మంత్రికి మసాజ్‌ చేసిన కార్యకర్తలు | UP minister Nand Gopal gets foot massage by BJP workers | Sakshi
Sakshi News home page

Nov 15 2017 12:06 PM | Updated on Mar 21 2024 10:58 AM

పార్టీ కార్యకర్తలతో కాళ్లు పట్టించుకుంటుండగా కెమెరాకు చిక్కారు ఓ బీజేపీ మంత్రి. యూపీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. అలహాబాద్ సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉత్తర్‌ ప్రదేశ్‌ మంత్రి నందగోపాల్ వరండా మీద పడుకుని ఉండగా.. బీజేపీకి చెందిన ఓ కార్యకర్త ఆయన కాళ్లు పట్టారు. ఆ తర్వాత మరో కార్యకర్త కూడా మంత్రి కాళ్లు పట్టుకొని మసాజ్‌ చేశారు. మంత్రి వరండాపై ప్రశాంతంగా పడుకోగా, ఆయన తల దగ్గర అలహాబాద్ నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్షవర్ధన్ బాజ్‌పాయ్ కూర్చుని ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement