భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహీంద్రసింగ్ ధోని మంగళవారం పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ధోనికి ప్రశాంతి నిలయంలో ఘన స్వాగతం పలికారు. ధోని పర్సనల్ డాక్టర్ ముత్తు.. పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిటింగ్ డాక్టర్గా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ ముత్తు కోసం ధోని పుట్టపర్తి వచ్చి పుట్టపర్తి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆసుపత్రిని పరిశీలించిన ధోనికి బాబా విశిష్టత, సేవా కార్యక్రమాను ట్రస్ట్ సభ్యులు వివరించారు. పర్సనల్ డాక్టర్ పుట్టపర్తిలో ఉండటంతో వైద్య పరీక్షల నిమిత్తం పుట్టపర్తికి వచ్చారని కెప్టెన్ కూల్ వెల్లడించారు. అనంతరం సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ధోనిని ఘనంగా సన్మానించారు.
సత్యసాయి సమాధిని దర్శించుకున్న ధోని
Feb 11 2020 3:17 PM | Updated on Mar 22 2024 11:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement