నేటి నుంచి శీతాకాల సమావేశాలు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి శీతాకాల సమావేశాలు

Published Fri, Dec 15 2017 7:09 AM

నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ సమావేశాలపై పడనుంది. అయితే, రెండు సభల్లోనూ మొదటి రోజు ఎలాంటి కార్యక్రమాలు ఉండవు. గత సమావేశాల అనంతరం చనిపోయిన సభ్యుల మృతికి సంతాపం ప్రకటించిన తర్వాత సోమవారానికి వాయిదా పడనున్నాయి. ఆ రోజే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సమావేశాల్లో 14 కొత్త బిల్లులతోపాటు 25 పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Advertisement
Advertisement