‘దేశంలో ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేదు’
రైతు భరోసా కేంద్రాలతో చాలా ఉపయోగాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురుసాల కన్నబాబు తెలిపారు. రైతును కాపాడుకుంటే రాష్ట్రాన్ని కాపాడుకున్నట్లేనని అన్నారు. రైతుబంధు పథకంపై కన్నబాబు మంగళవారం అసెంబ్లీలో చర్చను ప్రారంభించారు. వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధునాతన వ్యవసాయ పద్ధతులను.. వర్క్షాప్లో అందించే కార్యక్రమం చేస్తామన్నారు. టెక్నాలజీని అనుసంధానం చేసి రైతులకు మెరుగైన సాయం చేస్తామని పేర్కొన్నారు. రైతుకు అవసరమైన విద్యను అందించేలా లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు