చంద్రబాబు సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు | High Court Says AP Government Should Follow CEC Orders | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు

Mar 29 2019 11:16 AM | Updated on Mar 21 2024 10:58 AM

చంద్రబాబు సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీలో అధికారుల బదిలీలకు సంబంధించి సీఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే సీఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. ఈసీ ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. బదిలీలపై ఏపీ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. అంతేకాకుండా ఈసీ ఆదేశాలను శిరసావహించాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement