వరద ఉధృతికి భారీ చేపలు రోడ్లపైకి కొట్టుకొచ్చిన దృశ్యాల తాలూకు వీడియోలు అసోంలో నెలకొన్న పరిస్థితిని తెలియజేస్తున్నాయి. కలియాబోర్ వద్ద జలప్రవాహంలో మునిగిపోయిన జాతీయ రహదారిపై జనం గుమ్మికూడి ఉండగా.. పెద్దపెద్ద చేపలు అటుగా కొట్టుకొచ్చాయి. ప్రఖ్యాత కజిరంగా జాతీయ పార్కు 85 శాతం నీట మునగడంతో అక్కడి జంతుజాలం వరదలో కొట్టుకుపోయాయి. కాలువలో పడిపోయిన ఏనుగును, పొదల్లో చిక్కుకున్న ఖడ్గమృగం పిల్లను స్థానికులు కాపాడు. సంబంధిత వీడియోలను నందన్ ప్రతీమ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి.