గుట్ట ఈఓగా వెంకట్రావ్‌ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

గుట్ట ఈఓగా వెంకట్రావ్‌ బాధ్యతల స్వీకరణ

May 1 2025 1:45 AM | Updated on May 1 2025 1:45 AM

గుట్ట

గుట్ట ఈఓగా వెంకట్రావ్‌ బాధ్యతల స్వీకరణ

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ఈఓగా వెంకట్రావ్‌ (ఐఏఎస్‌) బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా వెంకట్రావ్‌ను దేవాదాయశాఖ డైరెక్టర్‌గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. అదనంగా యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా బాధ్యతలు అప్పగించింది. బుధవారం సాయంత్రం గర్భాలయంలో స్వయంభూలను దర్శించుకున్న అనంతరం ఈఓ చాంబర్‌లో బాధ్యతలు స్కీరించారు. ఆలయ రికార్డులను, పత్రాలను బదిలీ అయిన భాస్కర్‌రావు నూతన ఈఓకు అప్పగించారు. నూతన ఈఓ, బదిలీపై వెళ్తున్న భాస్కర్‌రావును అర్చకులు, ఆలయ ఉద్యోగులు సన్మానించారు. అనంతరం నూతన ఈఓ క్యూలైన్‌లో నిల్చున్న భక్తులను పలకరించారు. దర్శనానికి ఎక్కడి నుంచి వచ్చారు, క్యూలైన్లలో ఎలా ఉందని తెలుసుకున్నారు. అలాగే పెండింగ్‌ పనులు, నూతన నిర్మాణాలు, పూజలకు సంబంధించిన అంశాలను అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, పాత ఈఓ భాస్కర్‌రావు, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా భాస్కర్‌రావుకు ప్రభుత్వం ఇంకా పోస్టింగ్‌ ఇవ్వలేదు.

ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డికి ఘన సన్మానం

నల్లగొండ: డీఈఓ కార్యాలయ అసిస్టెంట్‌ ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తూ బుధవారం పదవీ విరమణ పొందిన ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డిని డీఈఓ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు డీఈఓ భిక్షపతి సన్మాన పత్రం అందజేశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ిపీఏగానూ సేవలు అందించిన ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని అన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో ఉండాలని డీఈఓ ఆకాంక్షించారు. డీఈఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డి, జ్యోతి దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బురి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, విద్యాశాఖ ఏడీ రమాచారి, ఏసీజీఈ యూసుఫ్‌ షరీఫ్‌, ఏఎంఓ రామచంద్రయ్య, ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ సత్తెమ్మ, డీసీసీబీ కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్‌, యేసు ఆదినారాయణ, సూపరింటెండెంట్‌ మోహన్‌, మధుసూదన్‌రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

గుట్ట ఈఓగా వెంకట్రావ్‌ బాధ్యతల స్వీకరణ1
1/1

గుట్ట ఈఓగా వెంకట్రావ్‌ బాధ్యతల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement