
85 మందికి పదోన్నతి
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా జెడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్స్కు గ్రేడ్ –2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. కడపలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్లో డీఈఓ షేక్ షంషుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కౌన్సెలింగ్లో జిల్లావ్యాప్తంగా జెడ్పీ హైస్కూల్స్లో పనిచేస్తున్న 85 మంది స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులను కల్పించినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఏడీ మునీర్ఖాన్, డీసీఈబీ సెక్రటరీ విజయబాస్కర్రెడ్డి, డీఈఓ కార్యాలయ సిబ్బంది నాగేశ్వరెడ్డి, ఏసన్న, సాయి, నిఖిల్, బాష తదితరులు పాల్గొన్నారు.