పులివెందుల రూరల్ : జిల్లా లోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పులివెందుల పట్ట ణంలోని పాత ప్రభుత్వాసుప త్రి సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పో లీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతాప్(30) అనే వ్యక్తి పట్టణంలో పెయింట్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, ఒక కు మారుడు ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కడుపు నొప్పి తాళలేక..
కొండాపురం : మండల పరిధిలోని టి.కోడూరు గ్రామంలో ఓ యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తాళ్లప్రొద్దుటూరు ఏఎస్ఐ ఆర్.బాసు వివరాల మేరకు.. మండలంలోని టి. కోడూరు గ్రామానికి చెందిన బుండన్నగారి రాజ వంగనూరు సమీపంలోని జాతీయ రహదారి పక్కన మొబైల్ క్యాంటీన్ పెట్టుకొని జీవనం సాగించే వాడు. బుడన్నగారి రాజ పెద్ద కుమార్తె బి.నవ్యశ్రీ(17) థైరాయిడ్తోపాటు కడుపు నొప్పి తాళలేక ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతిదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.