Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Irregularities of voting machines coming out one by one
ఈవీఎంల గుట్టు విప్పేదెవరు?

సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ మెషిన్ల (ఈవీఎంలు) పనితీరుపై ముసురుకుంటున్న అనుమానాలతో ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈవీఎంల హ్యాకింగ్‌ అసాధ్యమేమీ కాదని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పరిజ్ఞానం సాయంతో వాటిని సులభంగా హ్యాక్‌ చేయవచ్చని టెక్‌ దిగ్గజం, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ తాజాగా ట్వీట్‌ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈవీఎంలను మనుషులు కూడా హ్యాక్‌ చేసేందుకు ఆస్కారం ఉందని, అసలు వీటిని రద్దు చేయాలని చాట్‌ జీపీటీ నిపుణుడైన ఆయన గట్టిగా డిమాండ్‌ చేయడం గమనార్హం. మరోవైపు ముంబైలో గెలుపొందిన శివసేన (షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్‌ బంధువు ఒకరు మొబైల్‌ ద్వారా ఈవీఎంను హ్యాక్‌ చేసి ఆపరేట్‌ చేసినట్లు వెలుగులోకి రావడం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్‌ సరళిపై ఇప్పటికే పలువురు నిపుణులు, పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా తమ ఓట్లన్నీ ఏమయ్యాయంటూ గ్రామాలకు గ్రామాలే నిలదీస్తుండటం గమనార్హం. గెలుపొందిన అభ్యర్థులు సైతం ఊహించని స్థాయిలో మెజారిటీలు రావటంపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈవీఎంల పనితీరుపై సర్వత్రా సందేహాలు తలెత్తుతున్నా... తాము వేసిన ఓట్లు ఏమయ్యాయని ఓటర్లు ప్రశ్నిస్తున్నా.. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయని యావత్‌ దేశం నిలదీస్తున్నా... ఇవిగో ఈవీఎం మోసాలంటూ ఆధారాలు చూపిస్తున్నా... కేంద్ర ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ‘తాంబూలాలు ఇచ్చేశాం... ఇక తన్నుకు చావండి’ అనే రీతిలో ఎన్నికల ప్రక్రియ ముగిశాక తమకు సంబంధం లేదనే రీతిలో బాధ్యతల నుంచి ఈసీ పలాయనం చిత్తగించడం ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన అనంతరం అందులో లొసుగులు గుర్తించడంతో వాటిని నిషేధించిన దేశాల సంఖ్య పెరుగుతోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇప్పటికీ బ్యాలెట్‌ పేపర్‌ విధానాన్నే అనుసరిస్తున్న నేపథ్యంలో మన దేశంలో ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని సాధారణ ఓటర్లతోపాటు నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా పరీక్షిస్తే కానీ ఈ రహస్యం వీడదని టెక్‌ నిపుణులు వాŠయ్‌ఖ్యానిస్తున్నారు. చిప్‌లోనే చిదంబర రహస్యం..! ఈవీఎంలలో ఉపయోగిస్తున్న చిప్‌లపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిజ్ఞానంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సూటిగా సమాధానం చెప్పకపోవడం సందేహాలకు బలం చేకూరుస్తోంది. ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చని పలువురు సవాళ్లు విసురుతున్నా ఈసీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈసీ చేసిన ప్రకటన మరిన్ని సందేహాలకు తావిచ్చింది. ఈవీఎంలలలో బ్లూటూత్‌ టెక్నా­లజీ లాంటిది ఉండదు కాబట్టి హ్యాక్‌ చేయడం సాధ్యం కాదని ఈసీ ఇటీవల వరకు వాదిస్తూ వచ్చింది. అయితే ఈవీఎంలలో ప్రోగ్రామబుల్‌ చిప్‌లు ఉపయోగిస్తున్నామని, ఫ్లాష్‌ మెమరీ వాడకం కూడా ఉంటుందని ఈసీ ఇటీవల తొలిసారిగా అంగీకరించింది. ప్రోగ్రామబుల్‌ చిప్‌లు, ఫ్లాష్‌ మెమరీని హ్యాక్‌ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈవీఎంలు భద్రమేనా? అంటే ఈసీ సూటిగా సమాధానం చెప్పడం లేదు. భద్రతా సందేహాస్పదమే ఈవీఎంల భద్రత, నిర్వహణపైనా నీలి నీడలు అలుముకుంటున్నాయి. నిపుణులు వ్యక్తం చేస్తున్న సందేహాలకు ఈసీ సూటిగా సమాధానాలు చెప్పడం లేదు. ఈవీఎంల నిర్వహణ విషయంలో ఎన్నో భద్రత లోపాలు, ఇతర లొసుగులు ఉన్నట్లు ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. 2017 డిసెంబరు నాటికే ఈవీఎంల చోరీ, ధ్వంసం ఉదంతాలు దాదాపు 70 వరకూ చోటు చేసుకున్నట్లు ‘ద వైర్‌’ ప్రచురించిన కథనం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ మంత్రి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈవీఎంలను తయారు చేసే ఎల్రక్టానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రకటన ప్రకారం.. ఈసీఐ కోరిన దాని కంటే 1,97,368 ఈవీఎంలు, 3,55,747 కంట్రోల్‌ యూనిట్లు ఎక్కువగా తయారయ్యాయి. 2024 ఎన్నికల సందర్భంగా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఈవీఎంలు ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద లభించాయి. ఇక చోరీకి గురైన ఈవీఎంలపై ఈసీ స్పందన విడ్డూరంగా ఉంది. ప్రతి ఈవీఎంకు ప్రత్యేకమైన ఐడీ ఉంటుందని, యంత్రం చోరీకి గురైనా, కనిపించకుండా పోయినా ఆ ఐడీని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని పేర్కొంది. తద్వారా ఆ ఈవీఎంలలో నమోదైన ఓట్లు పోలైన ఓట్లలో కలవకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపింది. మరి చోరీకి గురైన యంత్రాల్లో పరికరాలను మార్చినా, ఓటింగ్‌ నమోదు చేసేందుకు వాడిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఇతర ఈవీఎంలతో కలిపేస్తే ఏమవుతుంది? అనే ప్రశ్నలకు ఈసీ మౌనం దాల్చడం గమనార్హం. ఈవీఎంలను భద్రపరుస్తున్న ప్రదేశాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయా? సీసీ కెమెరాలు ఉంటే వాటి ఫుటేజీని అందరికీ ఎందుకు అందుబాటులోకి ఉంచడం లేదు? అందులో ఇబ్బంది ఏమిటి? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు వరకు స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎంల భద్రత వ్యవస్థ ఎంతవరకు పటిష్టం? అనే సందేహాలున్నాయి. స్ట్రాంగ్‌ రూమ్‌ల సీసీ కెమెరాల ఫుటేజీలను అన్ని పార్టీలకూ అందుబాటులో ఉంచితే పారదర్శకంగా ఉంటుంది. ఈ డిమాండ్‌పై ఈసీ కనీసం స్పందించలేదు. ఒకవైపు ఈవీఎంలను హ్యాక్‌ చేయడం సాధ్యమేనని నిపుణులు బల్లగుద్ది చెబుతుండగా సందేహాలను నివృత్తి చేయాల్సిన ఈసీ దాగుడుమూతలు ఆడటం అనుమానాలను బలపరుస్తోంది. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి? దేశంలో ఏకంగా 20 లక్షల ఈవీఎంలు కనిపించకపోడం మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం 60 లక్షల ఈవీఎంలను దిగుమతి చేసుకోగా వాటిలో 40 లక్షల ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియకు కేటాయించినట్టు ఈసీ వెల్లడించింది. మరి మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయనే ప్రశ్నకు ఇటు ఈసీగానీ అటు కేంద్ర ప్రభుత్వంగానీ జవాబు చెప్పడం లేదు. ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ గట్టిగా డిమాండ్‌ చేశారు. దేశంలో ఎంపిక చేసిన రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఈవీఎంలను మార్చి అక్రమాలకు పాల్పడినట్లు కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా విభ్రాంతి వ్యక్తమవుతోంది. వైఎస్సార్‌ సీపీ, బిజూ జనతాదళ్‌ పార్టీలు తమకు అత్యంత బలమైన స్థానాల్లో కూడా ఓడిపోవడం విస్మయపరుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీకి ఏమాత్రం బలం లేని నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీల అభ్యర్థులకు అనూహ్య మెజార్టీలు వచ్చాయి. ఇక ఒడిశాలో బీజేపీ ఉనికి అంతంత మాత్రంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పడ్డ పాట్లన్నీ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో.. కర్ణాటకలో ఓ బీజేపీ ఎంపీ అభ్యర్థి వాహనంలో ఈవీఎంలు తరలిస్తున్న విషయం ఎన్నికల ముందే బయటపడింది. పిఠాపురం నియోజకవర్గంలో ఈవీఎంలను బస్సులో తరలించారు. ఓ ప్రైవేట్‌ వాహనంలో సైతం ఈవీఎంలు తరలించినట్లు బయటపడ్డా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇదే రీతిలో ఈవీఎంలను ప్రైవేట్‌ వ్యక్తుల పర్యవేక్షణలో తరలించినట్లు తెలుస్తోంది. అవన్నీ కనిపించకుండాపోయిన 20 లక్షల ఈవీఎంలలోనివేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అదృశ్యమైన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయో వెల్లడించాలని వామపక్షాలతోపాటు ఇతర పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 40 లక్షల ఈవీఎంతోనే ఎన్నికలు నిర్వహించామని, మిగిలిన 20 లక్షల ఈవీఎంల సంగతి తమకు తెలియదంటూ ఈసీ దాటవేత వైఖరి అనుసరిస్తోంది. ఈసీ, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఈ అంశాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈవీఎంలను నిషేధించాలి: ప్యూర్టోరికోలో ఎన్నికల అక్రమాలపై ఎక్స్‌లో ఎలాన్‌ మస్క్‌ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలను నిషేధించాలి. ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణ సరికాదు. వాటిని సులభంగా హ్యాక్‌ చేయవచ్చు. ఈ భూమ్మీద హ్యాక్‌ చేయలేనిది ఏదీ లేదు. ఈవీఎంలు బ్లాక్‌ బాక్స్‌లు: ఎక్స్‌లో రాహుల్‌గాందీఈవీఎంలు బ్లాక్‌ బాక్సులు లాంటివి. వాటిని పరిశీలించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వరు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం తీవ్ర ఆందోళనకరం. నిషేధిస్తూ విధాన నిర్ణయాలుప్రపంచంలో మెజార్టీ దేశాలు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా విధాన నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌తోపాటు బ్రెజిల్, వెనిజులా తదితర దేశాల్లో మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అత్యధిక దేశాల్లో ఈవీఎంలను పూర్తిగా నిషేధించగా మరికొన్ని దేశాల్లో ఇతర పద్ధతులను జోడించి ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మొబైల్‌తో ఈవీఎం హ్యాకింగ్‌ఈవీఎంలు ఎంత లోపభూయిష్టమో... వాటిని ఎంత సులువుగా హ్యాక్‌ చేయవచ్చో బహిర్గతమైంది. ముంబై నుంచి వెలువడే ప్రముఖ దినపత్రిక ‘మిడ్‌ డే’ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని వాయువ్య ముంబై నియోజకవర్గం నుంచి ఎంపీగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించిన శివసేన (ఏక్‌నాథ్‌ షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్‌ సమీప బంధువు మంగేశ్‌ పండిల్కర్‌ తన మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఈవీఎంను అన్‌లాక్‌ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 4న ముంబైలోని నెస్కో సెంటర్‌లో నిర్వహించారు. ఎంపీ బంధువు మంగేశ్‌ పండిల్కర్‌ ఈ సందర్భంగా తన మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఈవీఎంను అన్‌లాక్‌ చేశారు. ఓటీపీ జనరేట్‌ చేయడం ద్వారా ఈవీఎంను అన్‌లాక్‌ చేయడం గమనార్హం. మొదట్లో శివసేన(ఉద్ధవ్‌ ఠాక్రే) అభ్యర్థి అమోల్‌ సంజన కీర్తికర్‌ కంటే వెనుకబడిన రవీంద్ర వైకర్‌ అనూహ్యంగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్‌ కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్‌ తీసుకువెళ్లడం, అదే ఫోన్‌ ద్వారా శివసేన (ఏక్‌నాథ్‌ షిండే) అభ్యర్థి పలువురితో మంతనాలు జరపడంపై ముంబై పోలీసులు ఈ నెల 14న కేసు నమోదు చేసి నిందితులకు నోటీసులు జారీ చేశారు. మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపారు. అయితే మొబైల్‌ ద్వారా ఈవీఎంను హ్యాక్‌ చేశారన్న మిడ్‌ డే పత్రిక కథనాన్ని ఎన్నికల కమిషన్‌ ఖండించింది.

YS Jagan Bakrid Wishes To Muslims: Andhra Pradesh
ముస్లింలకు వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

సాక్షి, అమరావతి: ముస్లిం సోదర, సోద­రీ­­మ­ణు­లకు వైఎస్సా­ర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభా­కాంక్షలు తెలిపారు. త్యాగ­నిరతికి, ధర్మ­బద్ధ­తకు, దాతృత్వానికి బక్రీద్‌ ప్రతీకగా నిలుస్తుంద­న్నారు. దైవ ప్రవక్త ఇబ్ర­హీం త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నా­రు.పేద, ధనిక తారత­మ్యాలు లేకుండా, రాగద్వేషా­లకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండు­గను భక్తిశ్రద్ధలతో నిర్వ­హించుకుంటారని చెప్పారు. అల్లాహ్‌ ఆశీ­స్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలషించారు.

Elon Musk statement on elimination of EVMs turns political in India
Elon Musk: హ్యాక్‌ చేయొచ్చు..!

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం) పనితీరు, పారదర్శకతపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈవీఎంలలో నమోదైన ఫలితాలను సులభంగా తారుమారు చేయొచ్చని, ఎన్నికల్లో వీటిని ఉపయోగించకపోవడమే మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. స్పేస్‌ ఎక్స్, టెస్లా కంపెనీల యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సైతం ఈవీఎంలపై స్పందించారు. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్‌’లో తన అభిప్రాయం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వినియోగిస్తున్న ఈవీఎంల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యంత్రాలను హ్యాక్‌ చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. మస్క్‌ అభిప్రాయాన్ని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఖండించారు. భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీంఎలు పూర్తిగా సురక్షితమేనని తేల్చిచెప్పారు. దీనిపై మస్క్‌ ఘాటుగా స్పందించారు. ఏదైనా హ్యాక్‌ చేయొచ్చని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాందీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌లు కూడా ఆదివారం స్పందించారు. ఈవీఎంలు ఎవరూ తనిఖీ చేయలేని బ్లాక్‌బాక్సుల్లాంటివేనని రాహుల్‌ గాంధీ స్పష్టంచేశారు. ‘ఎక్స్‌’లో ఎలాన్‌ మస్క్‌ చేసిన పోస్టును తన ‘ఎక్స్‌’ ఖాతాల్లో రాహుల్‌ షేర్‌ చేశారు. ఈవీఎంల విశ్వసనీయతను అఖిలేష్‌ యాదవ్‌ ప్రశ్నించారు. రిస్క్‌ చిన్నదైనా పరిణామం పెద్దదే మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఈవీఎంలను హ్యాక్‌ చేసేందుకు ఆస్కారం ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను వాడొద్దు. ఎన్నికల నుంచి ఈ యంత్రాలను దూరంగా ఉంచాలి. ఈవీఎంలను హ్యాక్‌ చేసే రిస్క్‌ తక్కువగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికీ హ్యాకింగే అవుతుంది. రిస్క్‌ చిన్నదైనా అది పెద్ద పరిణామానికి దారితీస్తుంది.– ఎలాన్‌ మస్క్, స్పేస్‌ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎన్నికల ప్రక్రియపై అనుమానాలున్నాయి భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీఎంలు బ్లాక్‌బాక్సుల్లాంటివే. వాటిని తనిఖీ చేయడానికి ఎవరినీ అనుమతించరు. మన దేశంలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగానే మిగిలిపోతుంది – ‘ఎక్స్‌’లో రాహుల్‌ గాంధీ ఈవీఎంలు పూర్తి సురక్షితం పూర్తిగా సురక్షితమైన ఎల్రక్టానిక్‌ పరికరాలను, డిజిటల్‌ హార్డ్‌వేర్‌ను ఎవరూ తయారు చేయలేరన్న సాధారణ అభిప్రాయం ప్రజల్లో ఉంది. అలా అను కోవడం పొరపాటు. ఈవీఎంలపై ఎలాన్‌ మస్క్‌ వ్యక్తం చేసిన భయాందోళలు సమంజసం కాదు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను హ్యాక్‌ చేయడం అమెరికాతోపాటు ఇతర దేశాల్లో సాధ్యమవుతుందేమో గానీ ఇండియాలో ఎంతమాత్రం వీలుపడదు. ఇతర దేశాల్లో ఇంటర్నెట్‌తో అనుసంధానించిన ఓటింగ్‌ యంత్రాలను వాడుతుంటారు. ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. ఇంటర్నెట్‌తో కనెక్ట్‌ చేసినప్పుడు అవకతవకలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఇండియాలో ఈవీఎంలకు ఇంటర్నెట్‌తో గానీ, బ్లూటూత్‌తో గానీ, వై–ఫైతోగానీ ఎలాంటి అనుసంధానం ఉండదు. ఇవి పూర్తిగా సురక్షితమైనవి. ఫ్యాక్టరీలో పోగ్రామ్‌ చేసిన ఈవీఎం కంట్రోలర్లను బయట రీప్రోగ్రామింగ్‌ చేయడం సాధ్యం కాదు. ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలు, వాటి భద్రత గురించి ఎలాన్‌ మస్‌్కకు ట్యూషన్‌ చెప్పడానికి నేను సిద్ధమే – రాజీవ్‌ చంద్రశేఖర్, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి ‘‘ఏదైనా(ఏ ఎల్రక్టానిక్‌ పరికరమైనా) హ్యాక్‌ చేయొచ్చు’’ – రాజీవ్‌ చంద్రశేఖర్‌ వ్యాఖ్యలపై ఎలాన్‌ మస్క్‌ ప్రతిస్పందన ఈవీఎంలకు స్వస్తి పలకాలి టెక్నాలజీ అనేది సమస్యలను పరిష్కరించేలా ఉండాలి. అదే టెక్నాలజీ ఒక సమస్యగా మారినప్పుడు దాన్ని పక్కనపెట్టమే మంచిది. ఈవీఎంలను హ్యాక్‌ చేయొచ్చని నిపుణులు ఇప్పటికే నిరూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఓటింగ్‌ యంత్రాలను హ్యాక్‌ చేస్తున్నట్లు సందేహాలున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్‌పై ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ నిపుణులు సైతం బహిరంగంగా ప్రకటనలు చేశారు. అలాంటప్పుడు మన దేశంలో ఈవీఎంలను బలవంతంగా ఉపయోగించాల్సిన అవసరం ఏమిటి? దీనిపై అధికార బీజేపీ సమాధానం ఇవ్వాలి. ఈవీఎంలకు స్వస్తి పలకాలి. భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్లతోనే నిర్వహించాలి. – ‘ఎక్స్‌’లో అఖిలేష్‌ యాదవ్‌ దమ్ముంటే హ్యాక్‌ చేసి చూపించండి ఎలాన్‌ మస్క్‌ గానీ, ఇంకెవరైనా గానీ ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చని చెబుతున్న వ్యక్తులు భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలి. అక్కడ ఈవీఎంను తీసుకొని హ్యాక్‌ చేసి చూపించాలి. ఇదే మా చాలెంజ్‌. భారతదేశ ప్రజాస్వామ్యం గురించి రాహుల్‌ గాంధీ ఎందుకు ఎలాన్‌ మస్‌్కకు ఫిర్యాదు చేస్తున్నారు? మస్క్‌ ఏం చేయగలరు? ప్రపంచం ముందు కన్నీళ్లు పెట్టుకోవడం, భారతదేశ ప్రతిష్టను దిగజార్చడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలో ఒక భాగమా? వారసత్వ రాజకీయాలను ప్రజలు వరుసగా మూడోసారి తిరస్కరించారు. అయినా ఆ విషయం కాంగ్రెస్‌కు అర్థం కావడం లేదు? – అమిత్‌ మాలవీయ, బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి

Those in Rushikonda are government buildings: Andhra Pradesh
రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే

సాక్షి, అమరావతి: రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఆదివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపింది. ‘ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతం కూడా కాదు. విశాఖప­ట్నా­నికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభు­త్వం ఇష్టం.అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారు. ఇప్పటికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్‌ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు’ అని పేర్కొంది. చీటికి మాటికి దుష్ప్రచారం తగదు: ఎమ్మెల్సీ వరుదు కల్యాణిరుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేర్కొ­న్నారు. ఇలా ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లి చీటికిమా­టికి తమ పార్టీపై దుష్ప్రచారం చేయటం తగద­న్నారు. ఆమె ఆదివారం సాక్షితో మాట్లాడుతూ అవేమీ ప్రైవేటు ఆస్తులు కావని తమ ప్రభుత్వం అధికారంలో ఉండగానే స్పష్టం చేసిందని గుర్తుచే­శారు. ‘ప్రజలు విజ్ఞులు. అన్నీ గమనిస్తూ ఉంటారు. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే ప్రసక్తేలేదు. అధికారం ఇచ్చింది ప్రజలకు సేవచేయమని. కల్పితకథలు సృష్టించి వైఎస్సార్‌సీపీపై నిందలు వేయమని కాదు..’ అని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తే టీడీపీ వారికే నష్టం అని ఆమె పేర్కొన్నారు.

Farmers loan waiver in Telangana Phase by phase by Congress Govt
దశల వారీగానే మాఫీ!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుల రుణమాఫీని దశల వారీ­గా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో చేసినట్టుగానే విడతల వారీగా పంటల రుణమాఫీ చేపట్టాలని.. వచ్చే నెల 15వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిసింది. తొలుత రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను, తర్వాత రూ. 75 వేల వరకు, అనంతరం రూ.లక్ష.. ఇలా రూ. 2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీనాటికి రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. రైతుల్లో 70% మందికి రూ.లక్ష లోపే రుణాలు ఉన్నట్టు అంచనా. వీరికి తొలిదశలో మాఫీ చేసి.. తర్వాత మిగతా వారికి అమలు చేయాలనే ప్రతిపాదనపైనా చర్చ జరుగుతోంది. నిధుల సేకరణపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీకి భారీగా నిధులు అవసరం కావడంతో సేకరణ కోసం ప్రభుత్వం అన్నిరకాల మార్గాలను అన్వేషిస్తోందని అంటున్నాయి. నాలుగు పథకాలకు రూ.50 వేల కోట్లు! రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలల్లో రుణమాఫీ, రైతుభరోసా అమలు చేయాల్సి ఉంది. ఈ రెండింటికీ నిధులు సమీకరించడం సవాల్‌గా మారిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీ కోసం వడ్డీతో కలిపి సుమారు రూ.35 వేల కోట్లు అవసరమని అంచనా. రైతు భరోసా కింద ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఎకరాకు రూ.7,500 చొప్పున ఇచ్చేందుకు రూ.10,500 కోట్ల మేరకు కావాలి. రైతు బీమా పథకం ప్రీమియం చెల్లించేందుకు రూ.1,500 కోట్లు కావాలి. పంటల బీమా పథకం కింద ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం చెల్లించాలంటే దాదాపు రూ.2,500 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇలా ఈ నాలుగింటికి కలిపి రూ.50 వేల కోట్ల వరకు అవసరం. రైతుభరోసా కింద ఈ నెల నుంచే పెట్టుబడి సాయం ఇవ్వాలి. రైతు బీమా, పంటల బీమాకు కూడా ఇప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోగా చెల్లించాలి. అంటే ఈ రెండు నెలల్లోనే నిధులన్నీ సమకూర్చుకోవాలి. భారం తగ్గించుకోవడంపై దృష్టి! భారీగా నిధుల అవసరం ఉండటంతో.. ఈ నాలుగు పథకాల భారాన్ని ఎలా తగ్గించుకోవాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినట్టు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు తీరును పరిశీలించింది. వ్యవసాయ, ఆర్థికశాఖల అధికారులు మహారాష్ట్రకు వెళ్లి అక్కడ రుణమాఫీ అమలుతీరును అధ్యయనం చేసి వచ్చారు. రాజస్తాన్‌లో రుణమాఫీ అమలుతీరును కూడా అడిగి తెలుసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో అనుసరించిన విధి విధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నారు. అర్హులైన రైతులకు లబ్ధిచేకూరేలా విధివిధానాలు ఎలా ఉండాలనే కసరత్తు కొనసాగుతోంది. నిజానికి రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీయిచ్చింది. కానీ ఆయా పథకాలకు అర్హులను గుర్తించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) పథకం కింద దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు ఏటా రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ ఛైర్మన్లు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఆదాయ పన్ను చెల్లించేవారిని మినహాయించింది. ఇప్పుడు ‘‘రైతు భరోసాకు, రుణమాఫీ అమలుకు అటువంటి ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలా? అలా చేస్తే అసలైన రైతులకు మేలు జరుగుతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధి విధానాలుండాలి?’’ అన్నదిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. అంటే పథకాల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీఎం కిసాన్‌లో మినహాయింపు ఉన్న వర్గాలతోపాటు ఐదెకరాల పరిమితి పెట్టడం, సాగుచేసే రైతులకే భరోసా సాయం ఇవ్వడం వంటివి అమలు చేస్తే ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నట్టు చెప్తున్నారు. రుణమాఫీకి కూడా ఇలాంటి నిబంధనలు పెడితే ఎలా ఉంటుందనే కోణంలోనూ ఆలోచన సాగుతున్నట్టు సమాచారం. నిధుల సమీకరణ ఎలా? ఈ నాలుగు పథకాల కోసం ఒకేసారి రూ.50 వేల కోట్ల మేరకు నిధులు సమీకరించడం అంత సులువైన వ్యవహారం కాదని.. ఒకవేళ ఆంక్షలు విధించి, కోతలు పెట్టినా కూడా అంత పెద్ద మొత్తంలో సొమ్ము సేకరణ కష్టమేనని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం భారం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తూనే, నిధుల సమీకరణకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. కొత్తగా ‘రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌’ ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి.. ఒకేసారి రూ.35 వేల కోట్ల వరకు రుణం తీసుకునే అవకాశం ఉందా అన్న ఆలోచన జరుగుతోంది. అయితే ఏదైనా కార్పొరేషన్‌కు భారీగా రుణం ఇవ్వాలంటే.. దానిని అదే సంస్థ తిరిగి చెల్లించగలదంటూ ఆదాయ మార్గాలను చూపాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఏదైనా సంస్థ లేదా పథకం పేరుతో బ్యాంకులు ఇచ్చే రుణం సొమ్మును ఆ పనికి మాత్రమే వినియోగించాలని.. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వడం చెల్లకుండా చూడాలని ఇటీవల రిజర్వుబ్యాంకు వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు చేసిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రుణ సేకరణకు ఉన్న ఇతర అవకాశాలేమిటన్న దానిపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చలు జరుపుతోంది. వృథాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో కుదువపెట్టి రుణాలు తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చినట్టు తెలిసింది. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో 700 ఎకరాలకుపైగా భూములను ప్రభుత్వం గుర్తించింది. అందులో కొన్ని భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా రూ.20 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే రిజర్వుబ్యాంకు గవర్నర్‌తో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.

ఆరోపణలు చేస్తున్న రాహుల్‌ గాంధీ
ఉప్పందిందా? లేక నిప్పులేని పొగేనా?

జూన్‌ 1న ఎగ్జిట్‌ ఫలితాలు వెల్లడవటానికి ముందు రోజు మే 31న జరిగిన షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల విలువ ఆ ముందరి రోజు జరిగిన దానికి రెట్టింపు! ఈ మొత్తం కొనుగోళ్లలో 58 శాతం వాటా విదేశీ ఇన్వెస్టర్లదే. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ మోదీ ఘన విజయం సాధించబోతున్నారని ప్రకటించిన రోజుకు సరిగ్గా ముందు రోజే స్టాక్‌ మార్కెట్‌లో రెట్టింపు ట్రేడింగ్‌ జరగటం యాదృచ్ఛికమైతే కాదు. దీనివల్ల అసలు ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్‌ 4న స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలి పోవటం, సాధారణ ఇన్వెస్టర్ల షేర్ల విలువ పాతాళానికి పడిపోవటం జరిగింది. ఆ రోజు స్టాక్‌ మార్కెట్‌కు వచ్చిన నష్టం అక్షరాలా 30 లక్షల కోట్ల రూపాయలు. అందుకే... ‘ఎగ్జిట్‌పోల్‌ స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌’ జరిగిందా అన్నది ప్రశ్న.మే 31–జూన్‌ 4 మధ్య నేషనల్‌ స్టాక్‌ ఎక్సే ్చంజి (ఎన్‌.ఎస్‌.ఇ)లో ఏదైనా అనుమానాస్పదమైన, ఆందోళన కలిగించే పరిణామం సంభవించిందా? సంభవించింది అని రాహుల్‌ గాంధీ అంటున్నారు. దానిపై దర్యాప్తు జరిపించాలని ఆయన కోరుతున్నారు. అయితే ఆయన అంటున్నది నిజమేనని మనమెలా చెప్పగలం? వాస్తవాలను పరిశీలించడం ద్వారా మాత్రమే. కనుక ఈ విషయమై ‘ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌’ చైర్మన్‌ ప్రవీణ్‌ చక్రవర్తి వద్ద అందుబాటులో ఉన్న కొన్ని వివరాలను మీ ముందు ఉంచుతాను. ఇందుకు చక్రవర్తినే నేను ఎంచుకోవటానికి కారణం రాహుల్‌ అంటున్న దానికి, చక్రవర్తి చెబుతున్నది చాలా దగ్గరి ఏకీభావం కలిగి ఉన్నదని నేను అనుకోవటం. మొదటిది– మే 31న ఎన్‌.ఎస్‌.ఇ.లో జరిగిన షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల విలువ ఆ ముందటి రోజు మొత్తానికంటే రెట్టింపు. పదేళ్ళ కిత్రం 2014 మే నెలలో ఇలాంటిదే నరేంద్ర మోదీ తన తొలి మెజారిటీ సాధించినప్పుడు జరిగినప్పటికీ అలా జరగడం ‘‘చాలా అరుదు’’ అని చక్రవర్తి అంటారు. 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించినప్పుడు సైతం స్టాక్‌ మార్కెట్‌ కార్యకలాపాలు ఆ ముందరి రోజు కన్నా రెట్టింపు ఏమీ కాలేదు. 22 శాతం మాత్రమే పెరిగాయి. రెండవది– ఎన్‌.ఎస్‌.ఇ. సొంత డేటా చెబుతున్న దానిని బట్టి 31న జరిగిన ‘‘మొత్తం షేర్ల కొనుగోళ్లలో 58 శాతం వాటాను ఫారిన్‌ ఇన్వెస్టర్లే (ఎఫ్‌ఐలు) కలిగి ఉన్నారు’’ అని చక్రవర్తి అంటున్నారు. ‘‘ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వారంలో ఆ ముందు వరకు ఎఫ్‌ఐలు అంత భారీ మొత్తంలో షేర్లను కొనటం, కొన్న వాటికి మించి అమ్మటం జరగలేదు’’ అని కూడా ఆయన అన్నారు. మరి విదేశీ ఇన్వెస్టర్లను అంత భారీ మొత్తాలలో కొనిపించింది ఏమిటి? భారీగా కొనటం మాత్రమే కాదు, 31న వారు అంతే భారీగా అమ్మకాలు కూడా జరిపారన్న వాస్తవాన్ని చక్రవర్తి విస్మరించారు. బదులుగా ఆయన, ‘‘తర్వాతి రోజు ఏం జరిగిందన్న దానిని బట్టే ఆ ముందు రోజు జరిగిన దానిని వివరించగలం’’ అన్నారు. తర్వాతి రోజు అంటే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు బయటికి వచ్చిన రోజు. మే 31కి, జూన్‌ 1కి చక్రవర్తి పెట్టిన ఈ లంకె... ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల గురించి విదేశీ ఇన్వెస్టర్లకు ముందే తెలిసైనా ఉండాలి, లేదంటే వారికై వారు సర్వే జరిపించుకొని ఉండాలి అన్నదానిని సూచిస్తోంది. అయితే విదేశీ ఇన్వెస్టర్లు అంత భారీగా షేర్లు కొనటానికి ఈ రెండూ కాకుండా మూడో కారణం ఏదైనా ఉండి ఉంటుందా?ఉంటుందనైతే చక్రవర్తి అనుకోవటం లేదు. ‘‘ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కూడా ఒకే రీతిన మోదీ అపారమైన విజయం సాధించబోతున్నారని ఫలితాలను వెల్లడించిన రోజుకు సరిగ్గా ముందు రోజే స్టాక్‌ మార్కెట్‌లో రెట్టింపు ట్రేడింగ్‌ అనే అత్యంత అరుదైన పరిణామం జరగటం అన్నది కేవలం యాదృచ్ఛికమైతే కాదు’’ అంటారాయన. కానీ అది యాదృచ్ఛికం ఎందుకు కాకూడదు? ఇందిరా గాంధీ తన మరణం గురించి మాట్లాడిన 24 గంటల తర్వాత ఆమె హత్య జరిగింది. అది యాదృచ్ఛికం మాత్రమే! విషయాన్ని ఒకడుగు ముందుకు తీసుకెళదాం. విదేశీ ఇన్వెస్టర్లు మే 31న షేర్లు కొనుగోలు చేశారు. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ అనంతరం జూన్‌ 3న స్టాక్‌ మార్కెట్‌ రాకెట్‌లా పైకి దూసుకెళ్లింది. కాబట్టి అప్పుడు కనుక వారు ఆ షేర్లను అమ్ముకుని ఉంటే భారీగా లాభాలు వచ్చేవి. అలా చేయటంలోని నియమబద్ధత గురించే ఇప్పుడు చక్రవర్తి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇలాంటి ప్రశ్నలకు ఆయనైతే ఎలా సమాధానం ఇస్తారనే విషయంలో సందేహం లేదు. ‘‘సంఘటనల కాలక్రమం, స్టాక్‌ మార్కెట్‌ డేటాలను అనుసరించి... ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయటానికి మాత్రమే కాకుండా, స్టాక్‌ మార్కెట్‌లను ఉపయోగించి లాభపడటానికి కూడా ఎగ్జిట్‌ పోల్స్‌ ఆయుధాలు అయ్యాయని ఎవరైనా తేలిగ్గా చెప్పేయొచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఎగ్జిట్‌ పోల్‌ స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌’ ఇండియాలో జరిగి ఉంటుంది’’ అంటారు చక్రవర్తి. మీడియా నిర్వహించినవి కనుక ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు లీక్‌ అయే అవకాశం ఉందనే విషయాన్ని పక్కనపెడదాం. ఒకవేళ విదేశీ ఇన్వెస్టర్లే తమ సొంతంగా ఎగ్జిట్‌ పోల్స్‌ని జరిపించుకొని ఉండి, ఆ ఫలితాలు కూడా మీడియా నిర్వహించిన ఫలితాల దిశనే సూచిస్తూ ఉండి, వాటి ఆధారంగా వాళ్లు షేర్లు కొని ఉంటే అప్పుడది నియమబద్ధం అవుతుందా? ఒకటే ప్రశ్న ఏమిటంటే... విదేశీ ఇన్వెస్టర్లు అంత ప్రయాసతో ఎగ్జిట్‌ పోల్స్‌ జరిపించుకొని ఉంటారా? నాకైతే సందేహమే. సగటు భారతీయ పెట్టుబడిదారుల విషయానికి వద్దాం. మొదట, వారు విన్నది ఇదీ: నరేంద్ర మోదీ ‘ఎకనమిక్‌ టైమ్స్‌’తో (మే 23న) మాట్లాడుతూ, ‘‘నేను నమ్మకంగా చెప్పగలను, జూన్‌ 4న బీజేపీ రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకుంటుంది. స్టాక్‌ మార్కెట్‌ కూడా కొత్త రికార్డులకు చేరుకుంటుంది’’ అన్నారు. అంతకు ముందు హోంమంత్రి ‘ఎన్డీటీవీ’తో (మే 13న) మాట్లాడుతూ, ‘‘జూన్‌ 4 లోపు షేర్లు కొనమని మీకు చెబుతున్నాను. అవి అమాంతం పెరగబోతున్నాయి’’ అన్నారు. ఆ సలహాలపై వారు షేర్లు కొని ఉంటే, జూన్‌ 4న ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలి పోవటం, వారి షేర్ల విలువ పాతాళానికి పడిపోవటం చూశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ రోజు స్టాక్‌ మార్కెట్‌కు వచ్చిన నష్టం రూ. 30 లక్షల కోట్లు. దాంతో సాధారణ ఇన్వెస్టర్లు నష్టపోయారు. అయితే మూడు రోజుల తర్వాత, వారాంతంలో శుక్రవారం 7వ తేదీన స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి 4వ తేదీన వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవటం మాత్రమే కాదు, షేర్ల పెరుగుదల ఎన్నడూ లేనంతగా గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. ఇక్కడ ఇన్వెస్టర్లకు వచ్చినదానికంటే పోయినది ఎక్కువ.దీనర్థం ‘సమస్య’ విదేశీ ఇన్వెస్టర్లలో ఉందని! అది దర్యాప్తు జరిపించవలసినంత సమస్యా? భారతదేశంలోని వ్యక్తులు, సంస్థల తరఫున వారు షేర్లలో పెట్టుబడి పెట్టి ఉంటారని మీకు అనుమానంగా ఉంటే అప్పుడు దర్యాప్తు అవసరం కావచ్చు. మీకలాంటి అనుమానం లేదా? వాళ్లు తమకై తామే ఇన్వెస్ట్‌ చేసి ఉంటారని బహుశా మీకు అనిపిస్తోందా? అప్పుడైతే తదుపరి చర్య అవసరం అవుతుందా?కరణ్‌ థాపర్‌ వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Health Insurance Claim from Multiple Policies
ఒకరికి రెండు పాలసీలు.. క్లెయిమ్‌ ఎలా?

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రాధాన్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవలి కాలంలో వేతన జీవుల్లో చాలా మంది రెండు హెల్త్‌ పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స వ్యయం బీమా కవరేజీని మించిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలను ఒకటికి మించిన పాలసీలతో సులభంగా గట్టెక్కొచ్చు. కానీ, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే క్లెయిమ్‌ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు అందించే కథనమిది.గతంలో వేరు.. ఒక వ్యక్తికి ఒకటికి మించిన బీమా సంస్థల నుంచి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు ఉంటే, క్లెయిమ్‌ మొత్తాన్ని ఆయా సంస్థలు సమానంగా భరించాలనే నిబంధన లోగడ ఉండేది. 2013లో దీన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) తొలగించింది. దీంతో ఇప్పుడు ఒకటికి మించిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు కలిగి ఉన్నా కానీ, పాలసీదారు తనకు నచ్చిన చోట లేదంటే రెండు సంస్థల వద్దా క్లెయిమ్‌ దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్‌ ఎలా? రెండు ప్లాన్లు కలిగిన వారు ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు బీమా సంస్థలకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. ఒకటికి మించిన సంస్థల నుంచి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లు కలిగి ఉంటే, అప్పుడు ముందుగా ఒక బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తే సరిపోతుంది. నగదు రహిత, రీయింబర్స్‌మెంట్‌ మార్గాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు. క్లెయిమ్‌ మొత్తం ఒక హెల్త్‌ ప్లాన్‌ కవరేజీ దాటనప్పుడు ఒక బీమా సంస్థ వద్దే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక పాలసీ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు వచి్చనప్పుడు, రెండో బీమా సంస్థ వద్ద మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్‌ చేసుకోవాలి. అంతే కానీ, ఒకేసారి ఒకే క్లెయిమ్‌ను రెండు సంస్థల వద్ద దాఖలు చేసేందుకు అవకాశం లేదు. ఉదాహరణకు రూ.5 లక్షల చొప్పున రెండు ప్లాన్లు ఉన్నాయని అనుకుందాం. ఆస్పత్రి బిల్లు రూ.7 లక్షలు వచి్చంది. అప్పుడు తొలుత ఒక సంస్థ వద్ద క్లెయిమ్‌ దాఖలు చేయాలి. అక్కడి నుంచి వచి్చన చెల్లింపులు మినహాయించి, అప్పుడు మిగిలిన మొత్తానికి రెండో బీమా సంస్థ నుంచి పరిహారం కోరాలి. ఒక పాలసీలో రూమ్‌రెంట్‌ పరంగా పరిమితులు ఉండి, దానివల్ల క్లెయిమ్‌ పూర్తిగా రాని సందర్భాల్లోనూ.. మిగిలిన మొత్తాన్ని రూమ్‌రెంట్‌ పరిమితులు లేని మరో పాలసీ కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు. కొన్ని పాలసీల్లో రూమ్‌ రెంట్, కొన్ని చికిత్సలకు పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా గ్రూప్‌ హెల్త్‌ ప్లాన్లలో ఇవి చూడొచ్చు. అలాంటప్పుడు రూ.5 లక్షల కవరేజీ ఉన్నప్పటికీ పూర్తి మొత్తం రాకపోవచ్చు. ఉదాహరణకు రూ.7లక్షల ఆస్పత్రి బిల్లుకు సంబంధించి రూ. 5 లక్షల గ్రూప్‌ పాలసీలో రూ.4 లక్షలే క్లెయిమ్‌ కింద వచి్చందని అనుకుంటే.. అప్పుడు మిగిలిన రూ. 3 లక్షలను రెండో పాలసీ కింద రీయింబర్స్‌మెంట్‌ కోరవచ్చు. ఒక బీమా సంస్థ క్లెయిమ్‌ దరఖాస్తును తిరస్కరించినా, రెండో బీమా సంస్థను సంప్రదించవచ్చు. వేతన జీవులు పనిచేసే సంస్థ నుంచి గ్రూప్‌ హెల్త్‌ ప్లాన్, వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఫ్లోటర్‌ లేదా ఇండివిడ్యు వల్‌ ప్లాన్‌ కలిగి ఉన్నప్పుడు.. మొదట గ్రూప్‌ హెల్త్‌ ప్లాన్‌ నుంచి క్లెయిమ్‌కు వెళ్లడం మంచి ఆప్షన్‌. గ్రూప్‌ హెల్త్‌ ప్లాన్‌లో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ సులభంగా ఉంటుంది. క్లెయిమ్‌ మొత్తం ఒక బీమా పాలసీ కవరేజీ పరిధిలోనే ఉంటే ఒక్క సంస్థ వద్దే క్లెయిమ్‌కు పరిమితం కావాలి. దీనివల్ల రెండో ప్లాన్‌లో నో క్లెయిమ్‌ బోనస్‌ నష్టపోకుండా చూసుకోవచ్చు.నగదు రహిత చికిత్సబీమా సంస్థ నెట్‌వర్క్‌ పరిధిలోని అన్ని ఆస్పత్రుల నుంచి నగదు రహిత చికిత్స తీసుకోవచ్చు. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత చికిత్సకు బీమా సంస్థలు నేడు అవకాశం కలి్పస్తున్నాయి. కాకపోతే ఆస్పత్రి నిషేధిత జాబితాలో లేని వాటికే ఈ సదుపాయం పరిమితమని గుర్తుంచుకోవాలి. రెండు ప్లాన్లలోనూ నగదు రహిత చికిత్సకు వెళ్లొచ్చు. కానీ, ఒక సంస్థ నుంచే నగదు రహిత క్లెయిమ్‌కు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇస్తుంటాయి. మిగిలిన మొత్తం కోసం రీయింబర్స్‌మెంట్‌ విధానానికి వెళ్లాలని సూచిస్తుంటాయి. అలాంటప్పుడు నగదు రహిత విధానంలో గరిష్ట పరిమితి మేరకే ఒక బీమా సంస్థ నుంచి చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని సొంతంగా చెల్లించి, దాన్ని రాబట్టుకునేందుకు రెండో బీమా సంస్థను సంప్రదించాలి. దీనికోసం మొదట క్లెయిమ్‌ చేసిన బీమా సంస్థ నుంచి ‘క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ సమ్మరీ’ తీసుకోవాలి. అలాగే, హాస్పిటల్‌ బిల్లులు, చికిత్సకు సంబంధించి అన్ని పత్రాల ఫొటో కాపీలను సరి్టఫై (అటెస్టేషన్‌) చేసి ఇవ్వాలని మొదటి బీమా సంస్థను కోరాలి. వీటితో రెండో బీమా సంస్థ వద్ద రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ దరఖాస్తు దాఖలు చేసుకోవాలి. రెండు బీమా సంస్థల వద్ద రీయింబర్స్‌మెంట్‌ విధానంలో క్లెయిమ్‌ చేసుకోవాలన్నా సరే.. మొదట ఒక సంస్థ వద్ద క్లెయిమ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆస్పత్రి నుంచి అన్ని బిల్లుల కాపీలు, డిశ్చార్జ్‌ సమ్మరీ, ల్యాబ్‌ రిపోర్ట్‌లు తీసుకుని బీమా సంస్థకు సమర్పించాలి. క్లెయిమ్‌ ఆమోదం అనంతరం, క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ సమ్మరీతోపాటు, అన్ని డాక్యుమెంట్ల ఫొటో కాపీలతో రెండో సంస్థ వద్ద రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ దాఖలుకు కాలపరిమితి ఉంటుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత 15–30 రోజులు దాటకుండా క్లెయిమ్‌ దాఖలు చేసుకోవాలి. ఒకరికి ఎన్ని ప్లాన్లు? అసలు ఒకటికి మించి హెల్త్‌ పాలసీలు ఎందుకు? అనే సందేహం రావచ్చు. ఒక్కొక్కరి అవసరాలే దీన్ని నిర్ణయిస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్‌ హెల్త్‌ కవరేజీ సాధారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచి్చనా లేదంటే ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో.. తిరిగి ఉపాధి లభించేందుకు కొంత సమయం పట్టొచ్చు. కంపెనీలు కలి్పంచే గ్రూప్‌ హెల్త్‌ కవరేజీ.. ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే ముగిసిపోతుంది. అందుకే వ్యక్తిగతంగా మరో ప్లాన్‌ కలిగి ఉంటే, ఉద్యోగం లేని సమయంలోనూ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో రెండు ప్లాన్లను కలిగి ఉండడం మంచి నిర్ణయమే అవుతుంది. లేదంటే బేస్‌ ప్లాన్‌ ఒకటి తీసుకుని, దానిపై మరింత మెరుగైన కవరేజీతో సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ జోడించుకోవడం మరొక మార్గం.రీయింబర్స్‌మెంట్‌కు కావాల్సిన డాక్యుమెంట్లు డిశ్చార్జ్‌ సమ్మరీ, నగదు/కార్డు ద్వారా చెల్లింపులకు సంబంధించి రసీదులు, ల్యాబ్‌ రిపోర్ట్‌లు, వైద్యులు రాసిచి్చన ప్రిస్కిప్షన్లు, ఎక్స్‌రే ఫిల్మ్‌లు, క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ సమ్మరీ.ఏడాదిలో ఎన్ని క్లెయిమ్‌లు? ఏడాదిలో ఎన్ని క్లెయిమ్‌లు అన్న దానితో సంబంధం లేకుండా, గరిష్ట బీమా కవరేజీ పరిధిలో ఎన్ని విడతలైనా పరిహారం పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు క్లెయిమ్‌ల సంఖ్య పరంగా పరిమితులు విధించొచ్చు. కనుక పాలసీ వర్డింగ్స్‌ డాక్యుమెంట్‌ను తప్పకుండా చదివి ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. రెండు రకాల పాలసీలు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సాధారణంగా రెండు రకాలు. ఇండెమ్నిటీ ఒక రకం అయితే, ఫిక్స్‌డ్‌ బెనిఫిట్‌తో కూడినవి రెండో రకం. ఇండెమ్నిటీ పాలసీలు ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలతోపాటు.. ఎంపిక చేసిన డేకేర్‌ ప్రొసీజర్స్‌ (చికిత్స తర్వాత అదే రోజు విడుదలయ్యేవి)కు మాత్రమే కవరేజీ ఇస్తాయి. ఇక క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలను ఫిక్స్‌డ్‌ బెనిఫిట్‌ పాలసీలుగా చెబుతారు. ఇందులో కేన్సర్, గుండె జబ్బులు, మూత్ర పిండాల వైఫల్యం, కాలేయ వైఫల్యం తదితర తీవ్ర వ్యాధుల్లో ఏదైనా నిర్ధారణ అయిన వెంటనే నిర్ణీత పరిహారాన్ని బీమా సంస్థలు ఒకే విడత చెల్లించేస్తాయి. కనుక క్లెయిమ్‌ విషయంలో ఈ రెండింటి పరంగా గందరగోళం అక్కర్లేదు. ఇండెమ్నిటీ ప్లాన్, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ రెండూ కలిగిన వారు.. ఏదైనా తీవ్ర వ్యాధి (క్రిటికల్‌ ఇల్‌నెస్‌) బారిన పడినప్పుడు ఇండెమ్నిటీ ప్లాన్‌ కింద కవరేజీ పొందొచ్చు. అలాగే, వ్యాధి నిర్ధారణ పత్రాలతో క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ కింద క్లెయిమ్‌ దాఖలు చేసి పూర్తి ప్రయోజనాన్ని అందుకోవచ్చు. దీనివల్ల ఆయా వ్యాధులకు సంబంధించి ఎదురయ్యే భారీ వ్యయాలను తట్టుకోవడం సాధ్యపడుతుంది. టాపప్, సూపర్‌ టాపప్‌ ప్లాన్లు ఇక హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో టాపప్, సూపర్‌ టాపప్‌ ప్లాన్లు కూడా ఉంటాయి. ఇందులో సూపర్‌ టాపప్‌ ఎక్కువ అనుకూలం. ఇవి డిడక్షన్‌ క్లాజుతో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల కవరేజీతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకున్న వారు, రూ.50 లక్షల సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ కూడా జోడించుకున్నారని అనుకుందాం. ఆస్పత్రి బిల్లు మొదటి రూ.5 లక్షలు దాటిన తర్వాతే సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ కింద కవరేజీ పొందగలరు. రూ.50 లక్షల వరకు బిల్లు ఎంత వచ్చినా సరే.. మొదటి రూ.5 లక్షలకు సూపర్‌ టాపప్‌లో పరిహారం రాదు. దాన్ని సొంతంగా భరించడం లేదంటే బేస్‌ ప్లాన్‌ నుంచి కవరేజీ తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా రూ.50 లక్షల బేస్‌ ఇండెమ్నిటీ ప్లాన్‌తో పోలి్చతే.. రూ.5–10 లక్షల మేర బేస్‌ ప్లాన్‌ తీసుకుని, 50 లక్షలకు సూపర్‌ టాపప్‌ తీసుకోవడం వల్ల ప్రీమియం భారం కొంత తగ్గుతుంది.

Tdp,janasena Activists Attack On Jogi Ramesh House
మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై రాళ్ల దాడి

సాక్షి,ఎన్టీఆర్‌ జిల్లా: ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు.తాజాగా, మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటిపై జనసేన,టీడీపీ సానుభూతి పరులు రాళ్లురువ్వారు. AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారు.

Sales Of Affordable Homes Fall 4 pc In January March PropEquity
హైదరాబాద్‌లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు

తక్కువ సరఫరా, లగ్జరీ అపార్ట్మెంట్లకు అధిక డిమాండ్ కారణంగా ఈ ఏడాది జనవరి-మార్చిలో ఎనిమిది ప్రధాన నగరాల్లో అఫోర్డబుల్‌ ఇళ్ల అమ్మకాలు 4 శాతం క్షీణించి 61,121 యూనిట్లకు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ తెలిపింది. మొదటి ఎనిమిది స్థానాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్ ఉన్నాయి.రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం గత క్యాలెండర్ ఇయర్ జనవరి-మార్చి కాలంలో రూ.60 లక్షల మేర విలువైన ఇళ్ల అమ్మకాలు 6,3787 యూనిట్లుగా ఉన్నాయి. చౌక గృహాల సరఫరా తక్కువగా ఉండటం అమ్మకాలు స్వల్పంగా పడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం, ఈ టాప్ 8 నగరాల్లో 2024 జనవరి-మార్చి మధ్య కాలంలో రూ.60 లక్షల మేర విలువైన ఇళ్ల తాజా సరఫరా 53,818 యూనిట్ల నుంచి 33,420 యూనిట్లకు తగ్గింది.ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరి-మార్చిలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో రూ .60 లక్షల వరకు ధర కలిగిన గృహాల అమ్మకాలు 23,401 యూనిట్ల నుంచి 28,826 యూనిట్లకు పెరిగాయి. పుణెలో అమ్మకాలు 14,532 యూనిట్ల నుంచి 12,299 యూనిట్లకు పడిపోయాయి. అహ్మదాబాద్‌లో 8,087 యూనిట్ల నుంచి 6,892 యూనిట్లకు తగ్గాయి.హైదరాబాద్‌లో ఈ ఇళ్ల అమ్మకాలు 3,674 యూనిట్ల నుంచి 3,360 యూనిట్లకు తగ్గగా, చెన్నైలో అమ్మకాలు 3,295 యూనిట్ల నుంచి 2,003 యూనిట్లకు పడిపోయాయి. బెంగళూరులో అమ్మకాలు 5,193 యూనిట్ల నుంచి 2,801 యూనిట్లకు తగ్గాయి. కోల్‌కతాలో మాత్రం అమ్మకాలు 2,831 యూనిట్ల నుంచి 3,741 యూనిట్లకు పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్‌లో 2,774 యూనిట్ల నుంచి 1,199 యూనిట్లకు తగ్గాయి.

Congress Leader Urges Shah Rukh Khan to Visit His Ailing Teacher
చివరిసారిగా అడుగుతున్నా.. ఒక్కసారి వచ్చిపో షారూఖ్‌..

పాఠాలు నేర్పిన గురువు తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. కానీ అభిమాని పేరు చెప్పగానే కదల్లేని స్థితిలో ఉన్న ఆయన కళ్లలో ఒక మెరుపు. అది చూసిన కాంగ్రెస్‌ లీడర్‌ సజరిత లైఫ్‌లాంగ్‌.. ఎలాగే ఆ శిష్యుడిని గురువు ముందు హాజరుపర్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం అలాగైనా ఆయన ఆరోగ్య పరిస్థితిలో కాస్త మార్పు వస్తుందని భావిస్తున్నారు.క్షీణిస్తున్న ఆరోగ్యంఆ శిష్యుడు మరెవరో కాదు బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌. షారూఖ్‌ గురువు ఎరిక్‌ డిసౌజ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ విషయాన్ని డిసౌజ సోదరి సజరిత లైఫ్‌లాంగ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. 'నా సోదరుడు ఎరిక్‌ డిసౌజ హెల్త్‌ కండీషన్‌ దిగజారుతోంది. సరిగా మాట్లాడలేకపోతున్నాడు. ప్లీజ్‌ షారూఖ్‌.. ఒక్కసారి ఆయనను చూడటానికి రా.. క్షణాలు గడిచేకొద్దీ తనకేం జరుగుతుందోనని భయంగా ఉంది. ముంబై నుంచి గోవా రావడానికి పెద్దగా సమయం కూడా పట్టదు. కొన్ని నిమిషాలు చాలుఒక అరగంటలో వచ్చేయొచ్చు. కేవలం కొన్ని నిమిషాల సమయం తన కోసం కేటాయించు. ఇప్పుడాయనకు మీరే ప్రపంచం. మీ రాక వల్ల తను కోలుకునే అవకాశం ఉంది. లేదంటే తన కళ్లముందు కమ్ముకున్న చీకటి నుంచి విముక్తి లభించి శాంతి చేకూరవచ్చు. చివరిసారిగా అడుగుతున్నాను.. మీ స్పందన కోసం ఎదురుచూస్తున్నాను' అని అభ్యర్థించారు. షారూఖ్‌కు, ఎరిక్‌ డిసౌజకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఓ పాత వీడియోను సైతం షేర్‌ చేశారు. ఇది చూసిన అభిమానులు షారూఖ్‌.. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న తన గురువును చూసేందుకు వెళ్లాలని కోరుతున్నారు. This feels like my final plea, my last attempt to reach out to @iamsrk to humbly request his presence by the side of Brother Eric S D'Souza. Each day, Brother 's health weakens, his condition worsening with every passing moment. Mumbai, just an hour away by flight, holds the… pic.twitter.com/9HaCjp5gLv— Szarita Laitphlang,ज़रिता लैतफलांग (@szarita) June 14, 2024 https://t.co/6QcjlFVvLj— Szarita Laitphlang,ज़रिता लैतफलांग (@szarita) June 15, 2024చదవండి: 'మహారాజ'.. విజయ్‌ సేతుపతి నన్ను తీసుకోవద్దన్నారు: నటి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement