స్టీల్‌ ప్లాంట్‌ భూముల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

స్టీల్‌ ప్లాంట్‌ భూముల పరిశీలన

Jun 29 2025 2:49 AM | Updated on Jun 29 2025 2:49 AM

స్టీల్‌ ప్లాంట్‌ భూముల పరిశీలన

స్టీల్‌ ప్లాంట్‌ భూముల పరిశీలన

జమ్మలమడుగు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో భూ కేటాయింపులు చేసిన ప్రాంతంలోనే స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి జిందాల్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఇటీవల కడప లో జరిగిన మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో స్టీల్‌ప్లాంట్‌ పనులను జిందాల్‌ కంపెనీ యాజమాన్యం మొదటి విడత పనులు రూ.4500 కోట్లతో చేపడుతుందని ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం కడపకు చెందిన ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జిందాల్‌ ప్రతినిధులు మండల పరిధిలోని సున్నపురాళ్లపల్లె గ్రామం వద్ద స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించిన భూముల వివరాలను మ్యాప్‌ల ద్వార పరిశీలించారు. ఈ సందర్భంగా మరో రెండు రోజులు ఇక్కడే ఉండి పరిశీలిస్తారని.. సోమ వారం నుంచి కంపెనీ యాజమాన్యం పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించే అవకాశం ఉన్న ట్లు అధికారులు వివరించారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న స్టీల్‌ ప్లాంట్‌ పనులకు మోక్షం రాబోతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సర్వేయర్‌ హరి ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.

రెండు మూడురోజుల్లో రెగ్యులర్‌గా పనులు ప్రారంభించే అవకాశం

భూములు పరిశీలించినజిందాల్‌ ప్రతినిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement