గోదావరిలో పడవ బోల్తా | boat-upsets-in-godavari-2-killed | Sakshi
Sakshi News home page

Jun 3 2014 8:06 PM | Updated on Mar 20 2024 5:04 PM

గోదావరి నదిలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మత్స్యకారులు మరణించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలో పడవ బోల్తాపడింది. బలమైన ఈదురు గాలులకు పడవ తిరగబడింది. ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు. మరో ముగ్గురిని సురక్షితంగా రక్షించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. రాష్ట్రంలో పలు చోట్ల బలమైన ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement