చంద్రబాబునాయుడు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టటం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఓ నెగిటివ్ మనిషి అని మండిపడ్డారు. గతంలో తొమ్మిదేళ్లు, గడిచిన ఐదేళ్లు రాష్ట్రానికి చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యమని ఆయన విమర్శించారు.