మెడికల్ అన్ఫిట్, విధి నిర్వహణలో మరణించిన సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు రూ.25 లక్షలను ఏకమొత్తంగా చెల్లింపు, లేదా ప్రతి నెలా రూ.25 వేల భృతి చెల్లింపు ప్రతిపాదనలకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ పాలక మండలి ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తెచ్చేందుకు త్వరలో సంస్థ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేయనుంది. సోమవారం సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన సమావేశమైన పాలక మండలి.. అక్టోబర్ 8న సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ఆమోదించింది. ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ అన్ఫిట్, మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగానికి బదులు రూ.5 లక్షలు చెల్లించేవారు.
మెడికల్ అన్ఫిట్ ఉద్యోగులకు 25 లక్షలు
Oct 31 2017 6:50 AM | Updated on Mar 20 2024 3:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement