ఈనాటి ముఖ్యాంశాలు

శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకుంది. ఈ నేపథ్యంలో ఆలయంలోకి ప్రవేశించేందుకు వచ్చిన పది మంది మహిళలను పోలీసులు తిప్పిపంపారు.తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్షకు దిగారు. ఇందిరాపార్క్‌ వద్ద దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో బీఎన్‌రెడ్డి నగర్‌లో ఆయన నివాసంలోనే దీక్షకు దిగారు. టీడీపీ నేతలు తనపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

Telugu News

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top