Top Stories
ప్రధాన వార్తలు
![AP Political News: June 19 YSRCP Key Meeting](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/YSRCP_Key_Meeting.jpg.webp?itok=LJPsSFIz)
YS Jagan: 19న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
గుంటూరు, సాక్షి: ఎన్నికల ఓటమి తర్వాత ఢీలా పడ్డ పార్టీ కేడర్లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫలితాలను సమీక్షిస్తూనే.. పార్టీ కీలక నేతలతో వరుస చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్లుండి కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో ఈ నెల 19వ తేదీన తన కార్యాలయంలో వైఎస్జగన్ భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ, టీడీపీ దాడులే ప్రధానాంశాలుగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో.. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సమగ్రంగా చర్చించి పలు కీలక సూచనలతో వాళ్లకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన భేటీ నిర్వహించారు. ఇప్పుడే ఏం అయిపోలేదని.. అధైర్య పడొద్దని, పార్టీ చేసిన మంచిని ప్రజలు అంత సులువుగా మరిచిపోరని, త్వరలోనే పార్టీ పుంజుకుంటుందని వాళ్లందరికీ ధైర్యం చెప్పారాయన. అలాగే.. ప్రతిపక్షాలకు కాస్త టైం ఇద్దామని, ఆ తర్వాత ప్రజల తరఫున గట్టిగా పోరాటం చేద్దామని సూచించారు. మరోవైపు.. టీడీపీ శ్రేణుల్లో గాయపడ్డ వాళ్లను పరామర్శించేందుకు త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తారని ప్రకటించారు కూడా.
![Rahul Gandhi To Give Up Wayanad Seat, Priyanka Gandhi To Contest From Wayanad](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/rahul%20gandhi%20and%20priyanka%20gandhi.jpg.webp?itok=MkpUqrae)
వయనాడ్ను వదులుకున్న రాహుల్ .. ఉప ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు.దీంతో వయనాడ్ (కేరళ), రాయ్బరేలీ (యూపీ) స్థానాల్లో ఒక నియోజకవర్గాన్ని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నానంటూ ఇటీవల రాహుల్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, తన నిర్ణయం రెండు వర్గాల ప్రజలను సంతోషపరుస్తుందని అన్నారు. ఈ తరుణంలో వయనాడ్ స్థానాన్ని వదులుకున్నట్లు రాహుల్ గాంధీ అధికారింగా ప్రకటించారు. రాహుల్ రాజీనామాతో వయనాడ్లో జరిగే ఉప ఎన్నికల్లో ఆయన సోదరి ప్రియాంక గాంధీ బరిలోకి దిగడం అనివార్యమైంది.ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాయ్ బరేలితో గాంధీ కుటుంబానికి తరతరాల అనుబంధం ఉంది.వయనాడ్ సీటుకు రాహుల్ రాజీనామా చేస్తారు. ఆస్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు’ అని ఖర్గే వెల్లడించారు.‘వయనాడ్తో నాకు అనుబంధం ఉంది. జీవితాంతం వయనాడ్ నాకు గుర్తుంటుంది. ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తారు. కష్ట కాలంలో వయనాడ్ నుంచి నన్ను గెలిపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం’ అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.‘వయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నా..రాయ్ బరేలిలో నా సోదరుడికి ఎప్పుడు మద్దతుగా ఉంటా’ అని ప్రియాంక గాంధీ అన్నారు.ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అరంగేట్రంపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఆమె అమేథీ లేదా రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. దీనిపై సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ చేసి విజయం సాధించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించేందుకే ఆమె పోటీకి దూరమైనట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. అయితే, ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లవచ్చని అన్నారు. తాజా రాహుల్ గాంధీ వయనాడ్కు రాజీనామా చేయడంతో..ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగ్రేటం అనివార్యమైంది.
![Ips Transfers In Telangana On 17th June 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/TS-Gov.jpg.webp?itok=kqqL8xz1)
TG: తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ బదిలీలు చేసింది. మొత్తం 28 మంది పోలీసు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సాధారణపరిపాలన శాఖ సోమవారం(జూన్17) ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు.. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
![Allu Arjun Pushpa 2 New Released Date Announced](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/p_0.jpg.webp?itok=IzeeiOL8)
అనుకున్నదే జరిగింది.. పుష్ప-2 రిలీజ్ డేట్ ఇదే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం 'పుష్ప-2: ది రూల్'. ఈ సినిమాను సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ తేదీని ప్రకటించిన మేకర్స్ పుష్ప-2 పోస్ట్పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా మరో తేదీని మేకర్స్ వెల్లడించారు.ఈ ఏడాది డిసెంబర్ 6న పుష్ప-2 విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే మూవీ వాయిదా పడుతుందంటూ చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని ప్రకటించాక రూమర్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ కొత్త తేదీని ప్రకటించారు. కొంత షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పెండింగ్ ఉన్నందున రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. We intend to give you the best 🔥The wait increases for a memorable experience on the big screens.#Pushpa2TheRule Grand release worldwide on 6th DECEMBER 2024 💥💥His rule will be phenomenal. His rule will be unprecedented ❤️🔥Icon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/3JYxXd2YgF— Pushpa (@PushpaMovie) June 17, 2024
![Chandrababu Comments On Polavaram Project](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/Chandrababu-Polavaram.jpg.webp?itok=ZDuXWNMV)
బాబు మార్క్ కథలు మళ్లీ షురూ..!
బాబు గారు మళ్లీ గళమెత్తారు. తనదైన శైలిలో తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నాలకు మరో దఫా శ్రీకారం చుట్టారు. పోలవరం నిర్మాణం విషయంలో తాను చేసిందంతా సక్రమమేనని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన ఆ తరువాత ఓ మీడియా సమావేశం నిర్వహించి ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమవుతుందని తేల్చేశారు. డయాఫ్రామ్ వాల్ మరమ్మతులకు రూ.2000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని కూడా ఆయన అంచనా వేశారు. ఈ క్రమంలోనే కొన్ని సత్యాలకు బోలెడన్ని అసత్యాలు జోడించి గత తప్పులన్నింటినీ కప్పిపెట్టే ప్రయత్నం చేయడమే కాకుండా.. తప్పు ఇతరులపైకి నెట్టేందుకూ కృషి చేశారు. అయితే 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు చేసిన పలు తప్పిదాలు.. తీసుకున్న నిర్ణయాలే పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోయేందుకు కారణమన్నది నిపుణులు చాలామంది చెప్పే విషయం.ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్ వే నిర్మాణం మొదట చేపట్టి ఆ తరువాత అవసరానికి అనుగుణంగా కాఫర్ డ్యామ్ కట్టడం ఇంజినీరింగ్ పద్ధతి. అయితే చంద్రబాబు మాత్రం ముందు కాఫర్ డ్యామ్ కట్టేలా నిర్ణయం తీసుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని నిపుణులు చెబుతున్నా పట్టించుకోలేదు. ప్రాజెక్టుకు సంబంధించిన చాలా కీలకమైన నిర్మాణ పనులన్నింటినీ పక్కనబెట్టి ఆఘమేఘాల మీద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు. ఫలితంగా 2020లో వచ్చిన వరదకు కాఫర్ డ్యామ్ బాగా దెబ్బతింది. మళ్లీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాఫర్ డ్యామ్ డిజైన్లను కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ 2017లో తిరస్కరించినా పట్టించుకోని చంద్రబాబు ఫిబ్రవరి నెలలో డయా ఫ్రమ్ వాల్ నిర్మాణానికి, గేట్ల నిర్మాణ పనులు మొదలుపెట్టడం గమనార్హం.కాఫర్ డ్యామ్ ఎత్తును 41 మీటర్ల వరకూ పెంచుకోవచ్చునని జల వనరుల శాఖ అనుమతిచ్చిన తరువాత దిగువభాగంలో ఊటను నియంత్రించేందుకు షీట్ ఫైల్స్ వాడతామని కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ ప్రతిపాదించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి.అయితే ఈ షీట్ ఫైల్స్ ద్వారా ఊటను నియంత్రించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ట్రాన్స్ట్రాయ్ డిజైన్లను తిరస్కరించి కొత్త డిజైన్లను రూపొందించిమని ఆదేశించింది.వాస్తవం ఇలా ఉంటే.. చంద్రబాబు మాత్రం 2019 మే నెలలో గద్దెనెక్కిన జగన్ ప్రభుత్వం కాఫర్ డ్యామ్ (డయాఫ్రమ్ వాల్)ను కాపాడలేకపోయారని విమర్శించడం గమనార్హం.పోలవరం స్పిల్ వే బ్రిడ్జికి సంబంధించి 14 బ్లాకుల్లో ట్రూనియన్ స్తంభాలు విఫలమయ్యాయి. అప్పర్ కాఫర్ డ్యామ్ నిర్మాణం కారణంగా గ్యాప్-1లోని అప్రోచ్ ఏరియా పూర్తిగా దెబ్బతినింది. పైగా ఈ అప్పర్ కాఫర్డ్యామ్ కట్టినందుకు 2019లోనే వరదనీరు స్పిల్ వేను దాటి మరీ ప్రవహించింది. ఫలితంగా అప్పటివరకూ చేపట్టిన స్పిల్ వే ఛానల్ పనులు వృథా అయ్యాయి. స్పిల్ వేలో చేరి నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టిందంటేనే బాబు గారి నిర్ణయం వల్ల జరిగిన నష్టం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.2019, 2020లలో గోదావరికి వచ్చిన వరదలు ఎగువప్రాంతాల్లోని నీట మునిగేందుకు కారణమయ్యాయి. కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్ల వరద నీరు వెనక్కు వెళ్లిపోవడం దీనికి కారణం.2014- 2019 మధ్యకాలంలో పోలవరం నిర్మాణంపై చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కాఫర్ డ్యామ్లు (అప్పర్, లోయర్) నిర్మాణం పూర్తి కాకున్నా... వాటిని తమ ప్రభుత్వ ఘన విజయాలుగా చాటుకున్నారు. అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానళ్లలో జరిగిన మార్పులు కూడా బాబుగారి డాంబికాలకు అద్దం పట్టే నిర్ణయాలే.మూల లంక ప్రాంతంలో డంప్ యార్డ్ కోసం ఏడాదికి రెండు పంటలు పండే సుమారు 200 ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడమే కాకుండా.. బాధితులకు పరిహారం సైతం చెల్లించలేదు.తొలి పర్యటన నుంచి పక్కా ప్రణాళికతో..2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా 2019 జూన్ 20న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయడం, ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, సమాంతరంగా నిర్వాసితులకు పునరావాసం, కాఫర్ డ్యామ్ల మధ్య ఈసీఆర్ఎఫ్ను చేపట్టి వరదలోనూ పనులు కొనసాగించడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు.ఆలోగా కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాలు, డిస్ట్రిబ్యూటరీల పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ సర్కారు నామినేషన్ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన పనులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రచార్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ 2020 ఫిబ్రవరి 28, డిసెంబర్ 14న క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఎంత పెద్ద వరద వచ్చినా తట్టుకునేలా..!పోలవరం ప్రాజెక్టును గత సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ఖజానా నుంచే ఇచ్చి, మరొకవైపు నిర్వాసితులకు పునరావసం కల్పించారు. కరోనా కష్టకాలంలోనూ రికార్డు సమయంలో స్పిల్ వే ను పూర్తి చేశారు. సీడబ్యూసీ మార్గదర్శకాల మేరకు దెబ్బతిన్న పనులు సైతం చేపట్టారు.గతేడాది జూలైలో ఎంత పెద్ద వరద వచ్చినా తట్టుకునేలా ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును 44 మీటర్లకు పెంచడంతో పాటు దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశారు.
![TEAMS QUALIFIED FOR THE T20 WORLD CUP IN 2026](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/Untitled-11_4.jpg.webp?itok=FrLTCQf4)
2026 టీ20 వరల్డ్కప్కు అర్హత సాధించిన జట్లు ఇవే..!
భారత్, శ్రీలంక వేదికగా 2026లో జరిగే టీ20 వరల్డ్కప్ అర్హత సాధించే జట్లేవో తేలిపోయాయి. 2026 టీ20 వరల్డ్కప్ కూడా ప్రస్తుత ఎడిషన్ (2024) లాగే 20 జట్లతో జరుగుతుంది. ఇందులో 12 జట్లు నేరుగా అర్హత సాధించనుండగా.. మిగతా ఎనిమిది బెర్త్లు వివిధ రీజియనల్ పోటీల ద్వారా ఖరారు కానున్నాయి.ప్రస్తుతం జరుగుతున్న 2024 ఎడిషన్లో సూపర్-8కు అర్హత సాధించిన జట్లు (భారత్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్) నేరుగా తదుపరి ఎడిషన్కు అర్హత సాధించనుండగా.. ఆతిథ్య దేశ హోదాలో శ్రీలంక తొమ్మిదో జట్టుగా ప్రపంచకప్కు అర్హత సాధిస్తుంది.మిగతా మూడు స్థానాలు జూన్ 30, 2024 నాటి ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయించబడతాయి. ప్రస్తుతం వరల్డ్కప్ నడుస్తుండటంతో ఈ టోర్నీ ఫలితాలు ర్యాంకింగ్స్ను ప్రభావితం చేయవు కాబట్టి ప్రస్తుతమున్న ర్యాంకింగ్సే జూన్ 30 వరకు యధాతథంగా కొనసాగుతాయి. ప్రస్తుతం ర్యాంకింగ్స్లో భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ వరుసగా ఒకటి నుంచి పదకొండు స్థానాల్లో ఉన్నాయి.ఈ లెక్కన చూస్తే.. ప్రస్తుత వరల్డ్కప్లో సూపర్-8కు చేరకుండా నిష్క్రమించిన న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ తదుపరి వరల్డ్కప్కు అర్హత సాధించే 10, 11, 12 జట్లవుతాయి. ఓవరాల్గా 2026 టీ20 వరల్డ్కప్కు భారత్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లు అర్హత సాధిస్తాయి. మిగతా ఎనిమిది బెర్త్లు క్వాలిఫయర్ పోటీల ద్వారా నిర్ణయించబడతాయి.
![Israel Dissolves War Cabinet](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/netanyahu.jpg.webp?itok=PtXP1xBM)
నెతన్యాహు సంచలన నిర్ణయం.. ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ రద్దు
జెరూసలెం: హమాస్ లక్ష్యంగా గాజాపై గత కొంత కాలంగా భీకర యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధ నిర్ణయాల్లో కీలకమైన వార్ క్యాబినెట్ను రద్దు చేసింది. దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వార్ క్యాబినెట్ను రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేతలు బెన్నీ గాంట్జ్, గాడీ ఐసెన్కోట్ వార్ క్యాబినెట్ కమిటీ నుంచి ఇటీవల బయటకు వచ్చిన నేపథ్యంలో దానిని రద్దు చేయడం గమనార్హం. గత ఏడాది అక్టోబరు 6న ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపుదాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్పై పాలస్తీనాలోని గాజాపై భీకర దాడులకు దిగింది. హమాస్తో యుద్ధంలో కాల్పుల విరమణకు నెతన్యాహు సముఖంగా లేకపోవడం పట్ల అసంతృప్తితోనే వార్ క్యాబినెట్ నుంచి ప్రతిపక్షనేతలు బయటికి వచ్చినట్లు సమాచారం.
![Ksr Comments On The Chances Of YSRCP Coming Back To Power In Politics](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/YSRCP_Good_Days.jpg.webp?itok=28X8H8Nt)
వైఎస్సార్సీపీ బౌన్స్ బ్యాక్ వెరీ సూన్!
వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అనూహ్యంగా ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకుంటున్నారు. ఆయన తిరిగి రాజకీయ కార్యకలాపాలను ఆరంభించారు. ఆయా వర్గాల వారిని కలుస్తున్నారు. పార్టీ నేతలతో సంభాషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వేర్వేరుగా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాలలో పార్టీకి ఎదురైన ఓటమి నుంచి కోలుకుని, మళ్లీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే విషయమై చర్చిస్తున్నారు. తాను కచ్చితంగా ప్రజలలో తిరుగుతానని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా క్యాడర్ కు భరోసా ఇచ్చేది అవుతుంది.టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వారికి ధైర్యం చెప్పే విధంగా తాను టూర్ చేస్తానని ప్రకటించారు. ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలో తిరగడం మొదలు పెడితే పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల హింసాయుత ఘటనలు జరిగాయి. వాటిలో వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. కొద్ది మంది మరణించారు. ఓటమిని భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీవారి ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు. వారి కోసం ఇప్పటికే జిల్లా వారీగా లీగల్ టీమ్ లు ఏర్పాటుచేశారు. నేతలతో కమిటీలు ఏర్పాటు చేసి ఆయా చోట్ల పర్యటించాలని కోరారు. తదుపరి తానే స్వయంగా వెళ్లి పరామర్శించబోతున్నారు.ఏ రాజకీయ పార్టీ నేత అయినా ఇదే పని చేయాలి. గతంలో వ్యక్తిగత కారణాలతో ఎక్కడైనా గొడవ జరిగి, టీడీపీ వ్యక్తి ఎవరైనా గాయపడినా, మరణించినా చంద్రబాబు దానిని రాజకీయం చేసి, అక్కడకు పరామర్శ యాత్ర చేపట్టేవారు. అదంతా టీడీపీ మీడియాలో విస్తారంగా ప్రచారం అవుతుండేది. ఈ రకంగా ఐదేళ్లపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి కలిపి దుష్ప్రచారం చేశారు. ఎలాగైతేనేం అధికారం సంపాదించారు. టీడీపీ వారు దానిని సద్వినియోగం పరచుకోవడం మాని వైఎస్సార్సీపీ వారిపై కక్ష సాధింపునకు వాడుకుంటున్నారు. టీడీపీ క్యాడర్ యధేచ్చగా హింసాకాండకు పాల్పడడానికి చంద్రబాబు వంటి పెద్ద నేతలు కూడా ప్రోత్సహం ఇవ్వడం దురదృష్టకరం.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీవారిలో విశ్వాసం పెంపొందిచడానికి చర్యలు చేపట్టారు. వైఎస్సార్సీపీకు భవిష్యత్తు ఉందని ఆయన చెబుతూ ఆత్మ స్థైర్యం కోల్పోవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది వాస్తవం. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. ఆ మాటకు వస్తే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1989-94, 2004-2014, 2019-2024 టరమ్ లలో అధికారంలో లేదు. ప్రతిపక్షంగానే ఉంది. అయినా పార్టీ నిలబడింది. తిరిగి పవర్ లోకి వచ్చింది. అబద్ధాలతో వచ్చిందా? లేక కొందరు అనుమానిస్తున్నట్లు ఈవీఎం మోసాలతో వచ్చిందా? అనేది వేరే విషయం. కానీ పార్టీ ఏర్పడిన తర్వాత నాలుగు దశాబ్దాలలో రెండు దశాబ్దాలపాటు అధికారంలో లేదన్న సంగతి గుర్తుంచుకోవాలి.అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించినప్పుడు దాదాపు ఒంటరిగానే రాజకీయం ఆరంభించారు. ఆ తర్వాత 2014లో అధికారం సాధించలేకపోయినా, నిత్యం ప్రజలతో మమేకమయి 2019లో ప్రభుత్వంలోకి వచ్చారు. కనుక ప్రతిపక్షంలో ఉండడం వైఎస్సార్సీపీకి కూడా కొత్త కాదు. కాకపోతే ఒక్కసారిగా ఓటమిని ఊహించని క్యాడర్ కు కాస్త ధైర్యాన్ని ఇచ్చి ప్రజలలో పనిచేసేలా వ్యూహం రచించుకోవాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలిపెట్టకుండా ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం విపక్షానికి ఉంటుంది. దానిని వినియోగించుకోగలగాలి.ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆయన ప్రభుత్వం నడుపుతున్నప్పుడు చెప్పిన హామీలను నెరవేర్చి ఒక విశ్వసనీయత కలిగిన నేతగా పేరొందారు. అంతవరకు వాస్తవం. ఓటమికి పలు ఇతర కారణాలు ఉండవచ్చు. కానీ చాలా వరకు మాట మీద నిలబడే వ్యక్తిగా జగన్ నిలబడిపోతారు. దానినే ఆయన ప్రస్తావించి మనపట్ల విశ్వసనీయత బతికే ఉందని అన్నారు. అర్హతే ప్రమాణికంగా కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా స్కీములు అమలు చేసిన చరిత్ర తమది అయితే, కూటమికి ఓటేయలేదనే ఏకైక కారణంతో టీడీపీ వారు తెగబడి రాష్ట్రాన్ని రావణాకాష్టంగా మార్చారని ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిరి స్కీముల అమలులో పార్టీ, కులం, మతం వంటివి చూడని నేత మరొకరు లేరంటే అతిశయోక్తికాదు.అయితే అదే విశ్వసనీయత పాయింట్ ఆయనను దెబ్బతీసిందని చెప్పాలి. తన ప్రభుత్వం ఏడాదికి సుమారు డెబ్బైవేల కోట్ల రూపాయల మేర వివిధ స్కీములను అమలు చేస్తున్నందున అదనంగా కొత్త స్కీములు ఇవ్వలేమని, పెన్షన్ లు నాలుగువేల రూపాయలు చేయలేమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మానిఫెస్టో విడుదల సందర్భంగా పేర్కొన్నారు. దానిని జనం పాజిటివ్ గా తీసుకోలేదని అనుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన భారీ హామీల ప్రకటనకు ఆశపడి టీడీపీకి ఓటు వేసినట్లు కనబడుతుంది. దానిని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు. "విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా! లేక కష్టాలు ఎదుర్కుంటూ హూందాగా నిలబడి ముందడుగు వేద్దామా?" అని ప్రశ్నించారు. మాట ప్రకారం నిలబడితేనే మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన నమ్ముతున్నారు.తాత్కాలికంగా ప్రజలు చంద్రబాబు హామీలను నమ్మినా, వాటిని అమలు చేయడం కష్టం కనుక, 2014 టరమ్ లో మాదిరి చంద్రబాబు ప్రభుత్వం ఈసారి కూడా చతికిలపడుతుందని పలువురు భావిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా అదే కావచ్చు. అందుకే నిబ్బరంగా ఉండి పార్టీ కోసం పనిచేయాలని ఆయన అన్నారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీకి అత్యధిక మెజార్టీ ఉన్నందున చంద్రబాబు నాయుడు రకరకాల ప్రలోభాలు పెట్టడమో, లేక తప్పుడు కేసులు పెట్టించడమో చేస్తారని ఆయన అనుమానిస్తున్నారు. దానిని తట్టుకుని నిలబడాలని ఎమ్మెల్సీలను ఆయన కోరారు. దానికి ఎంతమంది కట్టుబడి ఉంటారన్నది కాలమే తేల్చుతుందని చెప్పాలి.ప్రత్యేక హోదా గురించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పేవారు. తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే, కేంద్రంలో ఏ కూటమికి తక్కువ సీట్లు వస్తే, దానికి మద్దతు ఇవ్వడానికి ప్రత్యేక హోదా డిమాండ్ పెడతానని అనేవారు. అప్పట్లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. దాంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితిలో పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి రావడం ప్లస్ పాయింట్. అయినా ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించకపోవడం ఆయన బలహీనత. దానిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగా ఎక్స్ పోజ్ చేశారు. మరో మాట కూడా అన్నారు. ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్నది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. దానికి ప్రతిపక్ష హోదాకు తగినన్ని సీట్లు లేవు. అందువల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు. అంత ఉదారత తెలుగుదేశం పార్టీకి ఉంటుందని ఆశించనవసరం లేదు.1994లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కు ఉమ్మడి ఏపీలో ఇరవైఆరు సీట్లే వచ్చాయి. దీని ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అప్పట్లో కాంగ్రెస్ నేత పి. జనార్ధనరెడ్డి పలుమార్లు డిమాండ్ చేసినా, ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి చంద్రబాబు అంగీకరించలేదు. అలాంటిది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఆ హోదా ఇస్తారని అనుకోనవసరం లేదు. అయితే శాసనమండలిలో వైఎస్సార్సీపీకి బలం ఉన్నంతకాలం ప్రభుత్వంపై గట్టి పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా పార్టీలో పునరుత్తేజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పక తప్పదు. అంతవరకు ఓపిక పడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు వైఎస్సార్సీపీకు భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంటుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
![Pakistan richest beggar who has insurance of Rs 1 crore](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/beggar.jpg.webp?itok=vCiHzqZQ)
ఈ బిచ్చగాడు ఎంత రిచ్ అంటే.. ఏకంగా రూ.కోటి ఇన్సూరెన్స్!
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో ఉండటంతో ప్రజలు నిత్యావసరాల కోసం విపరీతమైన ధరలు చెల్లిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తన రుణాన్ని తీర్చడానికి విదేశాల నుంచి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో ఆ దేశంలో ఓ బిచ్చగాడు ఉన్నాడు. అతని సంపాదన తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..పాకిస్తాన్ అంబానీగా పిలిచే ఈ సంపన్న బిచ్చగాడి చాలా మందికి తెలియకపోవచ్చు. అతని ఆస్తి రూ.కోట్లలో ఉంటుంది. తన పిల్లలను ఖరీదైన పాఠశాలలో చేర్పించడమే కాకుండా కోటి రూపాయలకు బీమా చేయించాడు. పాకిస్థాన్ కు చెందిన ఈ ధనిక బిచ్చగాడి పేరు షౌకత్ అని పాకిస్థాన్ లోని ఏఆర్వై వార్తా కేంద్రం తెలిపింది.పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ముల్తాన్ నగరంలో నివసిస్తున్నాడు ఈ రిచెస్ట్ బిచ్చగాడు. 2021 అక్టోబర్లో షౌకత్ బ్యాంకు ఖాతాలో 1.7 మిలియన్లు ఉన్నాయని పాకిస్తాన్ టాప్ ట్యాక్స్ కలెక్టింగ్ ఏజెన్సీ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎప్బీఆర్) నివేదించింది. ఇతను రోజుకు రూ.1000 కి తక్కువ కాకుండా అడుక్కుంటాడు. షౌకత్ పిల్లలు పాకిస్తాన్లోని ముల్తాన్ సిటీలోని అత్యంత ఖరీదైన పాఠశాలలో చదువుతున్నారు. ఈ సంపన్న యాచకుడు కోటి పాకిస్థానీ రూపాయలకు తన పిల్లలకు బీమా చేయించాడు. అంతేకాకుండా తన ఆర్థిక స్థితిగతులపై తరచూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటాడు.
![Vijay Sethupathi Opens Up About Rejecting Pushpa Movie](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/Vijay-Sethupathi-Movie-01.jpg.webp?itok=gxNC-neO)
సీరియస్గా ప్రయత్నించా.. ఎవరూ ఛాన్సివ్వలేదు: సేతుపతి
మహారాజ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్న విషయం చాలామందికి తెలియదు. కొన్ని ప్రమోషన్లు చేసినా అందరికీ అది రీచవలేదు. అసలు మహారాజ సినిమా ఏంటి? ఇదెప్పుడు తీశారు? అని చాలామంది అనుకున్నారు. అయితే రిలీజైన రోజే ఈ సినిమా పేరు మార్మోగిపోయింది. మౌత్టాక్తోనే మహారాజ గురించి అందరికీ తెలిసొచ్చింది. విజయ్ సేతుపతి నటన, నితిలన్ సామినాథన్ డైరెక్షన్, అజనీష్ లోకనాథ్ బీజీఎమ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఏ రోజుకారోజు వసూళ్లు పెంచుకుంటూ సూపర్ హిట్ దిశగా ముందుకు సాగుతోంది.రామ్చరణ్ సినిమాలో?జూన్ 14న ఈ ద్విభాషా(తమిళ, తెలుగు) చిత్రం రిలీజవగా.. సోమవారం నాడు చిత్రయూనిట్ హైదరాబాద్లో థాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సేతుపతి ఓపికగా సమాధానాలిచ్చాడు. బుచ్చిబాబు-చరణ్(#RC16) మూవీలో ఏదైనా పాత్ర చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు లేదని బదులిచ్చాడు. ఎటువంటి పాత్రలు పోషించడం ఇష్టమన్న క్వశ్చన్కు రొమాంటిక్ పాత్రలు చేయడం ఎక్కువ ఇష్టమన్నాడు.సీరియస్గా ట్రై చేశా..సైరా తర్వాత ఉప్పెన వరకు గ్యాప్ తీసుకున్నారు.. అలాగే పుష్ప సినిమా రిజెక్ట్ చేశారా? అన్న ప్రశ్నకు సేతుపతి స్పందిస్తూ.. నేను సీరియస్గా ప్రయత్నించాను సర్, కానీ నాకు ఎవరూ అవకాశాలివ్వలేదు. పుష్ప మూవీలో ఛాన్స్ నేను రిజెక్ట్ చేయలేదు. అయితే అన్నిసార్లు నిజాలే మాట్లాడకూడదు. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పడం మంచిది అని పేర్కొన్నాడు.ఎప్పుడో చెప్పిన సేతుపతికాగా పుష్ప 1 షూటింగ్కు ముందే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై 2020వ సంవత్సరంలోనే సేతుపతి క్లారిటీ ఇచ్చాడు. పుష్పలో భాగం కావాలని ఉన్నప్పటికీ డేట్స్ కుదరకపోవడం వల్లే ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నాడు. దర్శకుడు సుకుమార్ను కలిసి మరీ తన నిర్ణయాన్ని తెలిపినట్లు వెల్లడించాడు.చదవండి: పవిత్రకు ఇంత పెద్ద కూతురు ఉందా?.. మొదటి భర్త ఎవరో తెలుసా?
తప్పక చదవండి
- టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్..?
- మారని చంద్రబాబు తీరు.. పోలవరం కట్టుకథలపై వైఎస్సాఆర్సీపీ కౌంటర్
- ఢిల్లీ ఎయిర్పోర్టులో పవర్ కట్స్
- కెప్టెన్సీకి గుడ్ బై?.. బాబర్ ఆజం ఘాటు స్పందన
- ఖైరతాబాద్ గణేశ్.. ఈసారి 70 అడుగుల ఎత్తు
- అదరగొడుతున్న హారర్ మూవీ.. రూ.50 కోట్లు దాటేసింది!
- స్టార్ హీరోయిన్ కోసం చెరువులో దూకిన అభిమాని.. ఆ తర్వాత!
- అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ : అనంత్ లవ్ లెటర్ను గమనించారా?
- తల్లి కాటికి.. తండ్రి కటకటాలకు...!
- ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..
సినిమా
![Raviteja Mister Bachchan ShowReel Out Now](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/raviteja.jpg.webp?itok=JovCHpfM)
'మిస్టర్ బచ్చన్' నుంచి రవితేజ షో రీల్ విడుదల
టాలీవుడ్ మాస్మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'మిస్టర్ బచ్చన్'. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు రాబోయే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.బాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్న 'రైడ్' చిత్రానికి రీమేక్గా 'మిస్టర్ బచ్చన్' తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి షో రీల్ విడుదలైంది. రవితేజ ఎనర్జిటిక్గా ఈ చిత్రంలో కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీలోనూ ఆయన అమితాబ్ ఫ్యాన్గా కనిపించనున్నారని తెలుస్తోంది. షూటింగ్ కార్యక్రమం ఇప్పటికే పూర్తి కావడంతో త్వరలో ప్రచార కార్యక్రమాలను మేకర్స్ ప్రారంభించనున్నారు.ఈ సినిమా విడుదలకు ముందే రవితేజ తన 75వ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాతో రచయిత భాను భోగవరపును దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీలీల మరోసారి రవితేజతో జోడీగా కనిపించనుంది. షూటింగ్ కార్యక్రమాన్ని కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే.
![Janhvi Kapoor Team Clarity On Repost of Obscene Photos On X](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/jan.jpg.webp?itok=NKVqkHRV)
సోషల్ మీడియా ఖాతాలో అశ్లీల చిత్రాలు.. హీరోయిన్ టీం క్లారిటీ!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో రాజ్కుమార్ రావు సరసన నటించింది. మే 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. అయితే ప్రస్తుతం జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్తో కలిసి దేవర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే .తాజాగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్లో ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటోంది. అయితే ఊహించని విధంగా జాన్వీ కపూర్ తన ఎక్స్ ఖాతాలో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసినట్లు కనిపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకింగ్కు గురయ్యారు. అయితే ఇది గమనించిన జాన్వీకపూర్ టీమ్ ఆ పోస్టులపై క్లారిటీ ఇచ్చింది.అసలు జాన్వీకపూర్కు ఎక్స్లో అకౌంట్ లేదని తెలిపారు. జాన్వీ కపూర్ పేరుతో ఉన్న ఫ్యాన్ అకౌంట్గా గుర్తించారు. ఆమె పేరుతో ఖాతా ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఫ్యాన్ అకౌంట్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాన్వీకపూర్ ప్రతినిధి సూచించారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఎవరి పేరుతోనైనా ఖాతాను సృష్టించడం చాలా సులభమని.. జాన్వీ కపూర్కు ఎక్స్లో ఎలాంటి అధికారిక ఖాతా లేదని స్పష్టం చేశారు. కాగా.. జాన్వీ జూనియర్ ఎన్టీఆర్తో కలిసి దేవరలో కనిపించనుంది. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కించనున్న రామ్ చరణ్ చిత్రంలో నటించనుంది.
![Munjya Movie Crosses Rs 50 Crore Mark](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/munjya1.jpg.webp?itok=aB7RXJvm)
అదరగొడుతున్న హారర్ మూవీ.. రూ.50 కోట్లు దాటేసింది!
ఎండాకాలం అయిపోయింది. సమ్మర్లో బ్లాక్బస్టర్ కొట్టిన సినిమాలంటూ పెద్దగా ఏవీ లేవు. ఇంతలోనే వర్షాకాలం మొదలైంది. మిస్టర్ అండ్ మిసెస్ మహి, చందూ చాంపియన్, ముంజా వంటి కొత్త సినిమాలు బాలీవుడ్లో రిలీజయ్యాయి. వాటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ముంజా. ఈ మూవీ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మోనా సింగ్, శార్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెడుతూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. రెండు వారాల్లోనే రూ.55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మ్యాడ్డాక్ సూపర్నేచురల్ యూనివర్స్లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. త్వరలోనే ఈ యూనివర్స్లో స్త్రీ 2 ఐదో సినిమాగా రాబోతోంది. ఇకపోతే ఈ యూనివర్స్లో వచ్చిన ముంజా సినిమాను చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడుతున్నారు. మౌత్టాక్తోనే వసూళ్లు పెరుగుతున్నాయి. ఆదిత్య సర్పోడర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మ్యాడ్డాక్ ఫిలింస్ బ్యానర్ నిర్మించింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్న ఈ చిత్రం జూలైలో ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది.చదవండి: సినిమా ఫ్లాప్ అయితే పార్టీ చేసుకుంటా: రామ్ చరణ్
![Pavithra Gowda's Daughter Khushi Shares FIRST Post After Actress Arrest](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/pa_0.jpg.webp?itok=dF2--0xL)
పవిత్రకు ఇంత పెద్ద కూతురు ఉందా?.. మొదటి భర్త ఎవరో తెలుసా?
ప్రస్తుతం శాండల్వుడ్లో హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ కేసు హాట్టాపిక్గా మారింది. ఓ అభిమాని హత్యకేసులో వీరిద్దరు ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉన్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. వీరిద్దరు గత పదేళ్లుగా సహజీవనంలో ఉన్నట్లు తెలిసింది. పవిత్ర గౌడకు ఓ అభిమాని అశ్లీల సందేశాలు పంపడంతోనే హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా.. నటి పవిత్ర గౌడ గురించి నెటిజన్స్ ఆరా తీయడం మొదలెట్టారు. అసలు ఆమె ఎవరు? ఇంతకీ పవిత్రకు పెళ్లయిందా? దర్శన్తో రిలేషన్లో ఉందా? అని తెలుసుకునేందుకు తెగ వెతికేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నటి పవిత్రకు ఇప్పటికే పెళ్లయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఆమె కూతురు ఖుషిగౌడ చేసిన పోస్ట్ నెట్టింట వైరలైంది. 'నాకు అన్ని నువ్వే.. హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ ఆమె కూతురు ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పవిత్ర 18 ఏళ్ల వయస్సులోనే సంజయ్ సింగ్ను వివాహం చేసుకుంది. వీరిద్దరి ఖుషీ అనే కూతురు ఉంది. ఆ తర్వాత సంజయ్ సింగ్తో పవిత్ర గౌడ విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పదేళ్లుగా దర్శన్తో రిలేషన్లో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే దర్శన్తో ఉన్న రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. కాగా.. పవిత్ర కన్నడ సినీ పరిశ్రమలో 2013 కామెడీ చిత్రం చత్రిగలు సార్ చత్రిగలుతో అరంగేట్రం చేసింది. 2016లో తమిళ థ్రిల్లర్ మూవీ 54321లో నటించింది. View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithragowda777_official)
ఫొటోలు
![Saurabh Netravalkar and Devi Snigdha Muppala Photos Goes Viral](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/SaurabhNetravalkar-DeviSnigdhaMuppala-01_0.jpg.webp?itok=_IB1m8RR)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/SaurabhNetravalkar-DeviSnigdhaMuppala-01_0.jpg.webp?itok=_IB1m8RR)
ఇద్దరూ టెకీలే: క్రికెటర్ సౌరభ్ నేత్రావల్కర్ భార్య గురించి తెలుసా? (ఫొటోలు)
![Most Beautiful South Indian Actresses In 2024](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Best-South-Indian-Actresses.jpg.webp?itok=Gd-ECei1)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Best-South-Indian-Actresses.jpg.webp?itok=Gd-ECei1)
ఈ సౌత్ ఇండియన్ భామలపై ఓ లుక్కేసుకోండి! (ఫొటోలు)
![Photos Of Bangarraju Movie Heroine Daksha Nagarkar Killing Looks](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Daksha-Nagarkar.jpg.webp?itok=BkrsZ201)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Daksha-Nagarkar.jpg.webp?itok=BkrsZ201)
'బంగార్రాజు' బ్యూటీ కిల్లింగ్ లుక్స్.. చూస్తే అంతే! (ఫొటోలు)
![Seerat Kapoor Shines Like A Queen In Red Saree](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Seerat-Kapoor.jpg.webp?itok=M22N3H5A)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Seerat-Kapoor.jpg.webp?itok=M22N3H5A)
Seerat Kapoor: ఎర్ర చీరలో రాణిలా వెలిగిపోతున్న హీరోయిన్ (ఫోటోలు)
![Kanchanjunga Express collided with a goods train photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Kanchanjungha%20Express%20collided%20with%20a%20goods%20train%20photos-%20%281%29.jpg.webp?itok=OO3u92SB)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Kanchanjungha%20Express%20collided%20with%20a%20goods%20train%20photos-%20%281%29.jpg.webp?itok=OO3u92SB)
బెంగాల్ రైలు ప్రమాద దుర్ఘటన (ఫొటోలు)
క్రీడలు
![Joe Burns Becomes The Sixth Player To Score Century For Two Countries In International Cricket](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/Untitled-13_1.jpg.webp?itok=wU9I5snn)
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్
ఆస్ట్రేలియా మాజీ ఓపెనింగ్ బ్యాటర్ జో బర్న్స్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో రెండు దేశాల తరఫున సెంచరీలు (ఆస్ట్రేలియా, ఇటలీ) చేసిన ఆరో ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. ఆస్ట్రేలియా నుంచి ఇటీవలే ఇటలీకి వలస వెళ్లిన బర్న్స్.. టీ20 వరల్డ్కప్ 2026 యూరోపియన్ క్వాలిఫయర్లో భాగంగా రొమేనియాతో జరిగిన మ్యాచ్లో సెంచరీతో మెరిశాడు.ఈ మ్యాచ్లో 55 బంతులు ఎదుర్కొన్న బర్న్స్ 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. బర్న్స్ శతక్కొట్టుడుతో పాటు జస్టిన్ మోస్కా (30 బంతుల్లో 72; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 244 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రొమేనియా 17.4 ఓవర్లలో 84 పరుగులకే చాపచుట్టేసి 160 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.అంతర్జాతీయ క్రికెట్లో రెండు దేశాల తరఫున సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..కెప్లెర్ వెసెల్స్- ఆస్ట్రేలియా (5 సెంచరీలు), సౌతాఫ్రికా (2 సెంచరీలు)ఇయాన్ మోర్గాన్- ఐర్లాండ్ (1), ఇంగ్లండ్ (15)ఎడ్ జాయ్స్- ఐర్లాండ్ (5), ఇంగ్లండ్ (1)గ్యారీ బ్యాలెన్స్- ఇంగ్లండ్ (4), జింబాబ్వే (1)మార్క్ చాప్మన్- హాంగ్కాంగ్ (1), న్యూజిలాండ్ (2)జో బర్న్స్- ఇంగ్లండ్ (4), ఇటలీ (1)
![TEAMS QUALIFIED FOR THE T20 WORLD CUP IN 2026](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/Untitled-11_4.jpg.webp?itok=FrLTCQf4)
2026 టీ20 వరల్డ్కప్కు అర్హత సాధించిన జట్లు ఇవే..!
భారత్, శ్రీలంక వేదికగా 2026లో జరిగే టీ20 వరల్డ్కప్ అర్హత సాధించే జట్లేవో తేలిపోయాయి. 2026 టీ20 వరల్డ్కప్ కూడా ప్రస్తుత ఎడిషన్ (2024) లాగే 20 జట్లతో జరుగుతుంది. ఇందులో 12 జట్లు నేరుగా అర్హత సాధించనుండగా.. మిగతా ఎనిమిది బెర్త్లు వివిధ రీజియనల్ పోటీల ద్వారా ఖరారు కానున్నాయి.ప్రస్తుతం జరుగుతున్న 2024 ఎడిషన్లో సూపర్-8కు అర్హత సాధించిన జట్లు (భారత్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్) నేరుగా తదుపరి ఎడిషన్కు అర్హత సాధించనుండగా.. ఆతిథ్య దేశ హోదాలో శ్రీలంక తొమ్మిదో జట్టుగా ప్రపంచకప్కు అర్హత సాధిస్తుంది.మిగతా మూడు స్థానాలు జూన్ 30, 2024 నాటి ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయించబడతాయి. ప్రస్తుతం వరల్డ్కప్ నడుస్తుండటంతో ఈ టోర్నీ ఫలితాలు ర్యాంకింగ్స్ను ప్రభావితం చేయవు కాబట్టి ప్రస్తుతమున్న ర్యాంకింగ్సే జూన్ 30 వరకు యధాతథంగా కొనసాగుతాయి. ప్రస్తుతం ర్యాంకింగ్స్లో భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ వరుసగా ఒకటి నుంచి పదకొండు స్థానాల్లో ఉన్నాయి.ఈ లెక్కన చూస్తే.. ప్రస్తుత వరల్డ్కప్లో సూపర్-8కు చేరకుండా నిష్క్రమించిన న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ తదుపరి వరల్డ్కప్కు అర్హత సాధించే 10, 11, 12 జట్లవుతాయి. ఓవరాల్గా 2026 టీ20 వరల్డ్కప్కు భారత్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లు అర్హత సాధిస్తాయి. మిగతా ఎనిమిది బెర్త్లు క్వాలిఫయర్ పోటీల ద్వారా నిర్ణయించబడతాయి.
![Jonty Rhodes To Be Team India Next Fielding Coach Says Reports](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/Untitled-9_2.jpg.webp?itok=NdimQbiM)
టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్..?
టీమిండియా తదుపరి ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్ ఎంపిక కాబోతున్నాడన్న వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో అతని కోచింగ్ బృందంలోని సభ్యులను కూడా మారుస్తారన్న ప్రచారం జరుగుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు తదుపరి ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాహుల్ బృందంలో ఫీల్డింగ్ కోచ్గా టి దిలీప్ ఉన్నాడు. ఒకవేళ ద్రవిడ్తో పాటు అతని సహాయ బృందం మొత్తం తప్పుకుంటే.. బీసీసీఐ కొత్త కోచింగ్ టీమ్ను ఎంపిక చేయాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, టీమిండియా తదుపరి హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల (జూన్) చివరి వారంలో గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తన సపోర్టింగ్ స్టాఫ్ ఎంచుకునే విషయంలో గంభీర్ పూర్తి స్వేచ్చను ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు సమాచారం. ఇందులో భాగంగా గంభీరే రోడ్స్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. గంభీర్, రోడ్స్ 2022, 2023 ఐపీఎల్ సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్కు సేవలందించారు. గంభీర్ మెంటార్, రోడ్స్ ఫీల్డింగ్ కోచ్గా లక్నో ఫ్రాంచైజీకి పని చేశారు. కోచ్గా తొలిసారి..గంభీర్ భారత ఫుల్టైమ్ హెడ్ కోచ్గా నియమితుడైతే ఇదే అతనికి హెడ్ కోచ్గా మొదటి బాధ్యత అవుతుంది. గంభీర్ గతంలో ఏ జట్టుకు ఫుల్టైమ్ హెడ్ కోచ్గా పని చేయలేదు. అయితే అతను మూడు సీజన్ల పాటు ఐపీఎల్లో మెంటార్గా వ్యవహరించాడు. 2022, 2023లో లక్నోతో.. 2024లో కేకేఆర్కు మెంటార్గా పని చేశాడు. గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టడంతో గంభీర్ పేరు టీమిండియా హెడ్ కోచ్ రేసులో ప్రధానంగా వినిపిస్తుంది.
![Indian Tennis Star Sumit Nagal Attains Career High ATP Ranking Of 71](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/sumit2.jpg.webp?itok=tr26NhwS)
సుమిత్ నగాల్ సంచలనం.. అత్యుత్తమ ర్యాంకు
భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు అందుకున్నాడు. తాజాగా ప్రకటించిన ఏటీపీ మెన్స్ సింగిల్స్ ర్యాంకింగ్స్లో 71వ స్థానంలో నిలిచాడు.గత వారంలో కెరీర్ బెస్ట్ 77వ ర్యాంకు సాధించిన సుమిత్.. తాజాగా ఆరు స్థానాలు ఎగబాకి సత్తా చాటాడు. పెరూగియా ఓపెన్ ఏటీపీ –125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీ ఫైనల్లో రన్నరప్గా నిలిచి.. మొత్తంగా 777 ఏటీపీ పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.కాగా హర్యానాకు చెందిన 26 ఏళ్ల సుమిత్ నగాల్... ఇప్పటికే సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ప్యారిస్ ఒలింపిక్స్-2024కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెనర్లో రెండో రౌండ్కు అర్హత సాధించిన చరిత్ర సృష్టించిన సుమిత్ నగాల్.. ఫ్రెంచ్ ఓపెన్లో మాత్రం తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. భారత నంబర్ వన్గా ఉన్న సుమిత్ నగాల్.. ఇటీవల హీల్బ్రాన్ నెకార్కప్-2024 మెన్స్ సింగిల్ టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత చెన్నై ఓపెన్లోనూ విజయం సాధించాడు. ఈ క్రమంలో ఇలా కెరీర్ బెస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు.చదవండి: T20 WC: రిటైర్మెంట్ ప్రకటించిన వెటరన్ క్రికెటర్
బిజినెస్
![today gold rates on commodity market in main cities in the country](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/gold01.jpg.webp?itok=ebGvWORj)
తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..?
ఈక్విటీమార్కెట్లు ఇటీవల కాలంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దాంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో సోమవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,300 (22 క్యారెట్స్), రూ.72,330 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఆదివారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.220, రూ.220 తగ్గింది.చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.150, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.170 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.66,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.72,980 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,450.. 24 క్యారెట్ల ధర రూ.72,480కు చేరాయి. మార్కెట్లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.95,600 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
![instructions for filling the particulars in Income tax Return about forms](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/itr01.jpg.webp?itok=WnVhD_SB)
ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా.. ఏ ఫారం ఎవరికంటే..
పన్ను రిటర్నులు దాఖలు (ఐటీఆర్)కు జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. సరైన అవగాహన లేకుండా, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఐటీఆర్ ఫైల్ చేయడం కొంచెం కష్టమని పన్ను చెల్లింపుదారులు భావిస్తుంటారు. ఐటీఆర్ గడువు ముగుస్తుంటే కంగారుపడి వాటిని ఎంచుకోవడంలో ఒక్కోసారి పొరపాట్లు చేస్తారు. అలాచేసే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందని గుర్తించాలి. రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేయడం ద్వారా వాటిని సవరించుకోవచ్చు. కానీ, అందుకు అదనంగా సమయం కేటాయించాలి. అది కొంత చికాకు పెట్టే అంశం. అందుకే తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేసినపుడే జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈతరుణంలో రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఎలాంటి ఆదాయాలు ఉన్నవారు ఏయే ఫారాలు ఎంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.సరైన ఫారం ఎంపికఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే పన్నుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీటీటీ) మొత్తం ఏడు రకాల ఫారాలను నోటిఫై చేసింది. వీటిలో పన్నుదారులు వారి ఆదాయమార్గాలకు అనుగుణంగా ఏది సరైందో చూసి ఎంచుకోవాలి. కొత్త పన్ను శ్లాబును ఎంచుకున్నవారి వేతనం రూ.7.5లక్షల కంటే ఎక్కువ వార్షిక వేతనం ఉండి, ఒక ఇంటిపై ఆదాయం, వడ్డీ, వ్యవసాయ రాబడి రూ.5000 కంటే తక్కువ..వంటి తదితర మార్గాల్లో అదనంగా ఆదాయం వస్తున్నప్పుడు ఐటీఆర్-1 దాఖలు చేయొచ్చు.ఐటీఆర్-2వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలకు చెందిన పన్నుదారులు దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి.ఒకటికంటే ఎక్కువ ఇళ్లు ఉన్నవారు ఎంచుకోవాలి.ఎలాంటి వ్యాపార ఆదాయం ఉండకూడదు.వ్యవసాయ ఆదాయం ఎంతైనా ఉండవచ్చు. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లిస్తుండాలి.ఐటీఆర్ 3వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థల్లో భాగస్వామ్యం కలిగిఉన్న పన్నుదారులు ఈ ఫారం దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉండాలి.వ్యాపార ఆదాయం ఉండవచ్చు.వ్యవసాయ ఆదాయం ఎంతైనా ఉండవచ్చు. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లిస్తుండాలి.ఐటీఆర్-4వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థల్లో భాగస్వామ్యం కలిగిఉన్న పన్నుదారులు ఈ ఫారం దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి.ఒక ఇల్లు మాత్రమే ఉండాలి.వ్యాపార ఆదాయం ఉండవచ్చు. కానీ మీ మొత్తం ఆదాయంలో బిజినెస్ టర్నోవర్ 8 శాతానికి మించి ఉండకూడదు.వ్యవసాయ ఆదాయం రూ.5000లోపు ఉండాలి. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లించకూడదు.ఇదీ చదవండి: పన్నుదారులు తెలుసుకోవాల్సినవి..ఐటీఆర్-5ఒకరికంటే ఎక్కువమంది కలిసి ఏదైనా వ్యాపారంసాగిస్తే ఈ ఫారం దాఖలు చేయవచ్చు.ఎలాంటి వేతన ఆదాయం ఉండకూడదు.ఒకటికంటే ఎక్కువ ఇళ్లు ఉండవచ్చు.వ్యాపార ఆదాయం ఉండాలి.ఇతరమార్గాల ద్వారా ఆదాయం ఉండవచ్చు.కంపెనీలు దాఖలు చేసే ఫారం ఐటీఆర్-6. ఐటీఆర్ 7 ఫారాన్ని ట్రస్టులు అవి చెల్లించిన ఆదాయాన్ని రిటర్ను చేసుకోవడానికి దాఖలు చేస్తాయి.
![Complete Analysis On Form 26 Tax Audit](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/itit.jpg.webp?itok=wRab2df4)
ఎంట్రీలు పడుతున్నాయ్.. బీ రెడీ!
గతవారం వరకు వరుసగా అన్ని ఐటీఆర్ ఫారాలను గురించి తెలుసుకున్నాం. ఎన్ని ఫారాలు ఉన్నాయి, ఎవరు ఏ ఫారం వేయాలి మొదలైన విషయాలు తెలుసుకున్నాం. ఇక గడువుల విషయం చూస్తే వేతన జీవులు, ట్యాక్స్ ఆడిట్ వర్తించని వారికి గడువు తేదీ 31 జూలై 2024. ఇతరులకు గడువు తేదీ 30–09–2024. ఈ కాలమ్ను ప్రతివారం చదివి అనుసరించే వారికి వచ్చే నెలాఖరు గడువు. ఇప్పుడిప్పుడే అన్ని కార్యాలయాల్లో అధికారులు వారి వారి విధులు నిర్వహించడాన్ని పూర్తి చేస్తున్నారు.అంటే డిస్బర్సింగ్ అధికార్లు, డిడక్టింగ్ అధికార్లు, పన్ను రికవరీ చేయడం, ఆ పన్ను మొత్తాల్ని గవర్నమెంట్ ఖాతాకి చెల్లించడం, ఆ తర్వాత ఫారాలు 16 అలాగే 16 అ తయారు చేసి జారీ చేయడం, టీడీఎస్ రిటర్నులు ఆదాయపు పన్ను శాఖ వారికి దాఖలు చేయడం మొదలైనవి జరుగుతున్నాయి. ఈ అధికార్ల జాబితాలో మీ యాజమాన్యం, బ్యాంకులు, పన్ను రికవరీ చేసే ఇతర అధికార్లు ఉన్నారు. ఆలస్యం కావచ్చు. ఏవో ఇబ్బందులు ఏర్పడవచ్చు.వీటిని ఆధారంగా చేసుకుని డిపార్టుమెంటు వారు తమ సైటులో మీ వివరాలను పొందుపరుస్తారు. వీటినే ఫారం 26 అ, అఐ అంటారు. వీటిలో పద్దులు పడకపోతే, మీరు రిటర్నులు వేయలేరు. అంటే సమాచారం పూర్తిగా లభ్యమవదు. సాధారణంగా ఈ ఫారాల్లోని సమాచారం సంపూర్ణమైనది, సమగ్రమైనది, సరైనది, కచ్చితమైనది, నమ్మతగ్గది. అయితే, తప్పులు సహజం. మీరు, ముందు ఈ రెండింటిలోని ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చెక్ చేయండి.మీకు సంబంధించినది కాకపోతే విభేదించండి. అభ్యంతరాలను తెలియజేయండి. అలా జరిగిన వెంటనే డిపార్టుమెంటు వారు సంబంధిత అధికార్లతో సంప్రదింపులు జరిపి, సరిదిద్దుతారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మీకు రెస్పాన్స్ రాకపోతే, గడువు తేదీలోపల రిటర్ను వేయటం మాత్రం మానేయకండి. ఆ తర్వాతైనా సర్దుబాట్లు జరగవచ్చు. మిస్మ్యాచ్కు మరొక కారణం.. డబుల్ ఎంట్రీ. అంటే ఒక వ్యవహారం రెండు సార్లు నమోదు కావడం. మీరు ఒకదాన్నే పరిగణనలోకి తీసుకోండి.మరీ చిత్రమైన విషయం ఒకటుంది. ఈ మధ్య ఒక కుటుంబంలో ముగ్గురు సభ్యులు వారి ఉమ్మడి ఆస్తిని అమ్మగా ఆ విక్రయాల గురించి ముగ్గురి అఐ లలోనూ ఎంట్రీలు కనబడ్డాయి. ఆస్తి అమ్మకం విలువ రు. 4 కోట్లు. ముగ్గురి ‘సమాచారం’లోనూ రూ. 4 కోట్లు అని పడింది. కానీ, జరిగింది ఒకే లావాదేవీ. దాని విలువ రూ. 4 కోట్లు. ఏ స్థాయిలో ఈ తప్పు జరిగిందో కాని రికార్డుల్లో ఎంట్రీలు మూడింతలు పడ్డాయి. ఇటువంటివి జరిగే అవకాశం ఉంది.అలాగే జాయింటుగా ఉన్న బ్యాంకు అకౌంట్లోకి వచ్చే బ్యాంకు వడ్డీ, దాని మీద వడ్డీ, ఇటువంటి విషయాల్లో తగిన జాగ్రత్త వహించండి. ఎంట్రీల్లోని తప్పులను మీకు అనుకూలంగా మల్చుకోకండి. ఒక సమాచారం ఏదేని అఐ లో పడకపోయినా, దాన్ని ఆసరాగా తీసుకుని ఆ ఆదాయం లేదా వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మర్చిపోకండి. ఈ సంవత్సరం ఫైలింగ్ మొదలెట్టవచ్చు. రెడీ అవ్వండి. – కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు
![India is set to become the 6th country to have its own deep sea mission](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/deepsea01.jpg.webp?itok=tZcIKL4e)
‘డీప్ సీ మిషన్’ కలిగిన ఆరోదేశంగా భారత్
ప్రపంచంలో ప్రత్యేకంగా ‘డీప్ సీ మిషన్’ కలిగిన ఆరోదేశంగా భారత్ అవతరిస్తుందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ అన్నారు. సముద్ర ఉత్పత్తులపై ఆధారపడిన ప్రజల ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేలా భారత్ స్థిరమైన బ్లూఎకానమీపై దృష్టి సారిస్తుందని చెప్పారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ..‘కొత్త ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా డీప్ సీ మిషన్ను విస్తరించాలని భావిస్తోంది. భారత్కు సుదీర్ఘ సముద్ర తీరప్రాంతం ఉంది. జీవనోపాధి కోసం సముద్ర ఉత్పత్తులపై ఆధారపడేవారి ఆర్థికస్థితిగతులను మరింత మెరుగుపరచాలి. స్థిరమైన బ్లూఎనానమీని సాధించేలా కృషి చేయాలి. అందుకోసం సెంట్రల్ ఇన్స్టిట్యూట్లు సహకారం అందించాలి. డీప్ సీ మిషన్ కేవలం సముద్రంలోని ఖనిజాలు అన్వేషించడానికి మాత్రమే పరిమితం కాదు. సముద్రంలోని వైవిధ్యమైన వృక్ష, జంతుజాలాన్ని కనుగొనడానికి ఉపయోగపడాలి. సముద్రంలో 6,000 మీటర్ల లోతున డైవ్ చేయగల ‘మత్స్యయాన్ 6000’ అభివృద్ధి కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ) చేసిన కృషి అభినందనీయం. సముద్రం లోతుకువెళ్లి పరిశోధనలు చేసేందుకు వీలుగా, ఒత్తిడిని తట్టుకునేలా ఇస్రో సహకారంతో ‘టైటానియం హల్’ను అభివృద్ధి చేస్తున్నాం’ అని చెప్పారు.అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి, 72 గంటల పాటు నీటిలో మునిగిఉండేలా అభివృద్ధి చేస్తున్న సెల్ఫ్-ఫ్లోటేషన్ టెక్నాలజీ పురోగతిని ఆయన సమీక్షించారు. డీప్ సీ మిషన్ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: 570 మెగావాట్ల జలవిద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందండీప్ సీ మిషన్భారతదేశ సముద్రజలాల్లోని ఖనిజాలను కనుగొనేందుకు డీప్ సీ మిషన్ను ఏర్పాటు చేశారు. ఎలాంటి సిబ్బంది సహాయం లేకుండా సముద్రగర్భంలోకి వెళ్లి మాంగనీస్ , నికెల్, కోబాల్ట్, కాపర్, ఐరన్ హైడ్రాక్సైడ్ వంటి ఖనిజాలతో కూడిన పాలీమెటాలిక్ పార్టికల్స్ను అన్వేషించి వాటిని వెలికితీసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఖనిజాలను ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ఫోన్లు, బ్యాటరీలు, సోలార్ ప్యానెల్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ ఖనిజాల పరిశోధనతోపాటు వైవిధ్యమైన సముద్ర వృక్ష, జీవజాతులపై పరిశోధనలు జరిగేలా ఈ డీప్ సీ మిషన్ను వినియోగించుకోవాలని తాజాగా మంత్రి సూచిస్తున్నారు.
వీడియోలు
![Big Tiger Hulchul In Nellore District People In Panic](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/ti.jpg.webp?itok=OpSVuiHQ)
![Big Tiger Hulchul In Nellore District People In Panic](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/ti.jpg.webp?itok=OpSVuiHQ)
కారుపై పెద్దపులి దాడి..
![Deputy CM Pawan Kalyan New Chamber in secretariat](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/cm.jpg.webp?itok=I5KwcDRc)
![Deputy CM Pawan Kalyan New Chamber in secretariat](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/cm.jpg.webp?itok=I5KwcDRc)
డిప్యూటీ సీఎం పవన్ ఛాంబర్
![Heavy Rains In Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/rai.jpg.webp?itok=qgKCzpjQ)
![Heavy Rains In Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/rai.jpg.webp?itok=qgKCzpjQ)
హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వాన
![Sanjay Raut Bumper Offer For TDP Chandrababu](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/ch_2.jpg.webp?itok=AxOwBf3y)
![Sanjay Raut Bumper Offer For TDP Chandrababu](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/ch_2.jpg.webp?itok=AxOwBf3y)
టీడీపీకి బంపర్ ఆఫర్..ఈ పదవి బీజేపీకి దక్కితే టీడీపీకే నష్టం..
![TDP Goons Attacks On Penumuru YSRCP Leaders Vijay Kumars House](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/yt.jpg.webp?itok=6aUlUjoC)
![TDP Goons Attacks On Penumuru YSRCP Leaders Vijay Kumars House](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/yt.jpg.webp?itok=6aUlUjoC)
శాంతి వద్దు రక్త పాతమే ముద్దు అంటున్న టీడీపీ నేతలు చంపుతాం అంటూ బెదిరింపులు
![YSRCP Gudivada Amarnath Slams TDP Fake Allegations](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/ra.jpg.webp?itok=ByK6Sdt8)
![YSRCP Gudivada Amarnath Slams TDP Fake Allegations](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/ra.jpg.webp?itok=ByK6Sdt8)
‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్కు ఎలా అంటగడతారు?’
![Political Partys Supported Parents And Students Protest All Over The Country](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/et.jpg.webp?itok=0YaQ6iSv)
![Political Partys Supported Parents And Students Protest All Over The Country](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/et.jpg.webp?itok=0YaQ6iSv)
నీట్ పై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రచ్చ
![YS Jagan To Conduct Meeting With YSRCP MP MLA Candidates](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/ys_5.jpg.webp?itok=6EFsrU5k)
![YS Jagan To Conduct Meeting With YSRCP MP MLA Candidates](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/ys_5.jpg.webp?itok=6EFsrU5k)
అసెంబ్లీ లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో వైఎస్ జగన్ కీలక సమావేశం
![Kanchanjunga Express Train Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/35.png.webp?itok=VPC57gdt)
![Kanchanjunga Express Train Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/35.png.webp?itok=VPC57gdt)
రైలు ప్రమాదంలో 15కు చేరిన మృతుల సంఖ్య
![Vijayawada Dalit Leader Protest Against Bonda Uma Rowdyism](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/34.png.webp?itok=CgHzv7WS)
![Vijayawada Dalit Leader Protest Against Bonda Uma Rowdyism](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/34.png.webp?itok=CgHzv7WS)
బోండా ఉమా కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ దళిత నేత శిరోముండనం..
ఫ్యామిలీ
![Arjuna Tree Bark amazing Benefits and Uses](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/Arjunberadu_benefits.jpg.webp?itok=z4easy72)
అర్జున బెరడు గురించి విన్నారా? దీని ఔషధ గుణాలు తెలిస్తే..!
అర్జున చెట్టు లేదా తెల్ల మద్ది గురించి ఎపుడైనా విన్నారా? ఈ చెట్టు నుంచి తీసిన బెరడులో బోలెడన్ని ఔషధ గుణాలున్నాయి. అర్జున బెరడు తెలుపు, ఎరుపు రంగులను కలగలసి ఉంటుంది. పలు రకాల ఔషధాల తయారీలో దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడతారు. దీని అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.దీని బొటానికల్ పేరు: టెర్మినలియా అర్జున. దీని బెరడు గుండెకు టానిక్గా పనిచేస్తుందట. ఈ చెట్టు గురించిన ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. గుండె జబ్బులు, శ్వాసకోసం వ్యాధులు మొదలు సంతాన లేమి సమస్యలతో బాధపడే పురుషులకు కూడా ఇది దివ్యౌషధంలా పని చేస్తుంది.ఎముకల బలహీనతతో బాధ పడే వారికి అర్జున బెరడుచాలా ఉపయోడపడుతుంది. అర్జున బెరడును మెత్తగా పొడి చేసి, తేనె కలిపి రోజుకు పావు స్పూన్ చొప్పున తీసుకుంటే బలహీనమైన ఎముకలు దృఢంగా మారతాయి. ఫ్యాటీ లివర్ వ్యాధికి చక్కటి పరిష్కారం అర్జున బెరడు.అలాగే వాతావరణం చల్లగా ఉన్నపుడు గోరు వెచ్చటి పాలల్లో అర్జున బెరడు పొడిని అర స్పూన్ చప్పున కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి. ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులకు కూడా మంచి పరిష్కారం ఇది.సంతాన సమస్యలతో బాధ పడే పురుషులు రోజూ అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకోవాలి. దీంతో వీర్య కణాల వృద్ధిచెంది సంతాన భాగ్యం కలిగే అవకాశాలు పెరుగుతాయి.అర్జున బెరడుతో కషాయాన్ని తయారు చేసుకుని తరచూ తీసుకుంటే గుండె పోటు, ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.ధమనులు, సిరల్లో రక్త ప్రవాహాన్ని సాఫీగా జరిగేలా చేస్తుంది. లిపో ప్రోటీన్, ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించి కొలెస్ట్రాల్కు చెక్ పెడుతుంది. కడుపు అల్సర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధక శక్తిని వృద్ది చేస్తుంది. రక్త పోటు స్థాయిలను నియంత్రిస్తుంది. శారీరక ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంకా అర్జున బెరడు పొగాకు, ధూమపానం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది.కణుతుల పెరుగుదలను నియంత్రించడంలోఉపయోగపడుతుంది. అర్జున బెరడులోని విటమిన్ ఈ కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల అర్జున బెరడు తోడ్పడుతుంది.
![Fardeen Khan On His Battle With Depression These Ways Help](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/khan.jpg.webp?itok=q9Pk_Jt_)
డిప్రెషన్తో బాధపడ్డ నటుడు ఫర్దీన్ ఖాన్: బయటపడాలంటే..?
బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత హీరామండితో ఎంట్రీ ఇచ్చారు. అందులో ఆయన వాలీ బిన్ జాయెద్-ఏఐ మహమ్మద్గా నటించి మెప్పించాడు. ఇటీవల ఒక ఇంటర్యూలో తన జీవితంలో ఒకనొక దశలో ఎదుర్కొన్న గడ్డు రోజులు గురించి చెప్పుకొచ్చారు. తాను డిప్రెషన్ గురై బాధపడుతుండే వాడనని, దాని నుంచి బయటపడేందుకు ఎంతలా ప్రయత్నించేవాడినో షేర్ చేసుకున్నారు. దాన్ని మరణం, పునరుద్ధానం మధ్య జరిగే ఒక విధమైన యుద్ధంగా అభివర్ణించారు. నిజానికి డిప్రెషన్ అంత భయంకరమైనదా? ఏం చేస్తే ఈజీగా బయటపడగలం..?ఫర్దీన్ తాను కొన్ని రోజు డిప్రెషన్తో చాల బాధపడ్డానని అన్నారు. ఆ టైంలో రోజుల ఎంత కఠినంగా అనిపిస్తాయంటే.. ప్రతి నిమిషం ఓ యుగంలా ఉంటుందని చెబుతున్నారు ఫర్దీన్. ఆ క్రమంలో ఒక్కోసారిగా పూర్తిగా నిరాశ, నైరాశ్యంలోకి కూరుకుపోయి, ఒంటిరిగా ఉండేందుకు ఇష్టపడతామని అన్నారు. అయితే తాను ఎందుకిలా బాధపడుతున్నానని గంటలు తరబడి ఆలోచిస్తాను, కానీ బయటపడలేకపోయే వాడినని చెప్పారు. ఒక్కోసారి ఒంటరిగా గదిలో కూర్చొని ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుండే వాడనని, ఐతే అదెలా అనేది తెలియక చాలా సతమతమయ్యేవాడనని అన్నారు ఫర్దీన్. చివరికీ ఎలాగైతే దేవుడి దయ వల్ల తన కుటుంబం సహకారంతో ఈ సమస్య నుంచి బయటపడగలిగానని చె ప్పుకొ చ్చారుఎందువల్ల వస్తుందంటే..నిరుత్సాహ పరిచే సంఘటనలు లేదా మనం అనుకున్నట్లు జరగకపోవడం వల్ల లేక తమకు నచ్చనట్లు జరగుతున్నట్లు అనిపించినప్పుడూ ఈ సమస్య ఎదురవ్వుతుంది. కొందరూ లైట్గా తీసుకోగలిగితే, మరికొందరూ మాత్రం నాకే ఎందుకు అని మనసుకి తీసుకుంటారో అక్కడ నుంచి ఓ నీడలా వెంటాడేస్తుంది ఈ డిప్రెషన్. ఎంతలా అంటే మంచి జరిగిన విషయం కూడా చెడ్డగా భయపెట్టేదిగా మారి పూర్తిగా డౌన్ చేసేస్తుంది మనిషిని. అందుకే నటుడు ఫర్దీన్ దీన్ని మనసుతో చేసే కఠినమైన యుద్ధంగా అభివర్ణించాడు. దీన్ని నుంచి బయటపడాలనుకునే వ్యక్తికి మరణంతో సాగిస్తున్న యుద్ధంలా ఉంటుంది. ఇక్కడ ఆ వ్యక్తి మనసులో బయటపడాలని ఎంత బలంగా అనుకుంటే అంత ఈజీగా బయటపడి మనుగడ సాగించగలుగుతాడు. లేదంటే అంతే సంగతులు అని చెబుతున్నారు మానసిక నిపుణులు. బయటపడేందు సింపుల్ మార్గాలు..డిప్రెషన్కి గురయ్యే బాధితుడు వేదనాభరితంగా చెప్పుకుంటున్న అతని గోడుని ఆశాంతం శ్రద్ధగా వినాలి. ఓపికగా వారి వేదనను అర్థం చేసుకుంటున్నామనే భరోసా అందించాలి. సంకోచించకుండా తమ ఆలోచనలు బయటపెట్టే అవకాశం ఇవ్వాలి. అలాగే వారికి మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించేలా ప్రోత్సహిచడం, వారిని ఈ సమస్య నుంచి బయటపడేలా మోటీవేట్ చేస్తూ సలహాలు, సూచనలు ఇవ్వాలి. వారిని ఒంటిరిగా వదిలేయకుండా మేమున్నామనే మద్దతు, భరోసా ఇవ్వాలి. థెరపీ సెషన్లు తీసుకుంటూ రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యేలా చేయాలి. అలాగే దేనివల్ల ఈ సమస్యతో బాధపడుతున్నారో తెలుసుకుని అందుకు తగ్గరీతిలో సాయం అందించి వారిలో భారం దిగేలా చేసి కుదుటపడనీయాలి. ఇలా చేస్తే తనని ప్రేమించేవాళ్లు, ఆదరించే వాళ్లు ఉన్నారనే ధైర్యంతో ఉండగలుగుతారు. పైగా దీనికి బలవ్వకుండా సులభంగా బయటపడతారని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..)
![Have you ever tried these kitchen tips](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/kitchen%20tips.jpg.webp?itok=f-Fg7q4k)
లైఫ్లో మర్చిపోలేని వంటింటి చిట్కాలివిగో!
వంట చేసేటపుడు వంటకు చక్కటి రుచి రావాలన్నా, వంటను సులభంగా పూర్తి చేయాలన్నా, వంట ఇంట్లో పనులను ఈజీగా చక్కబెట్టుకోవాలన్నా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కచ్చితంగా తెలియాలి. అలాంటి వాటిల్లో కొన్నింటిని ఇక్కడ చూద్దాం! బెండకాయలు ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండాలంటే వాటి చివర్లను కట్ చేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఫ్రిజ్లో పెట్టాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు బియ్యంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం పువ్వులా ఉడుకుతుంది.యాలకుల తొడిమలను పొడి చేసి టీ చేసేటప్పుడు చక్కెరతోపాటు అందులో వేయాలి. టీ రుచి అద్భుతంగా, సువాసనగా ఉంటుంది.పూరీలు తెల్లగా రావాలంటే వేయించేటప్పుడు నూనెలో కొన్ని జామ ఆకులు వేయాలి.అప్పడాలు ఎక్కువ నూనె పీల్చకూడదు అనుకుంటే వేయించే ముందు కాసేపు ఎండలో పెట్టాలి.పెరుగు పులిసిపోకుండా ఉండాలంటే చిన్న కొబ్బరి ముక్కలు అందులో వేయండి.బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలోఉంచితే తొందరగా మెత్తబడవు. కూరగాయల్ని, లేదా ఆకుకూరల్ని తరిగే ముందు ఉప్పు, పసుపు వేసిన నీటిలో కడిగితే క్రిములు పైకి తేలతాయ. అపుడు సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.కారంపొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్క ఉంచితే తొందరగా పురుగుపట్టదు.నెయ్యి కాచేటపుడు రెండు లవంగాలుగానీ, తమలపాకు గానీ వేస్తేమంచి వాసన వస్తుంది. పాలు గడ్డగా తోడుకోవాలంటే.. పాలు బాగా మరిగించి, కాస్త వేడిగా ఉండగానే మజ్జిగ లేదా ఉండలులేని పెరుగు వేసి బాగా కలపాలి.అల్లం వెల్లుటి పేస్ట్ తయారు చేసేటపుడు, అల్లం, వెల్లుల్లి పొట్టు తొందరగారావాలంటే నీళ్లలో నానబెడితే మంచిది.ఇడ్లీ, దోసె పిండి, ఎక్కువ రోజులుతాజాగా ఉండాలంటే..పైన రెండు తమలపాకులు వేయండి.
![Most Beautiful South Indian Actresses In 2024](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/17/Best-South-Indian-Actresses.jpg.webp?itok=Gd-ECei1)
ఈ సౌత్ ఇండియన్ భామలపై ఓ లుక్కేసుకోండి! (ఫొటోలు)
న్యూస్ పాడ్కాస్ట్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయొచ్చు, ఎన్నికల్లో వీటిని ఉపయోగించొద్దు... స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పష్టీకరణ... ఈవీఎంలు బ్లాక్బాక్సుల్లాంటివేనన్న రాహుల్ గాంధీ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
మీ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదు, ‘విద్యుత్’ కమిషన్ నుంచి వైదొలగండి.. జస్టిస్ నరసింహారెడ్డికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేద్దాం... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రజాప్రతినిధులకు బిగుస్తున్న ఉచ్చు... ఏసీబీతో పాటు రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం... 24 మందితో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు.. విద్యుత్ రంగ నిర్ణయాల్లో పాత్రపై జారీ చేసినట్లు జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ప్రధాని కార్యాలయం మోదీ పీఎంవో కాదు, అది ప్రజా పీఎంవో అని మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం... 72 మందితో కొలువుదీరిన నూతన మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్కు 3, తెలంగాణకు 2 పదవులు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ప్రధానమంత్రిగా నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గం కూర్పుపై కొనసాగుతున్న కసరత్తుతి.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
![FSSAI suspends licence of Fortune Dairy after human finger found in ice cream](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/icecream-humanfinger.jpg.webp?itok=psUiMHq3)
ఐస్క్రీమ్లో మనిషి వేలు : కంపెనీ లైసెన్స్ రద్దు
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్క్రీమ్లో మనిషి బొటవేలు (Human Finger) వచ్చిన ఘటనలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పందించింది. వివాదానికి కారణమైన ఐస్క్రీమ్ తయారీదారు లైసెన్సును రద్దు చేసింది. దీనిపై దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఎ) అధికారులు శుక్రవారం పుణేకు చెందిన ఐస్క్రీమ్ యూనిట్లను సందర్శించారు. నమూనాలను సేకరించారని అధికారులు తెలిపారు. అనంతరం ఫార్చ్యూన్ డెయిరీకి చెందిన యమ్మో కంపెనీ లైసెన్స్ను రద్దు చేసినట్టు పూణే రీజియన్ ఎఫ్డిఎ జాయింట్ కమిషనర్ సురేష్ అన్నపురే తెలిపారు. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇంకా రాలేదని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఐస్క్రీంలో ఆ ‘ముక్క’ చూసి డాక్టర్కు కక్కొచ్చినంత పనైంది!తన సోదరి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్క్రీమ్లో మనిషి వేలు కనిపించిందంటూ ముంబైలోని మలద్ ప్రాంతానికి చెందిన వైద్యుడు బ్రెండన్ ఫిర్రావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం కోన్ ఐస్క్రీమ్ తింటుండగా గట్టిగా ఏదో తగిలింది. వెంటనే అనుమానం రావడంతో దాన్ని పరిశీలించి చూడగా చిన్న మాంసపు ముక్క కనిపించింది. ఇది చూసి షాకైన ఫిర్రావ్ ఇన్స్టాగ్రామ్లో కంపెనీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దీంతో మలద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు ఆ ముక్కను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. దీనికి సంబంధించిన వివరాలను ఫిర్రావ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ స్టోరీ నెట్టింట్ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే..
![-](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/688_1.jpg.webp?itok=4PnK1EZj)
ఎర్రగడ్డ ఆస్పత్రి పైనుంచి దూకి మానసిక రోగి ఆత్మహత్య
రహమత్నగర్: చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తి ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోరబండ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి నాంపల్లి ఓంనగర్కు చెందిన నర్సింగరావు50) మానసిక వ్యాధితో బాధపడుతూ పదేళ్లుగా ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం తన కుమారుడు దీపక్తో కలిసి ఆస్పత్రికి వచ్చిన నర్సింగరావు వాష్ రూంకు వెళ్తున్నట్లు కుమారుడికి చెప్పి మొదటి అంతస్తు పై నుంచి కిందికి దూకాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బోరబండ పోలీసులు పేర్కొన్నారు.
![Assault on a woman volunteer](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/attack.jpg.webp?itok=4GcqdA5W)
మహిళా వలంటీర్పై దాడి
వేమూరు: గ్రామ వలంటీర్పై టీడీపీ కార్యకర్తలు మహిళలతో దాడి చేయించి కొట్టిన ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం చంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన పమిడిపాగుల జ్యోతి అనే మహిళ గ్రామ వలంటీర్గా పని చేస్తోంది. వలంటీర్లపై కూటమి నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్నికల ముందు ఆమె రాజీనామా చేశారు. కాగా.. ఎన్నికల్లో గెలిచాక టీడీపీ కార్యకర్తలు జ్యోతిని లక్ష్యంగా చేసుకుని వేధించటం మొదలుపెట్టారు. నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిపై ఇటుక రాళ్లతో దాడి చేశారు. ‘మీ వైఎస్సార్సీపీ పార్టీ గెలవాలని ఓట్లు వేయించి తెగపాకులాడావుగా గొప్ప వాలంటీరు. ఇప్పుడు మాది రాజ్యం. నీ అంతు చూస్తాం. జై టీడీపీ, జై కూటమి’ అంటూ ఆ ఇంటి గోడపై పోస్టర్ అతికించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. మరుసటి రోజునుంచి స్కూల్కెళ్తున్న జ్యోతి పిల్లలను దూషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బజారు నుంచి ఇంటికెళ్తున్న జ్యోతిపై కొందరు మహిళలతో టీడీపీ నాయకులు దాడి చేయించి కొట్టించారు. కిందపడిపోయిన జ్యోతిని వేమూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె స్పృహ కోల్పోవటంతో 108 అంబులెన్స్లో తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ వేమూరు ఇన్చార్జి వరికూటి అశోక్బాబు హుటాహుటిన వేమూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి జ్యోతిని పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటిపై రాళ్లురువ్వి పోస్టర్ అతికించినట్టు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవటంపై పోలీసులను ప్రశ్నించారు. ఆ కేసుతో పాటు ఆదివారం జరిగిన దాడిపై కేసులోనూ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తేనే పోలీస్ స్టేషన్ నుంచి వెళతానని పట్టుబట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటిపై జరిగిన రాళ్ల దాడిపై ఎఫ్ఐఆర్ తర్వాత ఇస్తామని ఎస్ఐ నాగరాజు వెల్లడించారు. వరికూటి అశోక్బాబు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడైనా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడితే సహించబోమన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, తనతోపాటు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతపై దాడి.. వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని బచ్చులవారిపాలెంలో వైఎస్సార్సీపీ నేత బచ్చుల బంగారు బాబు పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో శనివారం రాత్రి గంగమ్మ తల్లి కొలుపులు జరుగుతున్నాయి. అదే అదునుగా గ్రామంలో టీడీపీకి చెందిన ప్రధాన నాయకుడు వారి అనుచరులు నలుగురికి మద్యం తాగించి బంగారుబాబుపై దాడికి తెగబడ్డారు. దీంతో బంగారుబాబు తలకు తీవ్రగాయం అయ్యింది. అక్కడే ఉన్న కొంతమంది మహిళలు దాడిని అడ్డుకోవడంతో అతడిని వదిలేశారు. కాగా, బంగారుబాబు వైఎస్సార్సీపీ తరఫున గ్రామంలో ప్రచారం చేసి ఓట్లు వేయించాడు. టీడీపీ చెందిన ఒక నాయకుడు గ్రామంలో టీడీపీ తరఫున పోటీ చేసిన మన సామాజిక వర్గం నాయకుడు కొండయ్యకు గ్రామం మొత్తం ఓట్లు వేద్దామని బంగారు బాబును అడిగారు. అందుకు అతను ఒప్పుకోకపోగా వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో టీడీపీ ఓట్లు చీలుస్తావా అని చెప్పి వారికి సంబంధించిన కొంత మందికి మద్యం తాగించి బంగారు బాబుపై దాడి చేయించాడు. తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయాడు. తనకు, తన వర్గం వారికి రక్షణ కల్పించాలని కోరుతూ వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
![Fast track court on Katnapalli incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/katnapalli.jpg.webp?itok=4oYa_k5c)
కాట్నపల్లి ఘటనపై ఫాస్ట్ట్రాక్ కోర్టు
సుల్తానాబాద్ రూరల్(పెద్దపల్లి), పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని రైస్మిల్లు సమీపంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ పై హత్య చేసిన దారుణ ఘటనలో నిందితుడికి సత్వరమే శిక్ష పడేలా ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క, ఐటీ, పురపాలక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.సీఎం రేవంత్రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి వర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కాట్నపల్లిలోని ఓ రైస్మిల్లులో పనిచేస్తున్న దంపతుల ఆరేళ్ల కూతురిని బీహార్కు చెందిన యువకుడు ఈనెల 14న అపహరించి హత్యాచారం చేసిన ఘటన తమను కలచివేసిందన్నారు. మంత్రులు సీతక్క, శ్రీధర్బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ఆదివారం రైస్మిల్లు సమీపంలోని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ, హత్యాచార ఘటనపై సీఎంతోపాటు మంత్రివర్గం, ఎంపీ, ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. నిందితునికి త్వరగా శిక్ష పడేలా చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు చర్యలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.8లక్షలు బాధిత కుటుంబానికి రైస్మిల్లు యాజమాన్యం నుంచి రూ.5.50లక్షలు ఇప్పించాలని, ప్రభుత్వం ద్వారా మరో రూ.2.50లక్షలు పరిహారం అందించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. అదే విధంగా చిన్నారి తండ్రికి ఉద్యోగావకాశం కల్పించడంతో పాటు సొంతిల్లు మంజూరు చేసేలా వారి స్వస్థలం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్తో చర్చించామని ఆయన తెలిపారు. మంత్రుల వెంట కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం సీపీ శ్రీనివాస్ ఉన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం తెలంగాణను డ్రగ్స్రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది కాట్నపల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీతక్క స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా, విక్రయాలపై నిరంతర నిఘా పెంచి వాటిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. మంత్రులు పెద్దపల్లిలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, మత్తులో ఉండడంవల్లే సుల్తానాబాద్ రైస్మిల్లులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగిందని భావిస్తున్నామన్నారు.