున్నారని అన్నారు. కనీసం తన భర్తను కలిసే అవకాశం కూడా ఇవ్వటం లేదని వాపోయారు. తన భర్త హార్ట్ పేషెంట్ అని కనీసం మెడిసన్ కూడా ఇవ్వటం లేదని మండిపడ్డారు. తన భర్తను ఇలాగే వేధిస్తే సీఎం చంద్రబాబు ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. రెండున్నర నెలలుగా తన భర్తను పోలీసులు ఎలా వేధిస్తున్నారో చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించారు. తన భర్తపై ఇప్పటికే 15 కేసులు పెట్టారని, ఇంకా పెడుతూనే ఉన్నారని,. అసలు ఆయన చేసిన తప్పేంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తమ కుటుంబాన్ని చాలా దారుణంగా ఇబ్బందులు పెడుతోందని వాపోయారు. భ ర్త వెంట వెళ్తున్నానని తన కారులో గంజాయి పెట్టి మరో కేసు పెట్టాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.విశాఖలోని మా ఇంటి నుంచి తీసుకువెళ్ళి తొలుత గుడివాడ, తర్వాత గుంటూరు అరండల్పేట, దువ్వాడలో కేసులు పెట్టారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు గుంటూరు వరకు ఎక్కడెక్కడో కేసులు పెట్టారు.నా భర్తను తీసుకెళ్తున్న పోలీసులతో నేను ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి, మా కారులో గంజాయి పెట్టి సీజ్ చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత విశాఖలోని మహారాణిపేట పీఎస్కు పంపి, అక్కడి నుంచి రాజమండ్రిలో రిమాండ్కు పంపారు. అక్కడి నుంచి మాచర్ల, తర్వాత కురుపాం, తర్వాత వైజాగ్ సెంట్రల్ జైల్కు పంపారు. పీటీ వారెంట్లు వేసి అక్కడి నుంచి బాపట్ల, ఇంకొల్లు పీఎస్కు ఆ తర్వాత సబ్బవరం జైల్కు పంపారు. అక్కడి నుంచి శ్రీకాకుళం లావేరు, గాజువాక కోర్టు ఇలా తిప్పి తిప్పి ఇప్పుడు మాచర్ల తీసుకువెళ్ళారు.రిమాండ్లో ఉన్నారని తెలిసి కూడా పులివెందుల పీఎస్ నుంచి పోలీసులు వచ్చి మా ఇంటి గోడకు నోటీసులు అంటించారు.నా భర్త హార్ట్ పేషెంట్. ఆయనకు ఏం మందులు ఇస్తున్నారో కూడా తెలియడం లేదు. ఏ జైల్లో ఉన్నాడో తెలుసుకుని అక్కడికి వెళితే అక్కడ కలవనీయకుండా పీటీ వారెంట్ల పేరుతో ఇంకో చోటకు తరలిస్తున్నారు. మా లాయర్లకు కూడా పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. ఆయనను ఒకేచోట అస్సలు ఉంచకుండా దాదాపు అన్ని జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లు. జైళ్లు తిప్పుతున్నారు. నా భర్త ఆరోగ్యం బాగోలేదు. అయినా ఆయన్ను కనీసం చూడనివ్వడం లేదు. అర్ధరాత్రిళ్ళు తరలిస్తున్నారు. 12 ఏళ్ళ నుంచి మేం వైఎస్సార్సీపీలో పనిచేస్తున్నాం, నా భర్త ఏ తప్పూ చేయలేదు. అయినా ఆయన పట్ల ఇంత కక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదు.నా భర్తను, మా కుటుంబాన్ని ఇలాగే వేధిస్తే నేను చంద్రబాబు ఇంటి ముందు నా పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటాను’ అని సుజన పేర్కొన్నారు.రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ అధికారిక గూండాగిరి వెర్రితలలు వేస్తోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో రోజురోజుకీ మరింతగా పేట్రేగిపోతోంది. ఉగ్రవాదులపట్ల కూడా వ్యవహరించనంత కాఠిన్యంతో పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ మానవ హక్కులను నిర్భీతిగా కాలరాస్తున్నారు. ఒక్కొక్కరిపై నాలుగైదు అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టుచేస్తున్న పోలీసులు వారు రిమాండ్లో ఉండగానే వారికి తెలియకుండానే మరిన్ని కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్ను అక్రమ కేసులో ఇటీవల దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసినా ప్రభుత్వ కక్ష చల్లారలేదు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆయన్ని రాజమహేంద్రవరం జైలుకు తరలించిన పోలీసులు.. ఆ తరువాత కూడా వేధిస్తుండడం విస్మయం కలిగిస్తోంది.