
చంద్రబాబువి మోసపు హామీలు
తాడేపల్లిగూడెం అర్బన్: చంద్రబాబు మోసపు హామీల కత్తి మొనకు రాష్ట్ర ప్రజల జీవితాలు వేలాడుతున్నాయని, హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు, ఇప్పుడు చంద్రబాబు పాలన ను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారు. జగన్ ను మించి సంక్షేమ పాలన చంద్రబాబుకు సాధ్యం కాదని మరోసారి రుజువయ్యిందన్నారు. నేడు రాష్ట్రంలో అన్ని రంగాలు, వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ నిలుపుదల చేసి కార్పొరేట్ వైద్యం ప్రజలకు దూరం చేసిన అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచారని మండిపడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యార్థులకు సరిపడా భోజనం సరఫరా చేయడం లేదన్నారు. సూపర్సిక్స్ పథకాలు, సీ్త్రశక్తి, ఉచిత బస్సు, ప్రతి కుటుంబానికీ ఉద్యోగం, నిరుద్యోగభృతి రూ.3 వేలు, 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని కూటమి నాయకులను ప్రశ్నించారు.
కోడిపందేలు.. పేకాట క్లబ్లు
నియోజకవర్గంలో కోడిపందేలు, పేకాట క్లబ్లు, దందాలు, ఇళ్లు నిర్మించుకుంటున్న వారి నుంచి అక్రమ వసూళ్ల తీరుపై ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు. ప్రజాప్రతినిధులు తమ ద్వారా లబ్ధి పొందుతున్న వారితో కౌంటర్ ఆఫ్ ఫైర్ అనే కొత్త రీతిలో ప్రవర్తిస్తున్నారు తప్ప ప్రతిపక్ష నేతల ప్రశ్నలు జవాబు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. శాంతి, భద్రతలను నీరుగార్చిన ఘనత వీరికే దక్కిందన్నారు. పోలీసులు, అధికారులు విధుల్లో విఫలమయ్యారని మాజీ మంత్రి కొట్టు ఆరోపించారు.
అసమర్థ, అవినీతి పాలన
కూటమి ప్రభుత్వ అసమర్థ, అవినీతి పాలనపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జూలై నుంచి నిర్వహించే కార్యక్రమాలను నియోజకవర్గ నా యకులు, కార్యకర్తలు, అభిమానులు జయప్రదం చేయాలని కొట్టు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రతి కుటుంబానికీ ఏ మేరకు అందాయో రాత పూర్వక పత్రాల ద్వారా ప్రజల నుంచి వివరాలు సేకరించాలన్నారు. సూపర్ సిక్స్, పీ–4 పథకాలు వల్ల ప్రజలకు కలిగిన లబ్ధి వివరాలూ సేకరించాలన్నారు. అలాగే చంద్రబాబు ఎన్నికల సమయలో ప్రజలకు ఇచ్చిన బాండ్ల ద్వారా ప్రజలకు ఏమేరకు సంక్షేమ పథకాల లబ్ధి చేకూరిందో తెలుసుకోవాలని కోరారు. అనంతరం రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు క్యూర్ కోడ్, ముందు మాట, చంద్రబాబు మోసపు హామీల చిట్టా వంటి పలు రకాల పత్రాలను మంతి కొట్టు చేతులమీదుగా ఆవిష్కరించారు. పార్టీ నాయకులు కొలుకులూరి ధర్మరాజు, ముప్పిడి సంపత్కుమార్, ఎంపీపీ దాసరి హై మావతి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాలు హుస్సేన్ బీబీ, తాడిపర్తి రజని, జిడ్డు హరిబాబు, కై గాల శ్రీనువాసు, రెడ్డి సూరిబాబు, తాడేపల్లిగూడెం పట్టణ, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ