
●కనీస వసతులు కరువు
కడప అగ్రికల్చర్: బదిలీల్లో నేతల సిఫారస్సులకే పెద్ద పీట వేస్తున్నారా..? పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతున్నాయా? లెటర్ల పేరిట పచ్చ నేతలు దందా సాగిస్తున్నారా?... అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా జరుగుతున్న వ్యవసాయ, ఉద్యాన సహాయకుల కౌన్సెలింగ్ కేంద్రానికి ‘దేశం’ నేతల రాక దీనికి మరింత బలం చేకూరిస్తోంది. వెరసి కూటమి హయాంలో బదిలీలంటనే ఉద్యోగులు హడలెత్తిపోతున్న పరి స్థితి నెలకొంది. వివరాలల్లోకి వెళితే.. గ్రామ సచి వాలయాల్లో ఐదేళ్లుగా పనిచేస్తున్న వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు శనివారం కలెక్టరేట్లోని ఉద్యాన, వ్యవసాయశాఖల్లో బదిలీ కౌన్సెలింగ్ను నిర్వహించారు. ఈ ప్రక్రియలో అధికార ఎమ్మెల్యేల సిఫారస్సు లేఖలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది తమకు అనుకూల స్థానాలకు స్థానిక ఎమ్మెల్యేల నుంచి లెటర్లతోఫాటు ఫోన్లలో కూడా సిఫారస్సు చేసినట్లు కౌన్సెలింగ్ కేంద్రంలో చర్చ సాగింది. అధికారులు వాటికే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఇందుకు బలం చేకూరుస్తూ కడప నగరానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు హరిప్రసాద్ కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చి అధికారులతో మాట్లాడి తనకు అనుకూలమైన వారికి వారు కోరుకున్న స్థానాలను ఇప్పించినట్లు చర్చసాగింది.
ఉద్యోగుల్లో అసంతృప్తి
ఈ బదిలీల్లో స్పౌజ్కు అసలు ప్రాధాన్యత కల్పించలేదని వ్యవసాయ, ఉద్యోగశాఖ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఐదేళ్లగా దూర ప్రాంతంలో పని చేసి ఇప్పుడు ‘స్పౌజ్’ కేటగిరీలో ఉన్నా మళ్లీ దూరప్రాంతాలకే వెళ్లాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కొంతమంది వికలాంగులకు కూడా అన్యాయం జరిగినట్లు తెలిసింది. అసలు మెడికల్ గ్రౌండ్స్ పరిగణలో లోకి తీసుకోలేదని పలువురు వాపోయారు. ఈ బదిలీల్లో ఎలాంటి నిబంధనలను పాటించకుండా కౌన్సెలింగ్ను నిర్వహించారని పలువురు ఉద్యాన, వ్యవసాయ సహాయకులు వాపోయారు.
వ్యవసాయ సహాయకులకు సంబంధించి...
జిల్లావ్యాప్తంగా పలు రైతు సేవా కేంద్రాలలో పనిచేసే 264 మంది వ్యవసాయ సహాయకులు ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని ఈ బదిలీలకు అర్హత సాధించారు. ఇందులో తొలి రోజు 175 మందికి కౌన్సెలింగ్ను నిర్వహించారు. ఇందులో సీనియా రిటీ ప్రకారం ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి ర్యాంకులు కేటాయించారు. అ ర్యాంకుల ప్రకారం కౌన్సెలింగ్కు పిలిపించి స్థానాలను కేటాయించారు. ఈ బదిలీల్లో ఏమాత్రం పారదర్శకత పాటించలేదని ఎమ్మెల్యేల లెటర్స్కే ప్రాధాన్యత కల్పించారని పలువురు వ్యవసాయ సహాయకులు తెలిపారు. ఈ విషయంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్తో మాట్లాడుతూ ఈ బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని ఎలాంటి రెకమండేషన్లను పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. ఏడీఏ మాధవి, అన్నమయ్య జిల్లా ఏడీ మజీద్ ఆహ్మద్, సూపరెండెంటెంట్ విజయశ్రీ, ఏవో శ్రీహరి పాల్గొన్నారు.
ద్యాన సహాయకులకు సంబంధింది...
ఉద్యాన సహాయకులకు సంబంధించి కూడా 177 మంది ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని బదిలీలకు అర్హత సాధించారు. వీరికి సంబంధించిన బదిలీలలో కూడా పలు ఆరోపణలు వినిపించాయి. ఈ బదిలీ కౌన్సిలింగ్ గురించి జిల్లా ఉద్యానశాఖ అదికారి రవిచంద్రబాబు మాట్లాడుతూ బదిలీలను చాలా పారదర్శకంగా నిర్వహించామన్నారు. అన్నమయ్య డీహెచ్ఓ సుబాషిణి, ఏపీ ఎంఐపీ పీడీ వెంకటేశ్వరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
కౌన్సెలింగ్ కేంద్రంలో ‘దేశం’ నేతలు
వ్యవసాయశాఖ బదిలీల్లో సిఫారస్సులకే పెద్ద పీట!
స్పౌజ్ కేసులకు, మెడికల్ గ్రౌండ్స్కు ప్రాధాన్యత కరువు
కౌన్సెలింగ్ కోసం వచ్చిన వ్యవసాయ, ఉద్యోగ సహాయకులకు అధికారులు ఎలాంటి సౌకర్యాలను కల్పించలేదు. కూర్చొనేందుకు కుర్చీలు లేక కొంత మంది నేలపై, , కార్యాలయ వసారాలలో కూర్చొని ఊసూరుమన్నారు. మరి కొంతమంది చిన్న బిడ్డల తల్లులు తమ పిల్లలకు పాలు తాపించేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. కనీసం మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదని ఉద్యోగులు వాపోయారు.

●కనీస వసతులు కరువు

●కనీస వసతులు కరువు

●కనీస వసతులు కరువు

●కనీస వసతులు కరువు