ఈనాటి ముఖ్యాంశాలు | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Sun, Nov 10 2019 7:09 PM

హైదరాబాద్‌ పేట్‌ బషీరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. మరికాసేపట్లో వివాహం జరుగుతుంది అనగా వరుడు సందీప్‌ కళ్యాణమండపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అంబర్‌పేటలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో గోడకూలి నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.గోల్నాక పెరల్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఉదయం వివాహం జరుగుతుండగా వేదిక వెనుక ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు  అనుమానితుడిగా భావిస్తూ ఓ వ్యక్తిని పెద్దతిప్ప సముద్రంలో అరెస్టు చేశారు.

Advertisement
Advertisement