
రేపు కౌన్సిల్ సమావేశం
ప్రొద్దుటూరు: స్థానిక మున్సిపల్ కార్యాలయ సభాభవనంలో ఈనెల 30న సోమవారం ఉదయం 10.30 గంటలకు కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సిల్ సభ్యులు, మన్సిపల్ అధికారులు పాల్గొనాలని ఆమె కోరారు.
రైల్వే కమర్షియల్
ఇన్స్పెక్టర్గా జనార్దన్
కడప కోటిరెడ్డిసర్కిల్: కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్గా జనార్దన్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న బి.సురేంద్రారెడ్డి తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ విభాగానికి బదిలీ అయ్యారు. ఎర్రగుంట్లలో పనిచేస్తున్న జనార్దన్ను కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్గా నియమించారు.
11 నుంచి పీజీ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంపీఈఎడీ, ఎం.సి.ఎ రెండో సెమిస్టర్ విద్యార్థులకు జులై నెల 11 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.
పక్కాగా బదిలీ ప్రక్రియ
కడప సెవెన్రోడ్స్: ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మేరకు పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని పంచాయతీరాజ్ జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ జీవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శనివారం తమ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. 377 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కడప ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్రెడ్డి, రాజంపేట ఈఈ రామచంద్ర నాయక్, రాయచోటి ఈఈ దయాకర్రెడ్డి, బద్వేలు ఈఈ లక్ష్మిపతిరెడ్డి పాల్గొన్నారు.
కొనసాగిన కౌన్సెలింగ్
కడప కార్పొరేషన్: వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్ రెండో రోజు కొనసాగింది. శనివారం ఉదయం 7.30 గంటల నుంచి వార్డు ఎమినిటీస్ సెక్రటరీలు, వార్డు అడ్మిన్ సెక్రటరీలు, వెల్ఫేర్ సెక్రటరీలు, ఎడ్యుకేషన్ సెక్రటరీలకు బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించారు. అత్యధిక శాతం మందికి ఏ మున్సిపాలిటీలో పనిచేస్తుంటే ఆ మున్సిపాలిటీ పరిధిలోనే బదిలీలు చేశారు. స్సౌజ్ కేసులు, మెడికల్ సంబంధిత కేసులు, ఉద్యోగుల అభ్యర్థన మేరకు ఒక మున్సిపాలిటీ నుంచి మరొక మున్సిపాలిటీకి కూడా బదిలీలు నిర్వహించారు.కమిషనర్ మనోజ్రెడ్డి, అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు.
డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాల యం అనుబంధం కళాశాలల డిగ్రీ హానర్స్ పరీక్ష ఫలితాలను వీసీ శ్రీనివాసరావు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కెఎస్వీ కృష్ణారావు తో కలసి విశ్వవిద్యాలయంలోని తన చాంబర్లో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు ఫలితాల కోసం https:www.yvu exam s.in/results.aspx అనే వెబ్సైట్ను సందర్శించాలని కృష్ణారావు సూచించారు. పరీక్షల నిర్వహణ సహాయ అధికారులు సుభోస్ చంద్ర, గణేష్ పాల్గొన్నారు.

రేపు కౌన్సిల్ సమావేశం