
కాపుకాయరా?
పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం
ఏలూరులోని తమ్మిలేరులో దిగి ఓ మహిళ తన ముగ్గురు చిన్నారులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు రక్షించారు. 8లో u
విత్తన శుద్ధి కీలకం
వరి సాగులో విత్తన ఎంపిక, విత్తన శుద్ధి, సస్యరక్షణ వంటి వాటిపై రైతులు దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
8లో u
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025
తెప్ప తగలేసిన మాదిరి..
కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం, ఏరుదాటాక తెప్ప తగలెయ్యడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. కాపులకు న్యాయం చేయాలి, ఐదు శాతం రిజర్వేషన్ల కల్పనకు పవన్కల్యాణ్ చొరవ చూపాలి.
– కట్రెడ్డి రామ్మోహనరావు,
కాపు జేఏసీ నాయకుడు, పెదకాపవరం
చేయూత ఇవ్వాలి
రిజర్వేషన్ల అమలుతోనే కాపులకు న్యాయం జరుగుతుంది. కాపు రిజర్వేషన్ల అమలుకు గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ దిశగా ఐదు శాతం రిజర్వేషన్లను కూటమి ప్రభుత్వం అమలు చేసి కాపు వర్గాలకు చేయూతనివ్వాలి.
– వంటెద్దు ఈశ్వర ప్రసాద్,
తణుకు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు
మరోమారు ఉద్యమం
సీఎం చంద్రబాబు కాపు వ్యతిరేకి. కక్ష సాధింపులో భాగంగానే కోర్టు కొట్టివేసిన కేసుపై పునర్విచారణకు వెళ్లాలని చూశారు. ఇచ్చిన హామీ మేరకు కాపు రిజర్వేషన్లు అమలుచేయాలి. లేకుంటే రిజర్వేషన్ల సాధనకు మరోమారు ఉద్యమం తప్పదు.
– చినమిల్లి వెంకటరాయుడు, కాపునాడు జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ భీమవరం కో–ఆర్డినేటర్
సాక్షి, భీమవరం: కూటమి సర్కారుకు కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్పీఎస్) రాసిన బహిరంగ లేఖతో కాపు రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. కాపు సామాజికవర్గంలో తాజాగా ఈ లేఖ హాట్ టాఫిక్గా మారింది. ఎన్నికలు సందర్భంగా కాపు రిజర్వేషన్ల అమలుకు గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను కాపు నేతలు గుర్తుచేసుకుంటున్నారు.
అధికారంలో ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా..
తుని రైలు ఘటన కేసును కొట్టివేస్తూ 2023లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును చంద్రబాబు సర్కారు ఇటీవల తిరగదోడాలని చూసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజికవర్గం నుంచి వ్యతిరేకత రావడంతో ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకుంది. కాపు రిజర్వేషన్ల విషయమై ఇటీవల కేఆర్పీఎస్ విడుదల చేసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. కాపులకు రిజర్వేషన్ల హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారని లేఖలో ప్రశ్నించిన కేఆర్పీఎస్ గ త ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హా మీలు, అధికారంలోకి వచ్చాక ముఖం చాటేసిన వై నాలను ప్రస్తావించడంతో గతంలో సీఎం చంద్రబాబు చేసిన వంచనను చర్చించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రిజర్వేషన్లు అమలుచేస్తామని 2014లో హామీ ఇచ్చి తర్వాత గాలికొదిలేయడం, హామీ అమలు కోసం 2016 జనవరి 30న వేలాది మందితో తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు గర్జన నిర్వహించడం గుర్తు చేసుకుంటున్నారు. ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు గుర్తుతెలియని విద్రోహులు రైలు బోగీలకు నిప్పంటించగా నాటి టీడీపీ ప్రభుత్వం, రైల్వే పోలీసులు ఆందోళనకారులు, కాపులపై కేసులు పెట్టడం, తర్వాత వచ్చిన జగన్ సర్కారు వాటిలోని చాలా వరకు కేసులను ఉపసంహరించుకోగా, కొన్నింటిని న్యాయస్థానం కొట్టివేయడాన్ని స్మరించుకుంటున్నారు. సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని, బీసీలకు ఇబ్బంది కలగకుండా తమకు రిజర్వేషన్లు అమలుచేయాలని కోరుతున్నారు.
కాపులపై వివక్ష
ఎన్నికల్లో రిజర్వేషన్ల పేరిట కాపులను మభ్యపెట్టి చంద్రబాబు అధికారం చేపడు తున్నారు. కాపులపై వివక్ష తప్ప ప్రేమ లేదు. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉన్నా కాలయాపనం చేస్తున్నారు.
– నంద్యాల లక్ష్మీ సీతారామయ్య,
కాపునాడు జిల్లా కార్యదర్శి, కుప్పనపూడి
రాజకీయాల కోసమే..
కాపు రిజర్వేషన్ హామీలను సీఎం చంద్రబాబు మరిచిపోయారు. రాజకీయ అవసరాల కోసం కాపులను వాడుకుంటున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఐదు శాతం కాపులకు సబ్ కోటాగా కేటాయిస్తామన్నారు. అది భ్రమగానే మిగిలిపోయింది.
– పోలిశెట్టి వనమరాజు,
కాపు నేత, కొడమంచిలి
న్యాయం చేయాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కాపుల పాత్ర ఎంతో ఉంది. కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లో 5 శాతం కాపులకు ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేయాలి.
– బోనం సత్యనాగేంద్ర ప్రసాద్,
కాపు సంఘం అధ్యక్షుడు, యలమంచిలి
ఓటు బ్యాంకుగానే..
కాపులను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు. కాపు రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఈ విషయంపై దృష్టి సారించి సొంత సామాజికవర్గానికి న్యాయం చేయాలి.
– కావలి నాని,
కాపు సంఘం నేత, నరసాపురం
న్యూస్రీల్
కూటమి వివక్ష
చంద్రబాబుకు కేఆర్పీఎస్ లేఖతో తెరపైకి కాపు రిజర్వేషన్ అంశం
ఆరు నెలల్లోనే రిజర్వేషన్లు ఇస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ
తర్వాత గాలికొదిలేసిన వైనం
లేఖలోని అంశాలపై కాపు వర్గాల్లో చర్చ

కాపుకాయరా?

కాపుకాయరా?

కాపుకాయరా?

కాపుకాయరా?

కాపుకాయరా?

కాపుకాయరా?

కాపుకాయరా?

కాపుకాయరా?