
దేశం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధం
ప్రొద్దుటూరు: దేశం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికై నా సిద్దంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత్ – పాకిస్థాన్ యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్ చిత్రపటానికి శనివారం రాచమల్లు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మురళీనాయక్ యుద్ధంలో మరణించి కోట్లాదిమంది భారతీయుల గుండెల్లో జీవించి ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ దేశం మనకేమి ఇచ్చింది అనే దాని కంటే దేశానికి మనం ఏమిచ్చామని ప్రశ్నించుకోవాలన్నారు. ఉగ్రవాదులు ఉద్దేశ్యపూర్వకంగానే మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే పహల్గాంలో దాడులకు తెగబడ్డారన్నారు. మన ది భిన్నత్వంలో ఏకత్వమైన దేశమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ మినహా ఏ ఒక్కరూ ముస్లింలను తప్పుపట్టడం లేదన్నారు.
నెల పింఛన్ జాతీయ నిధికి చెల్లిస్తా..
ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ వాతావరణంలో మన దేశానికి మనమందరం అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం పిలుపునిస్తే లైట్లను అర్పడం, సంఘీభావం తెలపడం వంటి కార్యక్రమాలను చేయాలని కోరారు. తనవంతు సాయంగా మాజీ ఎమ్మెల్యేను అయిన తనకు వచ్చే నెల పింఛన్ మొత్తాన్ని జాతీయ నిధికి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ జేస్టాది శారత, మున్సిపల్ వైస్ చైర్మన్ అయిల్ మిల్లు ఖాజా, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షులు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాల అధ్యక్షులు మార్తల ఓబుళరెడ్డి, బాణా వెంకటకొండారెడ్డి, కౌన్సిలర్లు రాగుల శాంతి, గుర్రం లావణ్య, సత్యం, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, అనిల్, ఆల్ ఇండియా రేడియో మాజీ డైరెక్టర్ నాగులారపు విజయసారథి, గోపవరం ఉప సర్పంచ్ రాఘవరెడ్డి, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షులు దేశ్ రామోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
మురళీ నాయక్ చిత్రపటానికి నివాళి