ఈనాటి ముఖ్యాంశాలు
పెనుకొండలో కియా మోటర్స్ ప్లాంట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం అనే పేరుతో వైయస్ఆర్సీపీ నేతృత్వంలో గుంటూరులో గురువారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇకపోతే, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సార్థక నామధేయుడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటితోపాటూ మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వాలు, పోలీసులు అనుసరిస్తున్న తీరుకు సవాలుగా నిలిచిన దిశ అత్యాచారం, హత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇదిలా ఉండగా, పీఏసీ కమిటీ ఛైర్మన్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీని ఎన్నుకున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గేటు వద్ద గవర్నర్ జగదీప్ ధంకర్ నిరసనకు దిగారు. గురువారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు