
అందరిలో జోష్ నింపుతూ...
డాక్టర్ వేణుగోపాల్ ఇప్పటికి 110 సార్లు వ్యక్తిగతంగా రక్తదానం చేశారు. అందుకోసం ఆయనకు రాష్ట్ర గవర్నర్ ప్రత్యేకంగా రక్తదాతల దినోత్సవ సందర్బంగా ఆయనను పిలిపించి ఘనంగా సత్కరించారు. ప్రతి సంవత్సరం ఆయన రక్తదానం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఏ చిన్న అవకాశం లభించినా స్వయంగా వెళ్లి రక్తదాతకు అవసరమైన సహకారం అందజేస్తున్నారు. ఈ చుట్టుప్రక్కల దాదాపు 110 సార్లు రక్తదానం చేయడం నిజంగా అరుదైన విషయం. డాక్టర్ వేణుగోపాల్ అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన వారు. చిట్వేలి హైస్కూలులో ఆయన మొదటి సోదరుడు డాక్టర్ చంద్రశేఖర్, మరో సోదరుడు దొండ్లవాగు శ్రీనివాసులు కూడా ఓవైపు సామాజిక సేవారంగంలో తలమునకలుగా ఉంటూ వేలాది మందితో మొక్కలు నాటే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. వేణుగోపాల్ తాను హాజరయ్యే కార్యక్రమాలతోపాటు ఇలా పలుమార్లు రక్తదానం చేసేందుకు స్పూర్తినిస్తున్నారు. మహిళలు కూడా ఎక్కువ మంది ఈ రంగం నుంచి రావాలన్న ఆశయంతో ఆయన మహిళలను కూడా ప్రోత్సహిస్తున్నారు.