ఇక్కడ పాడింది లతా మంగేష్కర్‌ కాదు..! | 2 Million Views For Woman's Melodious Rendition Of Lata Mangeshkar Song | Sakshi
Sakshi News home page

ఇక్కడ పాడింది లతా మంగేష్కర్‌ కాదు..!

Aug 1 2019 3:39 PM | Updated on Mar 20 2024 5:21 PM

ఈ వీడియోను వింటే లతా మంగేష్కర్‌ పాడుతుందేమో అనిపిస్తుంది. కానీ పొరపాటు.. రైల్వే స్టేషన్‌లో ఒక సాధారణ మహిళ తన గాత్రంతో అందరినీ మంత్రముగ్ధులని చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని రానాఘాట్‌  రైల్వే స్టేషన్‌లో  ఓ మహిళ పాడిన పాట మిలియన్ల వ్యూస్‌ను సంపాదించింది. రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ పాట ఏక్‌ ప్యార్‌ క నగ్మా హై అంటూ సాగుతుంది. 1972లో లతా మంగేష్కర్‌ పాడిన ఈ పాట  అందరినీ అలరించగా మరోసారి ఈమె గాత్రంతో ఆకట్టుకుంది. అయితే ఆమె టాలెంట్‌ను వీడియో తీసిన కృష్ణదాస్‌ అనే వ్యక్తి ఆదివారం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ‘ఎంత మనోహరమైన గొంతు..’ అంటూ ఆమెను నెటిజన్లు ఆకాశానికి ఎత్తారు. గతంలోనూ రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి అద్భుతంగా పాడగా అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే..!

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement