
బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి
కడప రూరల్ : వైద్య ఆరోగ్యశాఖలో నిర్వహించే బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం స్థానిక ఆ శాఖ ప్రాంతీయ కార్యాలయంలో రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్యకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆఫీస్ బేరర్లకు బదిలీల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన తొమ్మిదేళ్ల మినహాయింపును ఇవ్వాలన్నారు. బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు వెంగల్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర సహాయ అధ్యక్షులు దస్తగిరి రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రసాద్ యాదవ్, జిల్లా కార్యదర్శి రవికుమార్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.