తెలంగాణ జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చేందుకు హైకోర్టు సిద్ధమైంది. బుధవారం(22న) కాకుండా ఆదివారం(26న) నిర్వహించుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. అయితే ర్యాలీకి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని హైకోర్టుకు జేఏసీ తెలిపింది. శాంతియుత ర్యాలీ ఏర్పాట్ల వివరాల గురించి న్యాయస్థానం అడిగింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేసింది.