హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు

Jun 14 2025 7:27 AM | Updated on Jun 14 2025 7:27 AM

హత్యా

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు

ముద్దనూరు : మండలంలోని దేనేపల్లె గ్రామంలో ఈనెల 10వ తేదీన జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. గ్రామంలోని రామ్మోహన్‌ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో రామ్మోహన్‌ తలకు తీవ్రగాయాలయ్యాయి. హత్యాయత్నం కింద నమోదైన ఈ కేసులో నిందితులైన గూనివాండ్ల శివ, శివశంకర్‌, నరసింహ, ఉత్తయ్యలను అరెస్టు చేసినట్లు, మరో మైనర్‌ బాలుడిని కడపలోని జైవెనెల్‌ హోంకు తరలించనున్నట్లు సీఐ తెలిపారు.

కడపలో పేలిన ఐపీ బాంబ్‌

కడప అర్బన్‌ : కడప నగరంలోని చిన్నచౌక్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి ఐపీ బాంబ్‌ను పేల్చాడు. తనకు పరిచయమైన వ్యక్తుల నుంచి, బంధువుల నుంచి రూ. 1 వడ్డీతో డబ్బులను తీసుకుని, బయటి వ్యక్తులకు రూ. 3 నుంచి 5 రూపాయల వడ్డీలకు డబ్బులను అప్పుగా ఇచ్చేవాడు. ఈక్రమంలో తాను తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వకుండా కోర్టులో రూ.కోటి 30 లక్షలకు ఐపీ పిటీషన్‌ను దాఖలు చేసినట్లు సమాచారం.

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడప–కృష్ణాపురం రైలుమార్గంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ తెలిపారు. మృతునికి 30–35 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. మృతుడు తెల్లని ఫుల్‌షర్ట్‌పై బ్లూ కలర్‌ పూలు ఉన్నాయని, బ్లూ కలర్‌ లోయర్‌ ధరించి ఉన్నాడన్నారు. మృతుడు సున్తీ చేయించుకని మొలతాడు ధరించి ఉన్నాడన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు కడప రైల్వే ఎస్‌ఐ (సెల్‌ నెంబరు 94409 00811)కు సమాచారం అందించాలన్నారు.

ఉరి వేసుకుని మహిళ మృతి

కాశినాయన : మండలంలోని ఓబుళాపురం గ్రామానికి చెందిన నీలం అనురాధ (23) ఉరి వేసుకుని మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటిలో ఎవరు లేని సమయంలో తలుపు గడియ వేసుకుని ఉరి వేసుకున్నట్లు తెలిపారు. మృతురాలి భర్త వెంకటేశ్వర్లు సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. మృతురాలికి నాలుగు సంవత్సరాల కూతురు ఉందని తెలిపారు.

హత్యా.. రోడ్డు ప్రమాదమా?

కలసపాడు/పోరుమామిళ్ల : మండలంలోని జాతివర్టిపల్లె – చింతలపల్లె మధ్యలో శుక్రవారం ఎల్జిబెత్‌ (22) సామాజిక కార్యకర్త అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోరుమామిళ్ల మండలం కవలకుంట్ల గ్రామానికి చెందిన నారిపోగు ఓబయ్య కుమార్తె ఎల్జిబెత్‌ తమిళనాడులో మహిళలు, యువతులకు కుట్టు మిషన్‌లో శిక్షణ ఇప్పిస్తూ సామాజిక సేవ చేస్తున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. రెండు నెలల క్రితం ఎల్జిబెత్‌కు పెళ్లి సంబంధం చూస్తుండగా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. శుక్రవారం జాతివర్టిపల్లె – చింతలపల్లె మధ్య ప్రధాన రహదారిలో ఎల్జిబెత్‌ విగత జీవిగా పడి ఉందన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోరుమామిళ్ల, కలసాపాడు పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి సోదరుడు, బాబాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై కలసపాడు ఎస్‌ఐ తిమోతిని వివరణ కోరగా ఎల్జిబెత్‌ కారు ప్రమాదానికి గురై మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి ఓబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

హత్యాయత్నం కేసులో  నిందితుల అరెస్టు 1
1/3

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు

హత్యాయత్నం కేసులో  నిందితుల అరెస్టు 2
2/3

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు

హత్యాయత్నం కేసులో  నిందితుల అరెస్టు 3
3/3

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement