ఫలితాల వెల్లడిలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే

 తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ అంగీకరించారు. ఇంటర్‌ బోర్డు పరీక్షా పత్రాలను పారదర్శకంగా, నాణ్యత కూడిన మూల్యాంకనం చేపట్టిందని, దాదాపు అంతా సక్రమంగా జరిగిందని ఆయన చెప్పారు. ఇంటర్‌ పరీక్షా ఫలితాల వెల్లడిలో అవకతవకలు, ఇంటర్‌ విద్యార్థుల బలవన్మరణాల నేపథ్యంలో సోమవారం  విద్యార్థుల తల్లిదండ్రులు, పలు పార్టీల శ్రేణులు ఇంటర్‌ బోర్డు ముందు పెద్ద ఎత్తున ధర్నా, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దీంతో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top