యాదాద్రి భువనగిరి : ప్రాణాంతక కరోనా విజృంభిస్తున్న వేళ యాదాద్రి ఆలయ అర్చకులు శనివారం లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా భక్తులకు తీర్థం ఇవ్వడాన్ని ఆలయ అధికారులను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనం కోసం పంచాయితీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆలయానికి రాగా నిబంధనలకు విరుద్ధంగా.. ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉండగా.. నేడు మంత్రి ఎర్రబెల్లి పుట్టినరోజు సందర్భంగా.. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు తన నియోజక వర్గంలో తమకు తోచిన విధంగా వేడుకలు నిర్వహిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే దాదాపు ఎనిమిది మంది ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
యాదాద్రి: లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన
Jul 4 2020 6:44 PM | Updated on Mar 21 2024 7:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement