breaking news
-
మంచి చేసినోడిపై రాళ్లు వేస్తారా?: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: తాను సంపద సృష్టి చేస్తే.. చంద్రబాబు ఆవిరి చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మంచి చేసినోడిపై రాళ్లు వేస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘డిసెంబర్ 1న సెకీ, ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. పవర్ సేల్ అగ్రిమెంట్ జరిగింది. ఒప్పందంలో సెకీ, ఏపీ ప్రభుత్వం, డిస్కమ్ల సంతకాలు చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో థర్డ్ పార్టీ ఎక్కడుంది?. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మినహాయిస్తూ ఒప్పందంలో స్పష్టంగా ఉంది. గుజరాత్, రాజస్థాన్లో పవర్ జనరేషన్ కాస్ట్ గురించే మాట్లాడుతున్నారు. ట్రాన్స్ మిషన్ కాస్ట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు?. ధర్మం లేదు.. న్యాయం లేదు.. మంచి చేసిన వాళ్లపై బండలు వేయడమే పని’’ అంటూ చందబాబు, ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు, ఆయన సోషల్ మీడియా నాపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు కంటే ఏపీకి తక్కువ రేటుకే విద్యుత్ వచ్చింది. తక్కువ రేటుకు విద్యుత్ తీసుకొస్తే సన్మానించాల్సింది పోయి.. మాటలంటున్నారు. సంపద సృష్టి నేను చేస్తే.. బాబు ఆవిరి చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరణ చేసి రాస్తున్నాయి. చంద్రబాబు, ఎల్లో మీడియా వక్రీకరించి మాట్లాడటం ధర్మమేనా?. ఈ ప్రతిపాదన అక్టోబర్ 28న కేబినెట్ ముందుకు ఎజెండా ఐటమ్ కింద వచ్చింది. టీవీ రేట్లు తగ్గినట్లు కరెంటు రేట్లు తగ్గాలని ఈనాడు రాసింది. వక్రీకరణలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి ఇవే ఉదాహరణలు’’ అంటూ వైఎస్ జగన్ వివరించారు. -
ఈనాడు, ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తున్నాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో.. తన పేరు ఉందన్న ప్రచారంపైనా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఆ ఆరోపణల్లో తన పేరు ఎక్కడా లేదని, అది ఉత్త మూర్ఖపు ప్రచారమేనని, కొంతమంది కావాలని చేస్తున్న రాద్ధాంతమని కుండబద్ధలు కొట్టారాయన. అలాగే తనపై తప్పుడు రాతలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతికి డెడ్లైన్ విధించారాయన.‘‘సీఎంలు పారిశ్రామిక వేత్తలను కలుస్తారు. నేను ఐదేళ్ల కాలంలో అదానీని కలిశాను. వాటికి విద్యుత్ ఒప్పందాలకు ముడిపెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో థర్డ్ పార్టీ ఎవరూ లేరు. ఇది ఏపీ ప్రభుత్వానికి, డిస్కంలకు, కేంద్ర ప్రభుత్వానికి(సెకి) మధ్య జరిగిన ఒప్పందం. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లపై పరువు నష్టం దావా వేస్తా. .. ఈనాడు, ఆంధ్రజ్యోతి.. టీడీపీ కోసం పని చేసే మీడియా సంస్థలు. వాస్తవాల్ని వకక్రీకరించి పదే పదే అబద్ధాలు రాస్తున్నాయి. ఆ కేసులో నా పేరు ఎక్కడా లేదు. కానీ, ఆ రెండు మీడియా సంస్థలు నా పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేలా అబద్ధాలతో ప్రచారం చేస్తున్నాయి. వాటికి లీగల్ నోటీసులు పంపిస్తా. వాటికి 48 గంటల ఇస్తున్నా. ఆ లోపు క్షమాపణలు చెప్పకపోతే.. రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.ఇదీ చదవండి: సంపద సృష్టించిన జగన్.. ఆవిరి చేస్తున్న చంద్రబాబు! ఎలాగంటే.. -
సెకి ఒప్పందం.. ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పిన వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు జరుగుతున్న కుట్రలను.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగట్టారు. ఒప్పందం జరిగింది కేంద్ర ప్రభుత్వం(సెకి), రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమేనని.. ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే అత్యంత చవకైన ఈ ఒప్పందంపై బురద జల్లుతూ రాతలు రాయడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారాయన. తాడేపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘రైతులకు ఉచిత కరెంట్ అనేది ఒక కల. దీనివల్ల రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. బాబు హయాంలో డిస్కంల పరిస్థితి దయనీయంగా మారింది. డిస్కంలను నిర్వీర్యం చేశారాయన. చంద్రబాబు చేసిన సోలార్ పవర్ ఒప్పందాలు రూ.5.90తో చేసుకున్నారు. డిస్కంల అప్పులను 86 వేల కోట్లకు పెంచారు. మా హయాంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశాం. పగటి పూటే రైతులకు 9 గంటల కరెంట్ ఇవ్వగలిగాం. ఉచిత కరెంట్ కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశాం. ఆ టైంలో యూనిట్ను 2.40 నుంచి 2.50 రూ. చొప్పున సప్లై సేందుకు 24 బిడ్లు వచ్చాయి. కానీ, చంద్రగ్రహణం(చంద్రబాబును ఉద్దేశించి).. ఆ ప్రక్రియకు అడ్డం పడింది. కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికోసం మేం వివిధ కోర్టులో పోరాడాల్సి వచ్చింది. అలాంటి టైంలో.... 2021 సెప్టెంబర్ 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం (సెకి) నుంచి తియ్యటి కబురుతో ఓ లేఖ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను పొగుడుతూ.. రైతుల పట్ల ప్రదర్శిస్తున్న ప్రత్యేక శ్రద్ధను సెకి అభినందించింది. యూనిట్కు రూ.2.49కే.. మొత్తంగా 9 వేల మెగా వాట్ల పవర్ను అందుబాటులోకి ఇస్తాం అంటూ పేర్కొంది. ఇందులో 2024 సెప్టెంబర్లో 3 వేల మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ఇది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించిన పవర్ ఆఫర్ ఇది... కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రశంసిస్తూ.. ఆ సంకల్పానికి తోడుగా ఉంటామని లేఖ రాసింది. మేమే పవర్ సప్లై చేస్తామని చెప్పింది. ఇక్కడ మూడో పార్టీ ఎక్కడుంది?. రెండోది.. రూ.2.49కి అందుబాటులోకి ఇస్తాం అంటూ పేర్కొంది. ఇది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించే ఒప్పందం. ఐఎస్టీఎస్ (ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు) ఛార్జీలు లేకుండా(యూనిట్కు రూ.1.98పైసా చొప్పున).. స్పెషల్ ఇంటెన్సివ్ ఇస్తానంది. ఇక్కడ.. యూనిట్ రూ.2.61 మనకు కలిసి వస్తుంది. ఏడాది 4,400 కోట్లు కలిసి వస్తాయి. ఒప్పందం ప్రకారం పాతికేళ్లకు.. లక్షల కోట్లు కలిసి వచ్చేవి... ఏపీ చరిత్రలోనే అత్యంత చవకైన విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇది. లక్షల కోట్లు ఆదాయం ఆదా కావడం సంపద సృష్టి కాదా?. ఇది చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం. ఇలాంటి ఒప్పందానికి స్పందించకున్నా.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఊరుకునేవా?. నన్ను ఏమనేవారు.ఇంకా జగన్ ఏమన్నారంటే.. 👉ఆరోజుల్లో దాదాపు 18 లక్షల పంప్సెట్లు. దానికి ఉచిత కరెంటు కోసం దాదాపు రూ.9 వేల కోట్ల ఖర్చు.అలాంటి పరిస్థితుల్లో.. చంద్రబాబు 5 ఏళ్ల పాలన చూస్తే.. విద్యుత్ రంగం దారుణం. డిస్కమ్లు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయి. డిస్కమ్ల పరిస్థితి చూస్తే, చంద్రబాబు రాకముందు రూ.29 వేల కోట్ల అప్పులు, బకాయిలు ఉంటే, ఆయన దిగిపోయేనాటికి అవి ఏకంగా రూ.86 వేల కోట్లకు ఎగబాకాయి. దాదాపు 23.88 శాతం సీఏజీఆర్. డిస్కమ్ల నష్ట పరిస్థితి.ప్రభుత్వం నుంచి డిస్కమ్లకు సపోర్టు చూస్తే.. రూ.13255 కోట్లు మాత్రమే చేయగా, మా ప్రభుత్వ హయాంలో రూ.47,800 కోట్లు. ఆ విద్యుత్ను 20 ఏళ్లపాటు ఉచితంగా ఇచ్చేలా, ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది.👉టెండర్లు. చంద్రగ్రహణం2020 నవంబర్ లో 6,400 మెగావాట్లకు సంబంధించి టెండర్లు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, సోలార్ పార్కులు రాష్ట్రంలో పెట్టాలని టెండర్లు పిలిచాం. ఆ టెండర్లలో రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున సరఫరాకు ఎన్టీపీసీ వంటి పెద్ద సంస్థలన్నీ పాల్గొన్నాయి. దాదాపు 24 బిడ్లు దాఖలయ్యాయి. కానీ దురదృష్టవశాత్తూ మనం ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలంటే చంద్రబాబు అనే చంద్రగ్రహణం కూడా మనకు ఉంది కాబట్టి, రకరకాల పద్ధతుల్లో కోర్టుల్లో ఈ ప్రక్రియ అంతా ఆపేసే కార్యక్రమం జరిగింది. కోర్టుల ద్వారా ఆగిపోయిన పరిస్థితులు కనిపించాయి.2020 నవంబరులో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి, ఆ తర్వాత వివిధ కోర్టుల్లో దీని కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.👉సెకి లేఖ రాక. తీపి కబురు2021, సెప్టెంబరు 15న, రాష్ట్ర ప్రభుత్వానికి తీయటి కబురు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి నుంచి లేఖ వచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) నుంచి వచ్చిన లేఖ సారాంశం చూస్తే..6400 మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధమని ప్రకటించింది. ప్రభుత్వానికి వచ్చిన అతి తక్కువ ధర రూ.2.49 చూశాం. మీరు రైతులపై చూపుతున్న శ్రద్ధను అభినందిస్తున్నాం. డిస్కమ్ల మీద భారం తగ్గిస్తూ, రైతులను ఆదుకుంటున్న విధానాన్ని, వారికి ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ, ఆ విద్యుత్ను తామే రూ.2.49కే ఇస్తామని సెకి వెల్లడించింది.అంతే కాకుండా, వారు చెప్పిన ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. ఒక స్పెషల్ ఇన్సెంటివ్గా.. ఐఎస్టీఎస్ (ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్)ను 25 ఏళ్లపాటు రద్దు చేస్తామని వెల్లడించారు.అలా 2026 నాటికి మొత్తం మీద 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా చేస్తామని సెకి వివరించింది.👉నేను ఒక్కటే అడుగుతున్నాను. ఆ లెటర్లో టేక్ ఎవేస్ చూస్తే..కేంద్ర సంస్థ సెకితో ప్రభుత్వం నేరుగా జరిపిన లావాదేవీ ఇది. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరూ లేరు. ఇంకా చెప్పాలంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విషయం.యూనిట్ రూ.2.49కే. ఇది రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ ఖర్చుతో వచ్చే విద్యుత్.ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఐఎస్టీఎస్ (ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్) ఉండదు. ఇది స్పెషల్ ఇన్సెంటివ్గా ఇస్తున్నామని చెప్పడం. 👉సంపద సృష్టి అంటే ఏమిటి? మీరే చెప్పండి:గతంలో రాష్ట్రంలో సగటు విద్యుత్ కొనుగోలు ధర రూ.5.10. అదే మనకు 17 వేల మిలియన్ యూనిట్లు కేవలం రూ.2.49కే ఇవ్వడానికి కేంద్ర సంస్థ ముందుకు వచ్చింది.అంటే ఒక్కో యూనిట్ ధర ఇక్కడ రూ.2.60 తగ్గింది. దీని వల్ల ఏటా రూ.4400 కోట్లు. 25 ఏళ్లలో ఆ మొత్తం దాదాపు రూ.1.10 లక్షల కోట్లు. మరి అది సంపద సృష్టి కాదా?👉అలాంటి ఆఫర్ కాదంటే.. కేంద్రం నుంచి ఇలాంటి ఆఫర్ వస్తే.. అతి తక్కువ ధరకు విద్యుత్. ఐఎస్టీఎస్ మాఫీ. 25 ఏళ్లలో మీకు లక్ష కోట్లకు పైగా ఆదా. రైతులకు మంచి చేసేందుకు మీతో కలిసి వస్తామని అంటే..అలాంటి లెటర్ను పక్కన పెడితే, మీరంతా నన్ను ఏమనేవారు? ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఏమని విమర్శించేవారు. ఆలోచన చేయమని కోరుతున్నాను. రాష్ట్రానికి మంచి చేయాలని నేను అడుగులు ముందుకు వేస్తే, బురద చల్లుతున్నారు. వారు చేస్తోంది ధర్మమేనా? మనమంతా అడగాలి. చంద్రబాబుకు అన్నీ తెలుసు. అయినా ఆయనే ఆ నింద వేస్తున్నారు.రూ.2.49కే యూనిట్ పవర్. ఇది ఒక చరిత్ర. కేవలం మా ప్రభుత్వం వల్లనే సా«ధ్యమైంది. అది చరిత్రాత్మక ఒప్పందం. అలాంటి ఒప్పందాన్ని తప్పుబడుతున్నారు. ఆరోపణలు చేస్తున్నారు.👉చంద్రబాబు హయాంలో విద్యుత్ కొనుగోళ్లుచంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014ృ19 మధ్య 3494 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏలు చేసుకున్నారు. ఆ పీపీఏలు గమనిస్తే.. రూ.4.84 నుంచి రూ.4.83 వరకు ఉన్నాయి. 2014లో మాత్రం రూ.4.70కి వచ్చింది. సోలార్ కు సంబంధించి.. 2500 మెగావాట్లకు ఆయన పీపీఏ చేసుకున్నారు. 2014లో 650 మెగావాట్లు సగటున రూ 6.49కు కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. రూ.5.25 నుంచి 6.99 మధ్య ఒప్పందం చేసుకున్నారు.2015లో రూ.5.96 కు మరో 250 మెగావాట్లకు ఒప్పందం. 2016లో రూ.6.80, రూ.5.99, రూ.4.61, రూ.4.50 కి కొనుగోలు చేశారు. ఆయన సోలార్ ఎనర్జీని యావరేజ్ గా రూ.5.90కి కొనుగోలు చేశారు.👉అతి తక్కువ రేట్కు పీపీఏ చేయడం తప్పా?: చంద్రబాబు హయాంలో విండ్ పవర్ యావరేజ్ యూనిట్ ప్రైస్ రూ.4.63 అయితే.. సోలార్ యూనిట్ రూ.5.90. మరి నేను రూ.2.49కు అంటే చంద్రబాబు పెట్టిన దానిలో సగం రేటుకు కొనుగోలు చేస్తే.. చీపెస్ట్ రేట్ కి పవర్ సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే.. ఐఎస్ టీ ఎస్ చార్జెస్ మాఫీ చేస్తామని చెబితే.. నేను స్పందించకపోయి ఉంటే నన్ను మీరేమని ఏమనేవారు?.స్పందించిన నేను మంచి వాడినా.. అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు మంచి వాడా?👉ఎవరికి సంపద సృష్టి. ఎవరికి ఆవిరి?:చంద్రబాబు హయాంలో సంపద ఎలా ఎరోడ్ (ఆవిరైపోయిందో) అయిందో చెబుతాను.చంద్రబాబు సోలార్, విండ్ పీపీఏలను వైయస్సార్ సీపీ చేసుకున్న సోలార్ ఒప్పందంతో పోలిస్తే.. అవన్నీ 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వంపై మోపుతున్న భారం.. రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సిన భారం ఇది. ఇదే మాదిరిగా చూస్తే.. 3500 విండ్ పీపీఏలకు సంబంధించి ఆయన చేసుకున్న రూ.4.84లు మైనస్ మనం చేసుకున్న రూ.2.49. అంటే రూ.2.35 రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కట్టాల్సి వస్తుంది. ఇంటూ 3500 మెగావాట్లు అంటే 9000 మిలియన్ యూనిట్లు..అంటే రూ.2.35 ఇంటూ 9000 మిలియన్ సంవత్సరానికి రూ.2వేల కోట్లు.. 25 ఏళ్లలో రూ.50 వేల కోట్లు కేవలం చంద్రబాబు చేసుకున్న విండ్ యూనిట్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం.సోలార్ ఎనర్జీ ఒప్పందాలు చూస్తే.. చంద్రబాబు 2400 మెగావాట్లు ఆయన చేసుకున్న ఒప్పందం.. యావరేజ్ ప్రైస్ రూ.5.90.అదే మేము ఒప్పందం చేసుకున్నది రూ.2.49. అంటే రూ.3.41 ఆయన చేసుకున్న పీపీఏల వల్ల రాష్ట ప్రభుత్వం అదనంగా కట్టాలి కదా? 2400 మెగావాట్లు అంటే.. 4200 మిలియన్ యూనిట్లు ఇంటూ రూ.3.41. ఏడాదికి 1500 కోట్లు సంవత్సరానికి భారం పడుతుంది. 1500 కోట్లు ఇంటూ 25 ఏళ్లు అంటే.. 37500 కోట్లు.. జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్ల సంపద సృష్టి జరుగుతుంటే.. చంద్రబాబు చేసుకున్న సోలార్, విండ్ ఒప్పందాల వల్ల.. 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల సంపద ఆవిరవుతుంది. తేడా గమనించండి.👉సెకి లేఖ. పరిణామాలు. ఒప్పందం:సెకి నుంచి 2021, సెప్టెంబరు 15న లేఖ రాగా, ఇటువంటి మంచి ఆఫర్ రావడంతో, ఆ మర్నాడే క్యాబినెట్ మీటింగ్ ఉండగా, దాన్ని టేబుల్ ఐటెం కింద పెట్టాం. అంటే సెప్టెంబరు 16న క్యాబినెట్లో చర్చించాం. ృ ఎనర్జీ శాఖ అన్నీ అధ్యయనం చేసి వచ్చే క్యాబినెట్ నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దాదాపు 40 రోజుల పాటు అన్నీ అధ్యయనం చేసిన ఇంధనశాఖ కమిటీ, 2021, అక్టోబరు 25న నివేదిక సమర్పించారు.ఆ తర్వాత అక్టోబరు 28న క్యాబినెట్ జరగ్గా, ఆ నివేదికను క్యాబినెట్ ముందు ఉంచడం జరిగింది. అన్నీ చర్చించిన తర్వాత క్యాబినెట్ ఏం చెప్పిందంటే, ఏపీఈఆర్సీ అనుమతి కూడా తీసుకోవాలని నిర్దేశించి, ఆమోదం తెలిపింది.ఆ తర్వాత నవంబరు 11న ఏపీఈఆర్సీ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ క్రమంలో డిసెంబరు 1, 2021న ప్రభుత్వం, సెకి మధ్య పవర్సేల్ అగ్రిమెంట్ జరిగింది.దాంట్లో ఎవరెవరు సైన్ చేశారంటే.. సెకి, రాష్ట్ర ప్రభుత్వం, నాలుగు డిస్కమ్లు సంతకాలు చేశారు. ఇక్కడ ఎక్కడా థర్డ్ పార్టీ లేదు.స్పష్టంగా చెప్పాలంటే.. అది సెకి, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్ల మధ్య జరిగిన ఒప్పందం. దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా ముందే ఇచ్చింది.👉ఆ ఒప్పందం కనుక చేసుకోకపోయి ఉంటే..:ఒక చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంటే.. రూ.2.49కే విద్యుత్ మన రాష్ట్రానికి దొరుకుతుంటే, ఇంకా స్పెషల్ ఇన్సెంటివ్గా ఐఎస్టీఎస్ మాఫీ. అదెంతో తెలుసా? ఒక్కో యూనిట్కు రూ.2. అంటే ఒక్కో మెగావాట్కు నెలకు దాదాపు రూ.4 లక్షలు. అంటే ఏడాదికి దాదాపు రూ.50 లక్షలు అన్నమాట. అంత తక్కువ ధరకు మనకు సోలార్ విద్యుత్ వచ్చింది. ఆత్మ నిర్బల్ భారత్ కింద, సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తూ, కేంద్రం మనకు ఆ ఇన్సెంటివ్ ఇచ్చింది.అంత మంచి ఆఫర్ను నేను పక్కనపడేసి ఉంటే, అదే మీరు ఏమనేవారు? 25 ఏళ్లలో దాదాపు రూ.1.10 లక్షల కోట్లు ఆదా. అంటే అది సంపద సృష్టి కాదా? నిజానికి అది ఒక రోల్మోడల్ కేసు.అప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధర:ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఇదే సెకి, అదే ఆత్మ నిర్బల్ భారత్ కింద.. తమిళనాడుకు కూడా విద్యుత్ సరఫరా చేసింది.చత్తీస్గడ్ రూ.2.61. ఒడిషా రూ.2.61. తమిళనాడు రూ.2.61అదే మన రాష్ట్రానికి 12 పైసలు తక్కువగా రూ.2.49కే తెస్తే, నన్ను సన్మానించాల్సింది పోయి, ఏం విమర్శలు చేస్తున్నారు.చంద్రబాబు సంపద ఆవిరి చేస్తే, నేను సృష్టించాను. మరి ధర్మం, న్యాయం ఎక్కడుంది?ఎల్లో మీడియా పిచ్చి రాతలు:ఇక ఎల్లో మీడియా రాతలు. వారికి తోడు తానా అంటే తందానా అంటూ, చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు, ఇతర పార్టీల్లో ఉన్న ఆయన మనుషులు, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ల పిచ్చి విమర్శలు. గుజరాత్లో రూ.1.99కే విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే, మనం రూ.2.49కి ఎందుకు కొన్నామని అంటున్నారు.అక్కడి పరిస్థితులు వేరు. ఇర్రేడియేషన్ స్థితి. ఎడారి ప్రాంతాల్లో ఉత్పత్తి వ్యయం తక్కువ.కానీ, చంద్రబాబు, ఎల్లో మీడియా అతి తెలివి ప్రదర్శిస్తూ.. గుజరాత్, రాజస్థాన్లో ఉత్పత్తి వ్యయం గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఆయా రాష్ట్రాల్లో ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఎంతో తెలుసా? యూనిట్కు రూ.1.98.మరి ఈనాడు గుజరాత్ గురించి రాశారు. అక్కడ యూనిట్ ఉత్పత్తి వ్యయం రూ.1.99 అంటున్నారు. మరి ఎక్కడ ఉత్పత్తి? ఎక్కడ వినియోగం? చూడాలి కదా?అంటే గుజరాత్లోనే ఉత్పత్తి చేసి, ఆ రాష్ట్రంలోనే సరఫరా చేస్తున్నారు. అంటే మొత్తం అంతా రాష్ట్రంలోనే. అందుకే వారికి ఆ రేట్లు వర్తిస్తున్నాయి.వారికి అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్ వల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం రూ.1.99.రాజస్థాన్లో చూస్తే, అదే స్థితి. ఉత్పత్తి, సరఫరా అంతా ఒకే రాష్ట్రంలో. అయినా ఈనాడులో అది రాయరు. కేవలం ఉత్పత్తి వ్యయం తక్కువ అని మాత్రమే చెబుతారు. అక్కడ కూడా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవు. మరి అలా రాయడం వక్రీకరణ కాదా?👉కోవిడ్ తర్వాత, తాజాగా గుజరాత్లో సెకి టెండర్లు చూస్తే.. 2024, మార్చి 15న టెండర్ల బిడ్లు చూస్తే, రూ.2.62 నుంచి రూ.2.67 వరకు ధర. అంటే గుజరాత్లోనే ఉత్పత్తి. ధర.రాజస్థాన్లో కూడా బిడ్లు చూస్తే.. దాదాపు అవే ధరలు. అంటే ప్రస్తుత రెన్యూవబుల్ ఎనర్జీ రేట్లు ఇలా ఉన్నాయి.👉ఆ లెక్కన రూ.1.50కే రావాలి కదా?:మనకు అక్కడి జనరేషన్ కాస్ట్ కంటే తక్కువకు రూ.2.49కే వచ్చాయని సంతోషపడాలి.ఈనాడులో ఏం రాశారు? ఏళ్లు గడుస్తున్న కొద్దీ కొత్త మోడళ్ల టీవీల ధరలు తగ్గుతాయి. అలాగే విద్యుత్ ఛార్జీలు కూడా టెక్నాలజీ పెరిగిన తర్వాత తగ్గాలి కదా? అంటున్నారు.ఆ ప్రకారం, ఈనాడు థియరీ ప్రకారం చూస్తే.. అదే గుజరాత్లో సోలార్ పవర్ ఇవాళ రూ.1.50కే రావాలి కదా? మరి రూ.2.67 వరకు ఎందుకు పోయింది? అంటే ఏ స్థాయిలో అబద్ధాలు చెబుతున్నారనే దానికి ఇవన్నీ ఉదాహరణలు.👉మీడియా ప్రశ్నలకు సమాధానంగా..చంద్రబాబు ఆ ఒప్పందాలు రద్దు చేసుకుంటే..ఎవరూ అంత తెలివి తక్కువగా ఆ పని చేయరు. అంత తక్కువ ధరకు విద్యుత్ దొరకదు. పైగా 25 ఏళ్లలో లక్ష కోట్లకు పైగా ఆదా. 2009 నుంచి చూస్తే.. రూ.3.70 మొదలు చంద్రబాబు హయాంలో రూ.6.99 వరకు చేరింది.మా హయాంలో ఒకే అగ్రిమెంట్. యూనిట్ ధర రూ.2.49.అంత తక్కువ ధరకు ఎవరూ కొనుగోలు చేయలేరు. ఇది వాస్తవం.ఇంకా చెప్పాలంటే చరిత్రాత్మకం. డిస్కమ్లు కరెంటు కొంటున్నాయి. సెకి సరఫరా చేస్తోంది. మేము యూనిట్కు రూ.2.49 చొప్పున సెకికి చెల్లిస్తున్నాం. అది అప్పట్లో చాలా తక్కువ ధర. పైగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల మాఫీ. అంత మంచి ఆఫర్ ఎవరైనా వదులుకుంటారా? మీరే చెప్పండి. దాని వల్ల ఏటా రూ.4400 కోట్లు ఆదా. అంటే 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా. ఇది ముమ్మాటికీ సంపద సృష్టే.సెకితో ఏపీ ప్రభుత్వ ఒప్పందం.. చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఇంత మంచి చేసిన నన్ను అభినందించి సత్కరించాల్సింది పోయి.. రాళ్లు వేస్తునన్నారు. అయినా.. చంద్రబాబు, ఆయన సోషల్ మీడియా ఇంతలా వక్రీకరించి మాట్లాడడం ధర్మమేనా?. ఈనాడు, ఆంధ్రజ్యోతి.. ఇంతలా వకక్రీకరించాలా?. టీవీ రేట్లు తగగ్గినట్లు కరెంట్ రేట్లు తగ్గాలని ఈనాడు రాసింది. ఇక్కడే వక్రీకరణ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని జగన్ అన్నారు. -
సంపద సృష్టించడం అంటే ఇది: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఒక రాష్ట్రానికి ఉన్న ఆదాయం కాకుండా.. ఇంకా అదనపు ఆదాయం వచ్చేలా చేయడాన్ని సంపద సృష్టి అంటారు. రాష్ట్ర పురోగతిని.. భవిష్యత్తులో ఎక్కువ మార్గాలు వచ్చేలా ఉంటే.. అది సంపద సృష్టి’’ అని వైఎస్ జగన్ వివరించారు.‘‘ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే వైఎస్సార్సీపీ హయాంలోనే సంపద సృష్టి జరిగింది. మూడు కొత్త పోర్టులు.. అదీ నిర్మాణం వేగంగా సాగింది. దాదాపుగా పూర్తి కావొచ్చిన వాటి వల్ల అభివృద్ధి జరుగుతుంది. అదనపు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగాలు వస్తాయి. మెడికల్ కాలేజీల వస్తే ఖర్చులు తగ్గుతాయి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలతో.. సంపద సృష్టి జరుగుతుంది. ఈ పోర్టులు, మెడికల కాలేజీలు భవిష్యత్తు సంపద. ఇలాంటి అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేయాలి’’ అంటూ చంద్రబాబుకు సూచనలు చేశారు వైఎస్ జగన్.Also Read in English: YS Jagan: Lack of Promise Fulfillment, AP Riddled with Scams‘‘ప్రజలకు మంచి చేయాలనే మేం ప్రతి అడుగు ముందుకు వేశాం. ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకురాగలిగాం. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకం ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఇచ్చాం. బడ్జెట్లో కేలండర్ ఇచ్చి మరీ పథకాలను అమలు చేశాం. ఇదంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
రాష్ట్రంలో స్కామ్ల పాలన బాధాకరం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. హామీల అమలు లేకపోగా.. స్కాంల పాలన నడుస్తోందని అన్నారాయన. గురువారం సాయంత్రం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘నా పాదయాత్రలో కష్టాలను చూశా. అందుకు తగ్గట్లు.. గత ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రతీ ఇంటికి మంచి చేశాం. ఇప్పుడు ఆ అడుగులు వెనక్కి ఎలా వెళ్తున్నాయో చూస్తున్నాం...కూటమి పాలనలో తిరోగమనంలో ఇప్పుడు రాష్ట్రం ఉంది. రెడ్బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. బడ్జెట్తో భరోసా ఇవ్వలేకపోయారు. లిక్కర్, ఇసుక స్కాంలతో పాటు.. ఎక్కడ చూసినా పేకాట క్లబ్లు కనిపిస్తున్నాయి. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి..రాష్ట్రంలో గత ఐదేళ్లలో విప్లవాత్మక అడుగులు పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ అడుగులు వెనక్కు పడుతున్నాయి. సూపర్ సిక్స్లు కనిపించవు. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు కనిపించవు. రెడ్బుక్ పరిపాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడవడమే కనబడుతోంది.’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ప్రజలకు మంచి చేయాలనే మేం ప్రతి అడుగు ముందుకు వేశాం. ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకురాగలిగాం. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకం ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఇచ్చాం. బడ్జెట్లో కేలండర్ ఇచ్చి మరీ పథకాలను అమలు చేశాం. ఇదంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది.’’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.Also Read in English: YS Jagan: Lack of Promise Fulfillment, AP Riddled with Scams యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన:రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలా విప్లవాత్మక అడుగులు పడ్డాయి. ఇప్పుడు అవిఎలా వెనక్కు వెళ్తున్నాయో చెబుతాను. రాష్ట్రంలో ఈరోజు చాలా బాధాకరమైన పరిస్థితులు. ఒక బడ్జెట్ ప్రవేశపెట్టడం. దాని ద్వారా కాన్ఫిడెన్స్ ఇవ్వడం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు.. ఇవేవీ కనిపించడం లేదు. సూపర్సిక్స్, సూపర్సెవెన్ లేదు. యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన. రెడ్బుక్ పాలన కొనసాగుతోంది. ప్రతి చోటా దోపిడి. ఒక మాఫియా సామ్రాజ్యం. పైస్థాయి నుంచి కింది వరకు ఎక్కడిక్కడ కమిషన్లు. దోపిడి.కష్టాలు స్వయంగా చూసి..:గతంలో అసాధ్యం అనుకున్న మార్పులు మనం చేసి చూపగలిగాం. మేం తీసుకొచ్చిన ప్రతి మార్పు, నా సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాక, తీసుకున్న నిర్ణయాల ద్వారా జరిగింది. ప్రతి రంగంలో ఒక విప్లవం తీసుకొచ్చాం. ఊహించని మార్పులు తేగలిగాం. ప్రభుత్వ పథకాలు గ్రామాల్లోనూ డోర్ డెలివరీ చేశాం. ఆ విధంగా గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ. వాలంటీర్ల వ్యవస్థ. దాదాపు 540 రకాల సేవలు అందించాం. ప్రతి ఇంటికి మంచి చేశాం. ఎక్కడా, లంచాలు, వివక్ష లేదు. క్యాలెండర్ ఇచ్చి మరీ పథకాలు అమలు చేశాం. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు నేరుగా బదిలీ చేశాం. ప్రతి ఇంటికి మేలు చేశాం. ఈరోజు మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. పథకాల కోత మొదలైంది. ఏ పని కావాలన్నా టీడీపీ నాయకుల ఇళ్లు తిరగాల్సిందే.విద్యా రంగం:బడులు పూర్తిగా మార్చాం. ప్రైవేటుకు థీటుగా వాటిని అభివృద్ధి చేశాం. ఇంగ్లిష్ మీడియమ్తో మొదలు పెడితే, సీబీఎస్ఈ, ఐబీ వరకు తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ. డిజిటల్ క్లాస్రూమ్స్. ట్యాబ్లు, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, పూర్తి ఫీజు చెల్లింపు, అమ్మ ఒడి, మ్యాండేటరీ ఇంటర్న్షిప్ మొదలుపెడితే కరికులమ్లో మార్పులు. ఇలాంటి విప్లవాత్మక మార్పులన్నీ వైయస్సార్సీపీ ప్రభుత్వంలోనే వచ్చాయి.వైద్య రంగం:గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఇంటి వద్దనే వైద్యం. విలేజ్ క్లినిక్స్, నాడు–నేడుతో పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఆస్పత్రులు బాగు పడ్డాయి. 52 వేల పోస్టులు భర్తీ చేసి జీరో వేకెన్సీ తెచ్చాం. రాష్ట్రంలో స్పెషలిస్టుల కొరత కేవలం 4 శాతం. అది జాతీయ స్థాయలో 61 శాతం. 3300 చికిత్సలు ఆరోగ్యశ్రీలో. ఆరోగ్య ఆసరా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే. ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు మొదలైంది మా ప్రభుత్వ హయాంలోనే.వ్యవసాయ రంగం:చేయి పట్టుకుని రైతులను నడిపించాం. ఈ–క్రాప్ వ్యవస్థ, ఆర్బీకేలు, దళారుల ప్రమేయం లేకండా పంటల కొనుగోలు. అదే ఈరోజు అన్ని వ్యవస్థలు తిరోగమనమే. ప్రతి రోజూ రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెస్పీ కంటే దాదాపు రూ.400 కంటే తక్కువకు రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారు. దళారుల చేతిలోనే అన్నీ.ఫీజు రీయింబర్స్మెంట్:ప్రతి క్వార్టర్ అయిపోగానే, ఫీజులు చెల్లించేవాళ్లం. ఇప్పటికీ మూడు క్వార్టర్లు పూర్తి కాగా, జనవరికి నాలుగు క్వార్టర్లు. ఆ మేరకు పిల్లల ఫీజులు బకాయిలు. కాలేజీల్లో పిల్లలను వెనక్కు పంపుతున్నారు. బడులకు పోయే పిల్లలు పంట పొలాల్లో పని చేస్తున్నారు. రూ.2800 కోట్లు విద్యాదీవెన బకాయిలు. రూ.1100 వసతిదీవెన బకాయిలు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2200 కోట్లు దాటాయి. ఆరోగ్య ఆసరా ఊసే లేదు. 108, 104 సర్వీసులు మూలనబడ్డాయి. వాలంటీర్లను తొలగించారు. వారికి రూ.10 వేలు ఇస్తామని పచ్చిగా మోసం చేశారు. అన్ని వ్యవస్థలు దారుణంగా వెనక్కు పోయాయి. -
‘విడ్డూరంగా షర్మిల మాటలు.. ముమ్మాటికీ అది తప్పుడు ప్రచారమే’
వైఎస్సార్ జిల్లా, సాక్షి: అదానీ వ్యవహారంతో గత ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పత్రికల్లో వస్తున్న వార్తల్లో ఇసుమంత కూడా వాస్తవం లేదని అన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. గురువారం ఈ అంశాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపైనా మండిపడ్డారు.‘‘అదానీ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో జగన్ కు లంచాలు ముట్టాయంటూ షర్మిల మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అదానీ కంపెనీ విద్యుత్ ను కేంద్ర ప్రభుత్వానికి అమ్మితే.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి ద్వారా ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో అదానీ లంచం ఎందుకిస్తారు.? అదానీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు... షర్మిల పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తుంది. రాజకీయాలను అడ్డు పెట్టుకుని వ్యక్తిగత కక్షలు తీర్చు కోవాలనుకుంటున్నారు. అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు అని చార్జిషీట్ లో ఉంటే.. ఏకంగా జగన్కు 1,750 కోట్లు లంచం ఇచ్చారని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. జగన్ హయాంలో రాష్ట్రానికి తక్కువతో విద్యుత్ కొని ఆదా చేస్తే తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు, షర్మిలకు దమ్ముంటే నరేంద్ర మోదీని ప్రశ్నించాలి. .. గడచిన 6 నెలల్లో కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్న శివప్రసాద్రెడ్డి.. అబద్ధాలను అస్త్రాలుగా చేసుకుని పాలిస్తూ ఏపీ ప్రజలను గాలికి వదిలేశారన్నారు. ‘‘నాడు కేబినెట్ చర్చల అనంతరం 2.49 పైసలకే మన ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు చేసింది. కానీ, ఇప్పుడు రామోజీరావు కొడుకు, రాధాక్రిష్ణలు, షర్మిల, టీడీపీ నేతలు పక్కనే ఉండి చూసినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గతంలో ఇదే సెకి ద్వారా రూ 5.30 పైసలతో విద్యుత్ కొనుగోలు చేసింది’’ అని శివప్రసాద్రెడ్డి గుర్తు చేశారు.అమెరికా కేసులో జగన్ పేరుందని దుష్ప్రచారం చేస్తున్నారు.. అక్కడ వేసిన చార్జ్ షీట్ లో ఎక్కడా జగన్ పేరూ లేదు.. ఏపీ ప్రభుత్వం పేరూ లేదు అని స్పష్టం చేశారు.ప్రతిపక్షాన్ని పూర్తిగా మట్టుపెట్టాలని ప్రశ్నించే గొంతును నొక్కేందుకు వీళ్లు చట్టాలు తెస్తున్నారు. ప్రజల సమస్యలను మేం మాట్లాడుతున్నాం అని నల్ల చట్టాలను తీసుకొస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కూడా పీడీ యాక్ట్ పెడతారా? అని ప్రశ్నించారాయన... చెవిరెడ్డి చేసిన నేరం ఏంటి? ఓ ఆడపిల్ల కుటుంబాన్ని పరామర్శిస్తే కేసు పెడతారా?. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే వారికి అండగా నిలవవద్దని మీరు ఇలాంటి కేసులు పెడుతున్నారా?. మీరు మాత్రం ప్రతి రోజూ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడొచ్చు.. మేం పేదల పక్షాన నిలిస్తే కేసులు పెడతారా? అని శివప్రసాద్రెడ్డి నిలదీశారు. -
కూటమి పాలనలో అప్పు రోజుగా ‘మంగళవారం’: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇదే సమయంలో బీసీలుకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారని చెప్పారు. రాజ్యసభ పదవుల్లో బీసీలకు అవకాశం ఇచ్చారని తెలిపారు.మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విశాఖలో పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు వైఎస్సార్సీపీ నేతలు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ..‘వెనుక బడిన తరగతుల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారు. బీసీలకు సముచితమైన మార్గం చూపించారు. అలాగే, బీసీలకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవుల్లో అగ్రస్థానం కల్పించారు. రాజ్య సభ పదవుల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించారు.పేద వానికి సంక్షేమాన్ని కూటమి పాలన దూరం చేసింది. కూటమి పాలనలో మంగళవారం అప్పు రోజుగా మారింది. ఆరు నెలల పాలనలో 60 వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. రాష్ట్రంలో 2.5 లక్షల వాలంటీర్లను తొలగించారు. చంద్రబాబు తొలి సంతకం పెట్టిన డీఎస్సీకి అతీగతీ లేదు. ఒక్క హామీని కూడా ఆరు నెలల కాలంలో నిలబెట్టుకోలేదు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాల ఉసే లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఒట్టేసి ఒకమాట.. ఒట్టేయకుండా ఇంకో మాట!
2019 - 2024 మధ్యకాలంలో అంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్లో అసలు ఉద్యోగాలే లేవని, పరిశ్రమలూ స్థాపించలేదని, ఉపాధి కోసం వలస వెళ్లిన వారూ ఎక్కువంటూ నిన్నమొన్నటివరకూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు చేసిన విమర్శలు ఇవే కదా? కానీ ఇవే పార్టీలకూటమితో ఈ ఏడాది ఏర్పడ్డ ప్రభుత్వం ఏపీ శాసన సభకు ఇచ్చిన సమాధానం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఎందుకిలా?రాష్ట్రంలో కేవలం నాలుగు లక్షల మంది నిరుద్యోగులు మాత్రమే ఉన్నారని, నిరుద్యోగ భృతి ఇచ్చే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని కూడా కూటమి ప్రభుత్వం ఈ మధ్యే లిఖితపూర్వకంగా అసెంబ్లీకి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నట్లు ఓ వార్తా కథనం వచ్చింది! అంటే.. గత ఐదేళ్లలో నిరుద్యోగం గణనీయంగా తగ్గిందనేగా అర్థం. అంటే.. కూటమి పార్టీలు ఇంతకాలం చేసిన ప్రచారం అసత్యమనేగా? ఇదే విషయాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు అంగీకరిస్తారా? అసలు అంగీకరించరు. వెంటనే మాట మార్చేస్తారు.ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీలు అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీని నిరుద్యోగం విషయంలో నిత్యం విమర్శించేవన్నది కొత్త విషయం కాదు. పైగా తాము అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులకు రూ.మూడు వేల భృతి ఇస్తామని కూడా కూటమి నేతలు తమ సూపర్ సిక్స్ ఎన్నికల వాగ్ధానంలో భాగంగా చెప్పారు కూడా. అప్పుడలా అన్నారు... ఇప్పుడెందుకు ఇలా నిరుద్యోగులు నాలుగు లక్షల మందే ఉన్నారు.. భృతి గట్రా ఏమీ లేదంటున్నారు? అని అడిగామనుకోండి.. వెంటనే మీపై ఏదో ఒక కేసు పడే అవకాశం ఉంది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం పరిస్థితి ఏమిటా? అని విచారిస్తే.. కొత్త ఉద్యోగాల మాటెలా ఉన్నా.. ఉన్నవి మాత్రం లక్షల్లో ఊడుతున్నాయి అని తెలుస్తోంది. అయినాసరే.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దబాయించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల మందే నిరుద్యోగులున్నారని ప్రభుత్వం ఏ ఆధారంతో సమాధానమిచ్చిందో కానీ అది ఒకరకంగా జగన్ ప్రభుత్వానికి కితాబు ఇచ్చినట్లు అవుతుంది. జగన్ ప్రభుత్వం టైమ్ లో పరిశ్రమలే లేవని, డీఎస్సీ వేయలేదని, ఉద్యోగాలే రాలేదని, వలసలు అధికమని అప్పుడు చెప్పారు. మరి వీటిలో ఏది నమ్మాలి? అన్న సందేహం వచ్చినా తీరదు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే జగన్ ప్రభుత్వం బాగా పనిచేసిందన్న భావన కలుగుతుంది.జగన్ టైమ్లో ప్రభుత్వ ఉద్యోగాలు అనేక రూపాలుగా వచ్చాయి. ఒక్క ఆరోగ్య శాఖలోనే సుమారు ఏభై వేల ఉద్యోగాలు కల్పించారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. ప్రైవేటు రంగంలో పలు పరిశ్రమలు తేవడం ద్వారా, చిన్న, కుటీర, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీల బకాయిలు చెల్లించడం ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించగలిగారు. చంద్రబాబు టైమ్లో 2014-2019 మధ్య ఆయా రంగాలలో ఎనిమిది లక్షల మంది ఉపాధి పొందితే, 2019-2024 మధ్య 32 లక్షల మందికి ఉపాధ కల్పించగలిగారని లెక్కలు చెబుతున్నాయి. ఒకేసారి గ్రామ, పట్టణ వార్డు సచివాలయాల ద్వారా సుమారు లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా జగన్ ఒక రికార్డు సృష్టించారు. వీరు కాకుండా వలంటీర్ల రూపంలో రెండున్నర లక్షల మందికి అవకాశం కల్పించారు. వారికి నెలకు రూ.ఐదు వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చారు. ప్రభుత్వమే మద్యం వ్యాపారం నిర్వహించడంతో ఆ షాపులలో 15 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. టీచర్ల ఉద్యోగాలకు డీఎస్సీ ప్రకటించినా, ఎన్నికల కోడ్ రావడంతో అది పూర్తి కాలేదు.ఇన్ని జరిగినా, రాష్ట్రంలో అసలు ఏమీ జరగనట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు ప్రచారం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా వారికి తోడుగా పచ్చి అబద్దాలను జనంపై రుద్దాయి. ఇప్పుడు మాత్రం ఏపీలో నాలుగు లక్షల మందే నిరుద్యోగులు ఉన్నారని లెక్కలు చెబుతున్నారట. ఇది కేవలం నిరుద్యోగ భృతి ఎగవేత కోసమే అన్న అనుమానం వస్తోంది. కూటమి ప్రకటనల ప్రకారం కనీసం ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఇప్పటికే ఉన్నారు. వారికి భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. కాని దానికి ప్రస్తుతానికి మంగళం పలికారు. ఇది నిరుద్యోగులను మోసం చేసినట్లే కదా అన్నది వైఎస్సార్సీపీ విమర్శ.కూటమి ప్రభుత్వం రాగానే, ఉన్న వలంటీర్ల ఉద్యోగాలు ఊడాయి. జూన్ నుంచి వారికి గౌరవ వేతనాలూ ఇవ్వలేదు. అదేమిటి అని అడిగితే అసలు వలంటీర్లు ఎక్కడ ఉన్నారని మంత్రులు నిస్సిగ్గుగా ప్రశ్నిస్తున్నారు. గత ఉగాది నాడు చంద్రబాబు స్వయంగా వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, పైగా వారికి నెలకు రూ.పది వేల చొప్పున ఇస్తామని పూజలు చేసి మరీ చెప్పారు. అది నిజం కాదా! ఆ విషయాన్ని చంద్రబాబు ఇప్పుడు ప్రస్తావిస్తే ఒట్టు. పవన్ కళ్యాణ్ కూడా తాము వలంటీర్ల కడుపు కొట్టబోమని, ప్రచారం చేశారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు పాలకొల్లులో ప్రతి ఇంటికి వెళ్లి వలంటీర్కూ పారితోషికం పెంపు ఖాయమని, వైఎస్సార్సీపీని నమ్మవద్దని, అధికారం రాగానే తాము పెంచి తీరతామని, అప్పుడు తనకు స్వీట్ బాక్స్ లు తెచ్చి ఇవ్వాలని వలంటీర్లను కోరారు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. వీరందరికి మంచి, మంచి పదవులు వచ్చాయి. నిమ్మల కూడా మంత్రి అయ్యారు. స్వీట్ బాక్స్ లు కూడా కొదవలేకుండానే వచ్చాయి. ఇక వలంటీర్ల స్వీట్ బాక్స్ లతో వీరికి పనేముంది. వలంటీర్లకు ఉన్న ఉద్యోగాలను ఊడపీకేశారు. వారి జీవితాలు చేదుగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా చోట్ల వలంటీర్లు నిరసనలు చెబుతున్నారు. ప్రభుత్వ మద్యం షాపులు ఎత్తేయడంతో 15 వేల మంది రోడ్డున పడ్డారు.జనవరికల్లా టీచర్ల నియామకాలు చేస్తారని అనుకుంటే అది వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మరో వైపు పుండు మీద కారం చల్లినట్లు జగన్ ప్రభుత్వం బటన్ నొక్కిన డబ్బులతో జనం మందు, గంజాయికి అలవాటు పడ్డారని స్త్రీ, సంక్షేమ శాఖ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. మహిళలను కూడా అవమానించడానికి వీరు వెనుకాడలేదు. దీనిని బట్టి కూటమి నేతల వైఖరి ఏమిటో అర్థం అవుతుంది. జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల కన్నా...మూడు రెట్లు అధికంగా అమలు చేసి డబ్బులు పంచుతామని ఎన్నికల ముందు చెప్పిన టీడీపీ, జనసేన నేతలు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే వారి అసలు స్వరూపం ఇదన్నమాట అని ప్రజలు విస్తుపోతున్నారు.ఇక మంత్రి లోకేష్ గత జగన్ పాలనలో అసలు పరిశ్రమలే రానట్లు, పారిశ్రామిక వేత్తలు ఎవరితోనూ మాట్లాడనట్లు వ్యాఖ్యలు చేయడం బాగోలేదు. చిన్న వయసులో వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిజాలు చెప్పవలసిన లోకేష్ ,తండ్రి మాదిరి అబద్దాలు ఆడతారన్న విమర్శలకు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారో అర్థం కాదు. లోకేష్ ప్రకటనకు బదులుగా మాజీ మంత్రి గుడివాడ అమరనాధ్ తమ పాలన టైమ్ లో వచ్చిన పరిశ్రమలకు సంబంధించి పెద్ద జాబితానే చదివారు. అదానీ కంపెనీలు పెద్ద ఎత్తున వస్తుంటే, ఏపీని అదానీకి రాసిచ్చేశారని ఎల్లో మీడియా దుర్మార్గపు ప్రచారం చేసింది. ఇప్పుడు అదే అదానీ గ్రూపు పెద్దలు చంద్రబాబును కలిస్తే భారీ పెట్టుబడులు వస్తున్నాయని ఇదే మీడియా చెబుతోంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎన్ని మాటలు చెప్పారు? ఇప్పుడు ఏమి చెబుతున్నారు?పైగా లోకేష్ దీని గురించి మాట్లాడకుండా రూ.1.5 లక్షల కోట్లతో అనకాపల్లి వద్ద కొత్త స్టీల్ ప్లాంట్ రాబోతోందంటున్నారు. నిజంగా వస్తే మంచిదే. కాని దానిని నమ్మేదెలా!ఇది జనాన్ని మాయ చేయడానికే అన్న భావన ఏర్పడింది. విశాఖ స్టీల్ లో అనేక మంది ఉద్యోగాలు ఏమవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆరు నెలల్లో ఇన్నిలక్షల మంది ఉపాధి కోల్పోవడం కూడా ఒక చరిత్రే అవుతుందేమో! చంద్రబాబు 1995-2004 మద్యలో సంస్కరణల పేరుతో ఏభైకి పైగా కార్పొరేషన్ లను మూసివేశారు. దాని వల్ల వేలాది మంది నిరుద్యోగులు అయ్యారు. ఇప్పుడు అదే తీరులో ఉన్న ఉద్యోగాలు పీకేయడానికి వెనుకాడడం లేదు. ఎన్నికల ముందు కనుక తమ విధానం ఇది అని, వలంటీర్లను తీసివేస్తామని, మద్యం షాపులు ఎత్తివేసి ఆ ఉద్యోగాలను పీకేస్తామని చెప్పి ఉంటే తప్పు లేదు. అలా కాకుండా అడగని వరాలు సైతం ఇస్తామని హోరెత్తించి, ఇప్పుడు విరుద్దంగా వ్యవహరిస్తున్న తీరు కూటమి ప్రభుత్వానికి మంచిదేనా? ఉగాది పండగ నాడు పవిత్రంగా పూజలు చేసి ఇచ్చిన వాగ్దానానికే దిక్కు లేకపోతే ప్రజలు ఏమని అనుకోవాలి? సనాతన ధర్మం అంటూ ప్రచారం చేసిన వీరికి అసలు నిజంగా మతంపై విశ్వాసం ఉన్నట్లా? లేనట్లా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మరికాసేపట్లో వైఎస్ జగన్ కీలక ప్రెస్మీట్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరికాసేపట్లో పాత్రికేయ సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడనున్నారు. అమెరికా-అదానీ వ్యవహారంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఇటు కూటమి ప్రభుత్వం, అటు వాళ్ల అనుకూల మీడియా అసత్య ప్రచారాలకు దిగాయి. అదే సమయంలో ఏపీలో వైఎస్సార్సీపీ శ్రేణులపై సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయి.ఇక నుంచి మీడియా ద్వారానే చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తానని ప్రకటించిన వైఎస్ జగన్.. గత సమావేశాల్లో బడ్జెట్తో పాటు పలు అంశాలను ప్రధానంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బొంకిందే బొంకుతున్న చంద్రబాబును ‘బొంకుల బాబు’గా అభివర్ణించారాయన. -
అధికారం శాశ్వతం కాదు.. కూటమికి వైఎస్సార్సీపీ నేతల హెచ్చరిక
తూర్పుగోదావరి: ఏపీలో కూటమి ప్రభుత్వం హింసాత్మక విధానాలను మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు వైఎస్సార్సీపీ నేతలు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు బెయిల్ మంజూరైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శ్రీకాంత్ విడుదలయ్యారు. ఈ క్రమంలో శ్రీకాంత్ కోసం వైఎస్సార్సీపీ నేతలు జైలు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు. ఇప్పటి కంటే వడ్డీతో సహా కూటమి నేతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు. పార్టీని అణిచివేయాలనే ఉద్దేశంతో నాయకులు, కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అడిగినందుకే కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్ పేరుతో ఎన్నికల ముందు బెదిరించి గెలిచిన తర్వాత వాటిని అమలు చేయటం దారుణం. ఒకవైపు హింసాత్మక చర్యలు ఉండవంటూనే మరోవైపు హింసాత్మక చర్యలు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం హింసాత్మక విధానాలను మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు.రామచంద్రపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ..‘మాజీ మంత్రి పైన అతని కుమారుడి పైన కేసులు పెడతామని మంత్రి సుభాష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో మంత్రి బహిరంగంగా చెప్పాలి. ఎన్నికల అఫిడవిట్లో మంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అడగడం తప్పా?. ముందుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో ఆలోచించండి అంటూ హితవు పలికారు. -
నన్ను జైల్లో పెట్టినా పోరాటం కొనసాగిస్తా: చెవిరెడ్డి
సాక్షి, ప్రకాశం : తనని జైల్లో పెట్టినా పోరాటం కొనసాగిస్తానని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తనపై నమోదు చేసిన అక్రమ కేసులపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. కేసులకు భయపడి పారిపోను. 2014 నుండి 2019 వరకు 88 కేసులు పెట్టారు. ఏం చేశారు?. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయను.. నేను ఎక్కడికి పారిపోను. నన్ను జైల్లో పెట్టిన పోరాటం కొనసాగిస్తా. నాపైకి పెట్టిన కేసుకు ముందస్తు బెయిల్ కూడా అప్లై చేయను. బిడ్డ ఆపదలో ఉందని తన తండ్రి ఫోన్ చేశారు. వెంటనే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించా. బిడ్డ కుటుంబాన్ని కూటమి నేతలు పరామర్శించారా? అని ప్రశ్నించారు. నాపై కేసులు పెడితే.. కార్యకర్తలు భయభ్రాంతులకు గురవుతారు అని అనుకుంటున్నారు. కానీ అలాంటివేవి జరగవు’ అని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ వలసవాద మనస్తత్వానికి ఇదే ఉదాహరణ : ఎంపీ విజయసాయిరెడ్డి
ఢిల్లీ: పార్లమెంట్లో కాంగ్రెస్ వ్యవహార శైలిపై రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి విదేశీ దర్యాప్తు సంస్థలపై ఉన్న నమ్మకం.. మన దర్యాప్తు సంస్థలపై లేకపోవడం దౌర్భాగ్యమని అన్నారాయన.ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్ అసత్య ప్రచారానికి దిగింది. లోక్సభ వాయిదా తీర్మానంతో ఆయన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తమ సొంత పార్టీ నేత, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్ వ్యవహారాన్ని పక్కన పెడుతోంది. దీనిని బట్టే ఆ పార్టీ అర్ధసత్యాలు ప్రచారం చేస్తోందని అర్థమవుతోంది.ఆ పార్టీకి భారత దర్యాప్తు సంస్థలపై లేని నమ్మకం విదేశీ దర్యాప్తు సంస్థలపై ఉండడం మన దౌర్భాగ్యం. విదేశీ దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్కు ఉన్న నమ్మకం.. వాళ్ల వలసవాద మనసత్వానికి ఉదాహారణ నిలుస్తోంది’ అని ట్వీట్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.The Congress’ adjournment motion in the Lok Sabha conveniently targets @ysjagan garu while conspicuously shielding their own CM in Chhattisgarh. This selective narrative exposes Congress’ penchant for telling only half the story. Their faith in foreign agencies over Indian…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 27, 2024 -
నా భర్తకు ప్రాణహాని ఉంది: ఇంటూరి రవికిరణ్ భార్య సుజన
సాక్షి, విశాఖపట్నం: తన భర్త ఇంటూరి రవికిరణ్పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తోందని ఆయన భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె విశాఖ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారో తెలియదు. కేసుల గురించి అడిగితే పోలీసులు సమాధానం చెప్పడం లేదన్నారు.‘‘ఇంటూరి రవి కిరణ్ ఆరోగ్యం బాగోలేదు. రవి కిరణ్ హార్ట్ పేషెంట్, రోజు 8 గంటలు రెస్ట్ తీసుకోవాలి. రోజూ ఐదు నుంచి ఆరు వందల కిలోమీటర్ల తిప్పుతున్నారు. ఆయనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?. పోలీసుల నుంచి రవి కిరణ్కు ప్రాణ హాని ఉంది. పీటీ వారెంట్ మీద రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు. పోలీసులు మొత్తం సోషల్ మీడియా కార్యకర్తల కోసం పని చేస్తున్నారు. రవి కిరణ్పై 20 కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది’’ అని సుజన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పోలీస్ స్టేషన్కి వెళ్లిన తన పైన కూడా దువ్వాడ, రాజమండ్రి సీఐలు దురుసుగా ప్రవర్తించారు. రవికిరణ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని డాక్టర్లు చెప్పిన కూడా పోలీసులు వినిపించుకోలేదు. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా రవికిరణ పై కేసులు పెట్టిస్తోంది. టీడీపీ నాయకులతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పిస్తున్నారు’’ అని సుజన తెలిపారు.ఇదీ చదవండి: పరామర్శకు వెళితే.. చెవిరెడ్డిపై పోక్సో కేసు -
హెచ్పీసీఎల్లో ఎమ్మెల్యే గణబాబు అనుచరుల దౌర్జన్యం
సాక్షి, విశాఖపట్నం: హెచ్పీసీఎల్లో ఎమ్మెల్యే గణబాబు అనుచరులు దౌర్జన్యానికి దిగారు. తమ వారినే పనిలో పెట్టుకోవాలని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. లేబర్ గేటు వద్ద బైఠాయించిన టీడీపీ నేతలు.. తమకు అనుకూలంగా వ్యవహారిస్తేనే పనులు సాగనిస్తామని.. లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే హెచ్పీసీఎల్ పరిశ్రమలో పనులను టీడీపీ నేతలు అడ్డుకున్నారు.పనులు బహిష్కరించాలని కార్మికులపై టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. టీడీపీ నేతల ఆరాచకాలతో హెచ్పీసీఎల్ యాజమాన్యం విసిగిపోతోంది. తెర వెనక ఉండి ఎమ్మెల్యే గణబాబు కథ నడిపిస్తున్నారు. -
మరో వెన్నుపోటు
సాక్షి, విజయవాడ: వెనుకబడిన వర్గాలకు టీడీపీ మరో వెన్నుపోటు పొడిచింది. ముగ్గురు బీసీ రాజ్యసభ సభ్యులు చేత చంద్రబాబు రాజీనామా చేయించారు. రాజ్యసభ అభ్యర్థులకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, డిసెంబర్ 20న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య రాజీనామా చేయించగా.. మోపిదేవి, ఆర్. కృష్ణయ్యలకు ఆ స్థానాలు ఇవ్వకూడదని టీడీపీ నిర్ణయించింది.డీల్ కుదుర్చుకున్న బీద మస్తాన్రావుకి మాత్రమే టీడీపీ రెన్యూవల్ చేయనుంది. మోపిదేవి, ఆర్ కృష్ణయ్య స్థానాలు బాగా డబ్బున్న వారికే ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. టీడీపీ రాజ్యసభ రేస్లో సానా సతీష్, గల్లా జయదేవ్, కిలారు రాజేష్, కంభంపాటి రామ్మోహన్, లింగమనేని రమేష్లు పోటీ పడుతుండగా, మూడు స్థానాల్లో ఒక రాజ్యసభ కోసం బీజేపీ పట్టుబడుతోంది.ఇదీ చదవండి: టీడీపీలో పదవుల నైరాశ్యం -
టీడీపీలో పదవుల నైరాశ్యం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పదవుల పంపిణీ చేస్తున్న తీరుపై తెలుగుదేశం పార్టీలో అసహనం వ్యక్తమవుతోంది. ఎన్నో లెక్కలు వేసి, సమీకరణలు చూసి పార్టీ నేతలకు పదవులు ఇస్తున్నట్లు పైకి చెబుతున్నా నేతలు మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. నామినేటెడ్ పదవులు, టీటీడీ బోర్డు సభ్యులు, విప్ల నియామకంపై సీనియర్లు పెదవి విరుస్తున్నారు. సీనియారిటీ, పార్టీలో చేసిన పని గురించి పట్టించుకోకుండా తమకు నచ్చిన వారికే పదవులు ఇస్తున్నారనే అభిప్రాయం అన్ని స్థాయిల్లోనూ వినిపిస్తోంది. రెండు విడతలుగా నియమించిన సుమారు 80 కార్పొరేషన్ చైర్మన్ల పదవుల పంపకంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారికన్నా లాబీయింగ్ చేసే వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు నేతలు వాపోతున్నారు. లాబీయిస్టులకే పదవులు..పార్టీ ఆఫీసులో తిష్టవేసి లాబీయింగ్ చేసేవాళ్లు, క్షేత్రస్థాయిలో అసలు ఎప్పుడూ తిరగని వారికే మంచి పదవులు వచ్చాయనే ఆందోళన ఎక్కువమంది నేతల్లో వ్యక్తమవుతోంది. కొమ్మారెడ్డి పట్టాభిరాం, ఆనం వెంకటరమణారెడ్డి, నీలాయపాలెం విజయ్కుమార్, గోనుగుంట్ల కోటేశ్వరరావు తదితరులకు ఈ కోవలోనే పదవులు దక్కినట్లు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యుల పదవుల్లోనూ సీనియర్లను పక్కన పెట్టారనే ఆందోళన నెలకొంది. నంద్యాలకు చెందిన రౌడీషీటర్ మల్లెల రాజశేఖర్ను బోర్డు సభ్యునిగా నియమించడంపై స్థానికంగా దుమారం చెలరేగింది. అతనికి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాల నేతలు ఏకంగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయినా ఆయన పదవి పదిలంగానే ఉండడం విశేషం.సీనియర్లకు ఝలక్.. జూనియర్లకు విప్ పదవులు..మరోవైపు.. ఇటీవల నియమించిన శాసనసభ, శాసన మండలి చీఫ్విప్లు, విప్ల నియామకంపైనా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. శాసనసభ చీఫ్విప్గా తనకు అవకాశం దక్కుతుందని సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ఆశలు పెట్టుకున్నారు. మంత్రి పదవి ఎలాగూ ఇవ్వలేదు కనీసం ఈ పదవైనా ఇస్తారని ఆయన వర్గం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ, ఆయన్ను కాదని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులికి ఆ పదవి కట్టబెట్టడంతో నరేంద్ర రగిలిపోతున్నారు. భారీ సంఖ్యలో టీడీపీ తరఫున 11 మందికి విప్ పదవులు ఇచ్చినా చాలావరకూ జూనియర్లకే అవకాశం ఇవ్వడంతో సీనియర్లు నోరు విప్పలేక మిన్నకుండిపోయారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన యనమల దివ్య, రెడ్డప్పగారి మాధవి, యార్లగడ్డ వెంకట్రావు, వి. థామస్ తదితరులకు విప్లు ఇచ్చి తమను అవమానించారంటూ ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, పరిటాల సునీత, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జ్యోతుల నెహ్రూ, చింతమనేని ప్రభాకర్ వంటి నేతలు ఆవేదనలో మునిగిపోయారు.సీట్లు వదులుకున్న సీనియర్లలో అసంతృప్తిగత ఎన్నికల్లో సీట్లు వదులుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జితేంద్రగౌడ్, ప్రభాకర చౌదరి, కేఏ నాయుడు, బూరుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు తదితరులకు రెండు విడతలుగా ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో నిరాశే ఎదురైంది. ఉదా..» పవన్కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు వదులుకున్న వర్మకు తొలిదశలోనే మంచి పదవి వస్తుందని అందరూ భావించారు. చంద్రబాబు, లోకేశ్ కూడా ఆయనకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో పనిచేయించారు. కానీ, ఆయన్ను పట్టించుకునే వారే లేరని చెబుతున్నారు. » ఎన్డీఆర్ జిల్లా మైలవరం సీటు త్యాగంచేసిన మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితి కూడా దయనీయంగా మారింది. పార్టీలో అత్యంత సీనియర్గా ఉండి ఇప్పుడు ఆయన కనీస ప్రాధాన్యానికి నోచుకోలేకపోతున్నారు. జిల్లాలో ఆయన్ను వ్యతిరేకించి సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన కేపీ సారథి టీడీపీలో చేరి మంత్రి కాగా, పక్కలో బల్లెంలా మారి తన సీటును ఎగరేసుకుపోయి గెలిచిన వసంత కృష్ణప్రసాద్కి గౌరవం దక్కుతుండడంతో దేవినేని ఉమ అసంతృప్తితో రగిలిపోతున్నారు. రెండు విడతల నామినేటెడ్ పోస్టుల్లో ఆయన్ను చంద్రబాబు పట్టించుకోలేదు. » అనంతపురం అర్బన్ సీటును కొత్తగా వచ్చిన వారికి ఇవ్వడంతో ప్రభాకర్ చౌదరి, చివర్లో జంప్ జిలానీలా వచ్చిన నేత గుంతకల్ సీటు తన్నుకుపోవడంతో జితేంద్రగౌడ్ వంటి వారికి పదవుల పంపకంలో న్యాయం జరగలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. » ఇక అధికారంలో లేనప్పుడు ఎంత కష్టపడినా ఇప్పుడు గుర్తింపు దక్కడంలేదని, కనీసం తమను పట్టించుకోవడంలేదని బుద్ధా వెంకన్న వంటి నేతలు వాపోతున్నారు. -
తప్పుడు కేసులకు బెదరను: చెవిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ కక్ష సాధింపులకు దిగుతోందని.. ఒక బాధ్యతగా చేసిన పనిని తప్పుగా సృష్టిస్తారా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసులు పెట్టో, బెదిరించో పరిపాలన చేయాలంటే సాధ్యం కాదన్నారు.‘‘ఎన్ని కేసులు పెట్టినా భయపడను.. ప్రజల్లోనే ఉంటా. ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు.. ప్రజలు గమనిస్తూ ఉంటారు. నేను నూటికి నూరు శాతం ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటే వెళ్లా.. ఆ బిడ్డను పరామర్శిస్తే తప్పేంటి?’’ అంటూ చెవిరెడ్డి ప్రశ్నించారు.‘‘నామీద 11 సెక్షన్లతో కేసు పెట్టారు. ఫోక్సో కేసు కూడా నమోదు చేశారు. వైఎస్ జగన్ వెంట నడుస్తున్న వారికి భయాందోళన కల్పించాలని కుట్ర పన్నారు. బాలిక మీద దారుణం జరిగిందని ఆమె తండ్రే నాతో చెప్పారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నేను బాధ్యతతో ఆ బాధితురాలికి అండగా నిలిచా. ఆమెని తిరుపతి తరలించి మెరుగైన వైద్యం అందించేలా సహకరించా....72 కిలోమీటర్లు వెళ్లి బాధితురాలికి అండగా నిలవటం నేను చేసిన తప్పా?. బాధ్యతగా ఉండటం తప్పుగా సృష్టిస్తారా?. భయపెట్టో, కేసులు పెట్టో పాలన చేయాలంటే సాధ్యం అవుతుందా?. బాధితురాలి తండ్రి అన్యాయం జరిగిందని చెప్తేనే నేను వెళ్లాను. నేను ఎక్కడకూ వెళ్లను, పారిపోను. నా ఫోన్ స్విచ్చాప్ చేయను. నేను అందుబాటులోనే ఉన్నా. ఆ దుర్మార్గులకు శిక్ష పడాలని తండ్రి డిమాండ్ చేశారు. ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటేనే నేను వెళ్లాను..ఆ బిడ్డ గురించి నేను ఎక్కడా నోరు తెరిచి మాట్లాడలేదు. ఒక్కమాట కూడా ఎక్కడా మాట్లాడలేదు. తీవ్రవాదుల మీద పెట్టినట్టు నామీద కేసు పెట్టారు. ఆ తండ్రిని పోలీసులు రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్లారు. నాగార్జున రెడ్డి వ్యక్తి ఆ తండ్రిని తీసుకుని తిరుపతి వెళ్లాడు. కూతురి దగ్గరకు తండ్రిని చేర్చాడు. అతనిమీద కూడా ఆ తండ్రితోనే కేసు పెట్టించారు. పరామర్శకు వెళ్తే పోక్సో కేసులు పెట్టవచ్చని చూపిస్తున్నారు. ఏ శిక్ష వేసినా నేను సిద్ధమే’’ అని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్పష్టం చేశారు. -
వలంటీర్లపై బాబు, పవన్ మాటలు ఏమయ్యాయి?: నారాయణ స్వామి
సాక్షి, చిత్తూరు: ఏపీలో వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి.. ఇంకా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని కామెంట్స్ చేశారు. చంద్రబాబు సంపద సృష్టి ఏమైందని ప్రశ్నించారు.మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ..‘రాజ్యాంగం ఆమోదించిన రోజు అయినప్పటికీ ఈరోజున పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు. చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేస్తూనే ఉన్నాడు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేశాడు. నవరత్నాలు పేరుతో హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకువస్తే చంద్రబాబు వాటిని తుంగలోకి తొక్కాడు. ప్రతీ పేదవాడు ఉన్నత విద్యావంతుడు కావాలని, ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించిన వ్యక్తి వైఎస్ జగన్.స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కోటీశ్వరుల బిడ్డలు, డబ్బున్న వారికే ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండేది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ పేదవారికి ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకువచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తున్నారు. వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏమయ్యాయి?. కేంద్రప్రభుత్వ సంస్థ సెకీ అనే సోలార్ ఎనర్జీకి సంబంధించి యూనిట్ రూ.2.49లపై చెల్లించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపితే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ ఒప్పందాలు రూ.5.98 జరిగితే ఆరోజు ఎల్లో మీడియా ప్రశ్నించలేదు.చంద్రబాబు నాయుడు ఏం చెబితే అదే వింటున్నారు జిల్లాల ఎస్పీలు. తప్పుడు కేసులు పెట్టీ వైఎస్సార్సీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. మంత్రులు, టీడీపీ కార్యకర్తలకు బెల్ట్ షాపుల ద్వారా సంపద సృష్టిస్తున్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ను ఏమీ చేయలేరు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రఘురామ.. ఫ్లెక్సీ చింపి అంబేద్కర్ను అవమానిస్తారా?: తానేటి వనిత
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన నాటి నుంచి అంబేద్కర్కు అవమానమే జరుగుతోందన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. కూటమి నేతలు అంబేద్కర్కు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీ చింపేసి అవమానించారని మండిపడ్డారు.మాజీ హోంమంత్రి తానేటి వనిత తాజాగా aమీడియాతో మాట్లాడుతూ.. గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమలలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం బాధాకరం. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని తప్పకుండా శిక్షించాలి. కూటమి నేతలు అంబేద్కర్కు గౌరవం ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే రఘురామ అంబేద్కర్ ఫ్లెక్సీ చించేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు కోరితే న్యాయం జరగలేదు. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ నిర్మిస్తే.. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన పేరును తొలగించారు. అంబేద్కర్పై రాజకీయాలా?.అంబేద్కర్ విగ్రహం వద్ద లైట్లన్నీ ఆపేసి.. శిలాఫలకాలు పగలగొట్టారు. ఇప్పటి వరకూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్.. విగ్రహం వద్దకు వెళ్లి చూసింది లేదు. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై కనీసం చర్యలు తీసుకోలేదు. ఇలాంటి అవమానకర ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా రిపీట్ కాకూడదని కోరుతున్నాను. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కేసులు పెట్టాలి.. వారికి శిక్ష పడాలని కోరుతున్నాం.సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఎక్కడా లేని విధంగా కొత్త చట్టాలు తీసుకువచ్చి వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలి. అంతేకానీ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకే పోలీసులను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి నేతలకు అధికారం ఇచ్చింది.. ప్రజలకు మేలు చేయడానికి.. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కాదు. ఢిల్లీలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచినా వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. -
తెలుగు తమ్ముళ్ల మధ్య రచ్చకెక్కిన ‘అక్రమ మైనింగ్’ పంచాయతీ
సాక్షి, ఏలూరు జిల్లా: నూజివీడులో తెలుగు తమ్ముళ్ల అక్రమ మైనింగ్ పంచాయతీ రచ్చకెక్కింది. కూటమి అధికారంలోకి వచ్చాక తోటపల్లిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ సాగుతుండగా.. చర్యలు తీసుకోవాలంటూ ఏలూరు జిల్లా కలెక్టర్కు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు స్వయంగా ఫిర్యాదు చేశారు. దీంతో ముద్దరబోయిన తీరుపై నూజివీడు మండలం రావిచర్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు.ముద్దరబోయిన కలెక్టర్కు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు అన్నారు. రావిచర్లలో అక్రమ మైనింగ్ జరిగితే ఏ చర్యలైనా తీసుకోండని అధిష్టానాన్ని కోరుతున్నాం. సొంత పార్టీలోని నేతలపైనే బురద చల్లడం బాధాకరం. అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ముద్దరబోయిన చర్యలున్నాయి. తక్షణం ముద్దరబోయినను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి’’ అని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. -
ఆది Vs జేసీ.. ముదిరిన వివాదం.. ఎస్పీకి ప్రభాకర్రెడ్డి ఘాటు లేఖ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డిల మధ్య వివాదం ముదిరింది. ఈ క్రమంలో కడప ఎస్పీకి జేసీ ప్రభాకర్రెడ్డి ఘాటు లేఖ రాశారు. ‘‘ఆర్టీపీపీలో ఫ్లైయాష్ తీసుకెళ్లేందుకు మా వాహనాలను ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు భూపేష్రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. అయినా మేం సంయమనం పాటించాం..వాళ్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అందుకే వైఎస్సార్ జిల్లా నుంచి వచ్చే సిమెంట్, ఇసుక వాహనాలను మేమూ అడ్డుకున్నాం.’’ అంటూ లేఖలో పేర్కొన్నారు.‘‘మీరు కోరిన మీదట వాటిని నడవడానికి అనుమతించాం. మా వాహనాలను అడ్డుకోకూడదని మేం కోరాం.. అయినా పరిస్థితి మారలేదు. రేపు మేం ఆర్టీపీపీకి వాహనాలను పంపుతున్నాం.. వాళ్లు ఆపితే మేం అంత ఈజీగా తీసుకోం. ఇటీవల వారు అదానీ సంస్థపై కూడా ఎటాక్ చేశారు. మేం అలాంటి వాళ్లం కాదు. రేపు మా వాహనాలను అడ్డుకుంటే మాత్రం వారి వేధింపులను సహించేది లేదు. తప్పకుండా సరైన సమాధానం చెప్తాం’’ అంటూ జేసీ ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: కొత్త దుష్ట సంస్కృతికి తెరలేపిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి! -
రాజ్యాంగ దినోత్సవం.. ఏపీలో మానవ హక్కుల హననంపై ఆగ్రహం
గుంటూరు, సాక్షి: రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి నివాళులర్పించారు. రాజ్యాంగానికి విరుద్దంగా ఏపీలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక దాడులు, దౌర్జన్యాలపై గళమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి జరుగుతున్న రాజ్యాంగ హననంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో ఇవాళ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రాంతాల వారీగా ఆ వేడుకల్లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..విజయవాడరాజ్యాంగం ప్రతి పౌరుడు కి భద్రత, హక్కులు, స్వేచ్ఛ కల్పించిందికూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉందివైయస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధం చేస్తుందికూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతిలోకి తీసుకొని వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుందిసోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవటం దారుణంనల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందుందిఆంధ్ర రాష్ట్రంలో వినూత్నమైన పరిపాలన జరుగుతుందిప్రజల యొక్క హక్కులు హరించబడుతున్నాయిపెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందివైయస్ జగన్మోహన్ రెడ్డి పై దుష్ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందిరాజ్యాంగం అమలు చేయడంలో కుటుంబ ప్రభుత్వం విఫలమైందివిజయవాడ నడిబొడ్డున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారులు ఎందుకు నివాళులర్పించలేదు..?ప్రభుత్వం, అధికారులు వివక్షత చూపిస్తున్నారుసింగ్ నగర్లోని తన కార్యాలయంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డివిశాఖపట్నంరాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాలేదు.లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందిరాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారు..విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని వైయస్ జగన్ ఏర్పాటు చేశారు..రైల్వే భవనాల నిర్మాణానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 52 ఎకరాలను కేటాయించింది.కేకే లైన్ తో కూడిన రైల్వే జోన్ ఇవ్వాలి..వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదానీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు.కేంద్ర ప్రభుత్వ సంస్థ సేకితో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.ఆదానీ సంస్థతో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం.ప్రధాని మోడీ ప్రారంభిస్తారనే గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఒప్పందం వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జరిగింది.ప్లాంట్ కు సంబంధించిన భూ కేటాయింపులు మా ప్రభుత్వ హయాంలోనే జరిగాయి:::మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తూర్పుగోదావరిరాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు, దోపిడీ, అక్రమ ఇసుక రవాణా,మద్యం అక్రమ అమ్మకాలు ఎక్కువయ్యాయి.త్వరలోనే తగిన మూల్యం చెల్లించే రోజు వస్తుంది:::కొవ్వూరులో రాజ్యాంగం 75వ ఆమోద దినోత్సవ సందర్భంగా కొవ్వూరు బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన కొవ్వూరు వైఎస్సార్షీపీ కన్వీనర్ తలారి వెంకట్రావుకాకినాడరాష్ట్రంలో గత ఆరు నెలలుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా పాలన జరుగుతోంది.ప్రత్యార్ధులను అణివేసే దోరణీ చాల నిరంకుశంగా జరుగుతోందితునిలో 17 మందిపై అక్రమ కేసులు పెట్టారుసోషల్ మీడియాలో పోస్ట్ ను లైక్ చేసిన వారిపై నాన్ బెయిల్ కేసులు పెట్టారు.పసుపు చొక్కాలేసుకుని ఉద్యోగాలు చెయ్యోద్దని పోలీసులను కోరుతున్నానుగత 10 ఏళ్ళ కాలంలో వైఎస్ఆర్ సిపి ఒక పర్సంటేజ్ పోస్టులు పెడితే..టిడిపి,జనసేన 99 % అసభ్య పదజాలాలతో పోస్టులు పెట్టారు.తునిలో మామ అల్లుళ్ళ పాలన సాగుతోంది.అల్లుడు గల్లా పెట్టె దగ్గర కూర్చుంటే..మాయ యనమల అమాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. తునిలో ఘనంగా భారత రాజ్యంగ ఆమోద దినోత్సవం వేడుకల్లో.. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.ఏలూరు75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జెట్టి గురునాథం, ఇతరులు.కృష్ణాపెడన మండలం బల్లిపర్రు అంబేద్కర్ సెంటర్లో 75 వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలుఏలూరు75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా కొయ్యలగూడెం లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు,పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు.కృష్ణాకానూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో 75వ భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తిని చక్రవర్తి.ఎన్టీఆర్తిరువూరు పట్టణంలోని బోసు బొమ్మ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 75వ "భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నాయకులు,కార్యకర్తలు.విజయనగరంభారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన రాజాం వైఎస్సార్సీపి ఇంచార్జ్ డాక్టర్ తలే రాజేష్.పార్వతీపురం మన్యం మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలువైఎస్సార్కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషగుంటూరుప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు..భారత రాజ్యాంగం రూపకల్పనకు కమిటీ చైర్మన్ గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వ్యవహరించారు..ప్రపంచ దేశాలలోని అన్ని రాజ్యాంగంలో పరిశీలించి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది..చిన్నచిన్న అమెండ్మెంట్స్ మినహా నేటికీ చెక్కుచెదరని విధంగా భారత రాజ్యాంగం ఉంది..న్యాయ వ్యవస్థ అయినా, రాజకీయ వ్యవస్థ అయినా, మీడియా వ్యవస్థ అయినా భారత రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలి..కాని ఇవాళ రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులు తయారయ్యాయి..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక అరాచక, కక్ష సాధింపు పాలన సాగుతుంది..రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను పక్కనపెట్టి కక్ష సాధింపు చర్యలకే పరిమితమైంది..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కాలేదు.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందిఈ ఐదు సంవత్సరాలు మంత్రి నారా లోకేష్ తీసుకువచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరిగే విధంగా ఉంది..మంత్రి నారా లోకేష్ ఎవరిని జైల్లో పెట్టమంటే వారిని పోలీసులు బలవంతంగా అక్రమ కేసులతో అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు..ఒక్కో వ్యక్తిమీద 10, 20, 30 కేసుల వరకు పెడుతున్నారు..బ్రిటిష్ పాలనలో స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వారి మీద కూడా ఇన్ని కేసులు పెట్టి ఉండరు..రానున్న రోజుల్లో నారా లోకేష్ దోషిగా నిలబడాల్సి వస్తుంది:::ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం కర్నూలుభారతదేశం గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ఇవాళ కూటమి పాలనలో రాజ్యాంగం ఉల్లంఘనకు గురవుతుందిరాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదుచంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.నిరంకుశ పాలన రాష్ట్రంలో కొనసాగుతుంది.గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగింది.ఇంటి వద్దకే సంక్షేమ పాలనతో పాటు సంక్షేమ పథకాలు అందించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్య.. కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, మేయర్ బి వై రామయ్యప్రకాశంఈ రోజు సంక్షేమ పథకాలు లేవు, రాజ్యాంగానికి విరుద్ధంగా చంద్రబాబు పాలనఒంగోలు వైస్సార్సీపీ ఇంచార్జీ చుండూరి రవిబాబు, కార్యక్రమంలో పాల్గొన్న సిటీ పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, సీనియర్ నాయకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, కుప్పం ప్రసాద్ మరియు కార్యకర్తలు నంద్యాలఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందిప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో బ్యాలెట్ పేపర్లతోటే ఎన్నికలుజరుగుతున్నాయిమన దేశము మన రాష్ట్రం కూడా బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్ళకూడదూ, అందరూ ఆలోచించాలిఆత్మకూరు పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.సంబంధం లేని కేసులను రాజకీయ నాయకులు కంటగడుతూ పబ్బం గడుపుకుంటున్నారు.రాష్ట్రంలో అమలు అవుతున్న పోలీసులు కూడా రెండు బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారుప్రతి ఒక్క పేద కుటుంబానికి నిత్యవసరమైన సరుకులు కూరగాయలు , నూనె , కందిపప్పు ప్రతి ఒక్కటి రేట్లు విపరీతంగా పెంచేశారుమా ప్రభుత్వంలో నిత్యవసర సరుకులను రేట్లు పెంచామని అబద్ధపు పుకార్లు చేసుకుంటూ రోడ్లెక్కిన ఘనత టిడిపి నాయకులకు చెల్లుతుందిరైతులకు గిట్టుబాటు ధరలు లేకపోతే ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత మా పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుంది.మీడియా చేతిలో ఉంది కదా అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.మా పైన పెట్టిన పోస్టింగులు కూడా మేము పోలీసులకు అందజేస్తాం వాటిపై కూడా చర్యలు తీసుకోవాలి.కేవలం తెలుగుదేశం పార్టీ వారు మా పైన పెట్టిన కేసులు మాత్రమే విచారిస్తారా మా వైఎస్సార్సీపీ నాయకులు పెట్టిన కేసులను విచారించరాకాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అధికారులు కూడా గమనించుకోవాలి మేం అందజేసిన ఫిర్యాదులపై నిజ నిజాలు విచారించి చర్యలు తీసుకోవాలి.పోలీసులు ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన విధంగా ఉండకూడదు:::నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డినెల్లూరు జిల్లాగత ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పాటుపడిందని వెల్లడి..స్వరాజ్ మైదానంలో అప్పటి సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు..అంబేద్కర్ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలని ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి జగన్.రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీలో పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్..కాకాణి నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు. పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపల్నాడునరసరావుపేటలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. -
మంత్రి నారాయణ కనుసన్నల్లోనే దాడి: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: టీడీపీ నేతల చేతిలో గాయపడిన వైఎస్సార్సీపీ యువజన విభాగం నేత సాకేష్ని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. అనంతరం కాకాణి గోవర్థన్రెడ్డి మాట్లాడుతూ, మంత్రి నారాయణ కనుసన్నల్లోనే సాకేష్పై దాడి జరిగిందని.. న్యాయం జరగకపోతే పోరాటం చేస్తామన్నారు.తీవ్రంగా దాడి చేస్తే.. పోలీసులు చిన్న కేసు పెట్టి వదిలేశారేని.. కొడవలూరు సీఐ కేసును నీరు గార్చారని ఆయన మండిపడ్డారు. సీఐ సురేంద్ర బాబుపై ప్రైవేట్ కేసు వేస్తాం.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడి చేసిన వారిని వదిలిపెట్టం. వైఎస్సార్సీపీ శ్రేణులకు అండగా ఉంటాం.. మితిమీరి వ్యవహరిస్తున్న వారిపై భవిష్యత్తులో చర్యలు ఉంటాయి’’ అంటూ కాకాణి హెచ్చరించారు.ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ, నాలుగు రోజులు క్రితం సాకేష్ పై గండవరంలో టీడీపీ నేతలు దాడి చేశారని.. అక్రమ కేసులు పెడితే న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. మరణాయుధాలతో దాడి చేశారు.. సాకేష్కు పార్టీ తరపున అండగా ఉంటాం.. ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. -
‘నియంత పాలనకు..చంద్రబాబు సర్కారుకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయ్’
సాక్షి,తాడేపల్లి : సాక్షి,తాడేపల్లి : నియంతలు,నీరోల పాలనకు చంద్రబాబు పాలనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కును మన రాజ్యాంగం కల్పించిందిపాలకులు రాచరికపు పోకడలు పోవటానికి వీల్లేదుకానీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారా?ప్రజల ప్రాథమిక హక్కులన్నిటినీ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారుఅలాంటి చంద్రబాబుకు రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపకునే హక్కు లేదురెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే చంద్రబాబుకు పాలనకు అనర్హుడుచెప్పినట్టు కేసులు పెట్టించకపోతే మంత్రి పదవిలో నుండి దిగిపోవాలని మంత్రి అనితని పవన్ కళ్యాణ్ అన్నారుఇదేనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే తీరు?నియంతలు, నీరోల పాలనకు చంద్రబాబు సర్కారుకు దగ్గరి పోలికలు ఉన్నాయిదళిత నేత నందిగం సురేష్ ను అన్యాయంగా జైలుపాల్జేశారుదళిత నాయకత్వాన్ని చంపేసే కుట్ర చంద్రబాబు చేస్తున్నారువైఎస్ జగన్ దళితులకు అందించిన సంక్షేమాన్ని నిలిపేసిన చంద్రబాబుకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదుచిన్నారులపై అత్యాచారాలు చేసి చంపేస్తుంటే చంద్రబాబు దోషులను ఎందుకు అరెస్టు చేయనీయటం లేదు?జగన్పై నిత్యం విషం చిమ్మటానికే చంద్రబాబు పని చేస్తున్నారుచంద్రబాబు గెలుపులో ఏదో తేడా ఉందని అందరికీ అర్థం అవుతోందిఈవిఎంలలో తేడా వలనే గెలిచారని ప్రజలు అంటున్నారుభారీ సీట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వానికి సోషల్ మీడియా కార్యకర్తలను చూస్తే భయమెందుకు?ఇలాంటి నాయకులను రీకాల్ చేసే పరిస్థితులు రావాలిఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, ఇతర అనేక కార్యక్రమాలను ఆపేసిన చంద్రబాబుకు రాజ్యాంగాన్ని అమలు చేసే హక్కు లేదుఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబుకు రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు లేదుఅభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయిఇక్కడ ఈవీఎంలతో ఎందుకు జరుపుతున్నారు?రాజ్యాంగ పరిరక్షణకు అందరం నడుము బిగించాల్సిన సమయం వచ్చింది కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోము’ అని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు.