
సికిందర్ హుస్సేన్కు లెజెండ్ అవార్డు
– 50 సార్లు రక్తదానం చేసినందుకు సన్మానం
కడప ఎడ్యుకేషన్ : నగరంలోని 27వ డివిజన్ గౌస్ నగర్లో శుక్రవారం జెకె జనం కోసం యూత్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 50 సార్లు రక్తదానం చేసిన మను పాలిటెక్నిక్ కళాశాల ప్రొఫెసర్ మహమ్మద్ సికిందర్ హుస్సేన్ను ఘనంగా సత్కరించి లెజెండ్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకులు లయన్ పటాన్ ఖాదర్బాషా మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. రక్తదానం చేయడంతో పాటు ఎంతో మందిని అవగాహన చేసిన మహమ్మద్ సికిందర్ అభినందనీయుడన్నారు. నేటి యువత అతడిని ఆదర్శంగా తీసుకొని మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు అమానుల్లా షేక్, నారాయణ, జాకీర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.