
పేదలకు వరంలా బీబీనగర్ ఎయిమ్స్
బీబీనగర్ : బీబీనగర్లోని ఎయిమ్స్ వైద్య కళాశాల తెలంగాణ ప్రాంతంలోని పేదలకు వరంలా మారిందని ఎయిమ్స్ బోర్డు మెంబర్, ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం ఆమె ఎయిమ్స్ను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రి ప్రాంగణంలో కొనసాగుతున్న నిర్మాణ పనుల గురించి ఎయిమ్స్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. త్వరలో బీబీనగర్ ఎయిమ్స్పై కేంద్ర ప్రభుత్వం సమీక్ష జరపనుందని, దీంతో ఎయిమ్స్ను సందర్శించి వివరాలు తెలుసుకోవడం కోసం వచ్చినట్లు తెలిపారు. అతి తక్కువ ధరలకే వైద్య సేవలు, స్కానింగ్, ఇతర ల్యాబ్ పరీక్షలు జరుతున్నాయని దీంతో పేద ప్రజలకు ఎయిమ్స్లో చికిత్స పొందడం ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. దూర ప్రాంతాల నుంచి సైతం ఎయిమ్స్కు వచ్చి ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారని అన్నారు, పేద ప్రజల కోసం ఉపయోగపడే విధంగా ప్రధాన మంత్రి మోదీ ఎయిమ్స్ వైద్య కళాశాలలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. మరో ఏడాది లోపు బీబీనగర్ ఎయిమ్స్లో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని, నిర్మాణాలు సైతం పూర్తవుతాయని ఆమె చెప్పారు. ఆమె వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి, భువనగిరి జిల్లా అధ్యక్షుడు అశోక్గౌడ్ ఉన్నారు.
ఫ ఏడాదిలోపు పూర్తిస్థాయిలో వైద్య
సేవలు అందుబాటులోకి వస్తాయి
ఫ ఎయిమ్స్ బోర్డు మెంబర్,
ఎంపీ డీకే అరుణ